AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: లక్ష పెట్టుబడి.. ఐదేళ్లలో రూ.40 లక్షల లాభం!.. ఇది సాధ్యమే..

అత్యంత త్వరగా డబ్బులు సంపాదించాలంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటారు. స్టాక్ మార్కెట్‎లో పెట్టుబడి పెట్టిన వారందరికి లాభాలొస్తాయా అంటే.. రావనే చెప్పాలి...

Stock Market: లక్ష పెట్టుబడి.. ఐదేళ్లలో రూ.40 లక్షల లాభం!.. ఇది సాధ్యమే..
Stock Markets
Srinivas Chekkilla
|

Updated on: Oct 03, 2021 | 8:03 PM

Share

అత్యంత త్వరగా డబ్బులు సంపాదించాలంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటారు. స్టాక్ మార్కెట్‎లో పెట్టుబడి పెట్టిన వారందరికి లాభాలొస్తాయా అంటే.. రావనే చెప్పాలి. స్టాక్ మార్కెట్‎లో పెట్టుబడి పెట్టి నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. మరి ఎలా అంటారా.. ఖచ్చితమైన అవగాహనతో స్టాక్ మార్కెట్‎లో పెట్టుబడి పెట్టాలి. అప్పుడే మంచి రిటర్స్‎ను వస్తాయి. ఇలా ఓ స్టాక్ ఇన్వెస్టర్లకు లక్షలు కురిపించింది. ఐదేళ్ల కింద లక్ష పెడితే ఇప్పుడు దాని విలువ రూ. 40 లక్షలకు చేరుకుంది.

క్వాలిటీ ఫార్మా కంపెనీ మదుపర్లకు ఎనలేని లాభాలను తెచ్చిపెట్టింది. ఐదేళ్ల క్రితం (2016, సెప్టెంబర్‌ 28) ఈ కంపెనీ షేరు ధర బీఎస్‌ఈలో రూ.21.75గా ఉండేది. 2021, అక్టోబర్‌ 1న ఆ షేరు రూ.878 వద్ద ముగిసింది. అంటే దాదాపు 40 రెట్లు పెరిగింది. ఇంకా చెప్పాలంటే చివరి నెల్లోనే ఈ షేరు ధర రూ.419 నుంచి రూ.878కి చేరుకుంది. దాదాపుగా 110 శాతం ర్యాలీ చేసింది. ఆరు నెలల క్రితం వరకు ఈ షేరు ధర రూ.54గానే ఉండటం గమనార్హం. అంటే అర్ధ సంవత్సరంలోనే 1530 శాతం పెరిగిందన్నమాట. ఇక ఏడాది క్రితం ఈ షేరు ధర రూ.61 మాత్రమే. మొత్తంగా ఐదేళ్ల కాలంలో రూ.21 నుంచి రూ.878 స్థాయికి చేరుకుంది. 3,940 శాతం పెరిగింది.

క్వాలిటీ ఫార్మాలో మదుపర్లు ఒక నెల క్రితం లక్ష రూపాయాలు పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు రూ.2.10 లక్షలు చేతికందేవి. అదే ఆరు నెలల క్రితం లక్ష పెట్టుంటే ఇప్పుడు రూ.16.30 లక్షలు వచ్చేవి. అదే ఏడాది క్రితం లక్ష పెట్టు బడి పెడితే ఈనాడు రూ.14.40 లక్షల రాబడి వచ్చేది. పదేళ్ల క్రితం ఈ మల్టీబ్యాగర్‌ స్టాక్‌లో లక్ష పెట్టుంటే ఇప్పుడు రూ.40 లక్షల లాభం వచ్చేది. అయితే ఈ స్టాక్ 2016 నుంచి 2020 వరకు చాలా తక్కువ స్థాయిలో పెరిగింది. 2020 నుంచి 2021 ఏప్రిల్ వరకు ఓ మొతాదులో పెరిగిన ప్రైస్ జూన్ నుంచి ర్యాలీ అవుతూ వస్తోంది. అయితే భవిష్యత్తులో ఈ స్టాక్ ప్రైస్ పెరుగొచ్చు లేక తగ్గొంచు.. ఎందుకంటే ఒకప్పుడు రూ. 393 ఉన్న యస్ బ్యాంకు షేరు ధర ప్రస్తుతం రూ.13గా ఉంది.

Read Also..Stock Market: పడుతున్న స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడికి ఇదే సరైన సమయమా.. వచ్చే వారం ఎలా ఉండబోతుంది?

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?