Badvel by election: బద్వేల్ ఉప పోరుకు ‘నై’ అంటున్న ఆ రెండు పార్టీలు.. ‘సై’ అంటున్న జాతీయ పార్టీ..

Badvel by election: బద్వేల్ ఉప పోరు రసవత్తరంగా మారుతోంది. నిన్నటి వరకూ అన్ని పార్టీలు ఈ ఎన్నికల పోటీలో ఉంటాయని భావించిన వారికి..

Badvel by election: బద్వేల్ ఉప పోరుకు ‘నై’ అంటున్న ఆ రెండు పార్టీలు.. ‘సై’ అంటున్న జాతీయ పార్టీ..
Somu Veerraju
Follow us

|

Updated on: Oct 03, 2021 | 8:18 PM

Badvel by election: బద్వేల్ ఉప పోరు రసవత్తరంగా మారుతోంది. నిన్నటి వరకూ అన్ని పార్టీలు ఈ ఎన్నికల పోటీలో ఉంటాయని భావించిన వారికి.. ఊహించని ట్విస్ట్‌లు ఎదురవుతున్నాయి. బద్వేల్ ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నామని జనసేన అధినేత పవన్ చేసిన ఊహించని ప్రకటనతో రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ సైతం అదే నిర్ణయాన్ని తీసుకుంది. తాము కూడా బద్వేల్ బరి నుంచి తప్పుకుంటున్నట్లు తాజాగా ప్రకటించింది. సాంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

అయితే, జాతీయ పార్టీ అయిన బీజేపీ మాత్రం బద్వేల్ బరిలో ఉంటామని కరాఖండిగా తేల్చి చెబుతోంది. మిత్రపక్షమైన జనసేన పోటీ నుంచి తప్పుకున్నా.. తాము తగ్గేది లేదని తేల్చి చెబుతోంది. తాజాగా బద్వేల్ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నామని పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో.. బీజేపీ అలర్ట్ అయ్యింది. పోటీకి జనసేన నై అన్నా.. బీజేపీ సై అంటోంది. ఇదే అంశంపై బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. బద్వేల్‌లో జనసేన అభ్యర్థిని పోటీ చేయమని తమ వైపు నుంచి కోరామన్నారు. అయితే, పార్టీలకు సిద్ధాంతాలు ఉంటాయని, వారి సిద్ధాంతం ప్రకారం బద్వేల్ ఉప పోరు నుంచి తప్పుకుంటున్నట్లు జనసేన ప్రకటించిందన్నారు. మిత్రపక్షమైన జనసేన నిర్ణయాన్ని తాము వ్యతిరేకించబోమన్న సోమువీర్రాజు.. బీజేపీ కూడా సిద్ధాంతం ప్రకారమే ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. బద్వేల్ బరిలో నిలుస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై జాతీయ అధినాయకత్వానికి సమాచారం అందించామన్నారు. అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

బీజేపీ, జనసేన ప్రజాక్షేత్రంలో కలిసి పని చేస్తామని సోము వీర్రాజు పేర్కొన్నారు. బీజేపీ సిద్ధాంతం ప్రకారం కుటుంబ రాజకీయాల్ని వ్యతిరేకిస్తుందని అన్నారు. భారతదేశ వ్యాప్తంగా కుటుంబ పాలన వ్యవస్థ విస్తరించిందని, ఏపీలో కూడా కుటుంబ పాలన సాగుతోందని పేర్కొన్నారు. దానికి వ్యతిరేకిస్తూనే బద్వేల్ ఎన్నికల పోటీలో నిలవాలని నిర్ణయించామన్నారు. ఇదే విషయాన్ని కేంద్రానికి నివేదించామన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న ప్రజావ్యతిరేకతను ఉప ఎన్నికలో ఎత్తి చూపుతామని సోము వీర్రాజు పేర్కొన్నారు. బద్వేల్‌లో రెండు జాతీయ రహదారులకు కేంద్రం నిధులు కేటాయించిందన్నారు.

Also read:

Vehicle Sales: వాహనాల విక్రయాలపై సెమీ కండక్టర్ దెబ్బ.. సెప్టెంబర్‌లో తగ్గిపోయిన కార్ల అమ్మకాలు!

Stock Market: లక్ష పెట్టుబడి.. ఐదేళ్లలో రూ.40 లక్షల లాభం!.. ఇది సాధ్యమే..

Koo App: కూ యాప్‌లో ఇప్పుడు స్థానిక భాషల అనువాదం.. సోషల్ మీడియాలో ఈ సదుపాయం ఉన్న మొదటి యాప్ ఇదే!

Sexual Harassment On Dog: 67 ఏళ్ల వయసులో పాడు బుద్ధి.. పెంపుడు కుక్కను వదలని వృద్ధుడు..

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు