AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రగతి బీజేపీతోనే సాధ్యం.. డాక్టర్ వినూష రెడ్డి..

మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ వినూష రెడ్డి అన్నారు. విభజన తర్వాత రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. 2014 లో కేంద్రంలో..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రగతి బీజేపీతోనే సాధ్యం.. డాక్టర్ వినూష రెడ్డి..
Doctor Vinusha Reddy
Ganesh Mudavath
|

Updated on: Nov 12, 2022 | 1:08 PM

Share

( నోట్.. ప్రధాన మంత్రి నరేంద్ మోడీ విశాఖ పర్యటన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ వినూష రెడ్డి అందించిన ప్రత్యేక కథనం )

మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ వినూష రెడ్డి అన్నారు. విభజన తర్వాత రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. 2014 లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని వివరించారు. “ఏపీ లోని ఉత్తరాంధ్ర ప్రాంతం, వైజాగ్ నగరం మినహా, ఇప్పటికీ వెనుకబడి ఉంది. ఈ ప్రాంతం పుష్కలంగా సహజ వనరులు, విస్తారమైన సముద్ర తీరాన్ని కలిగి ఉంది. సముద్రం, బీచ్, కొండలు, లోయలు వంటి విభిన్న ప్రకృతి ఆకర్షణలతో దేశంలోనే అత్యుత్తమ పర్యాటక ప్రదేశంగా మారే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, రోడ్లు మరియు కనీస సౌకర్యాలు లేవు. వైద్య సదుపాయాల కోసం ప్రజలు ఇప్పటికీ గర్భిణులను అనారోగ్యంతో ఉన్నవారిని మంచాలపై మోసి తీసుకు రావలసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల నడుమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ.15,233 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌ల ను ప్రారంభించడం శుభపరిణామం” అని వినూష రెడ్డి కొనియాడారు.

రూ.4,106 కోట్లతో డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు, విజయవాడ – గుడివాడ – భీమవరం – నిడదవోలు, గుడివాడ – మచిలీపట్నం, భీమవరం – నర్సాపురం రైల్వే లైన్లు, రూ. 2917 కోట్లతో తూర్పు ఆఫ్‌షోర్‌లో ఓఎన్జీసీ ప్లాంట్, రూ.385 కోట్లతో గుంతకల్ ఐఏసీ గ్రాస్ రూట్ డిపో, రూ. 211 కోట్లతో పాతపట్నం నుంచి నరసన్నపేట వరకు జాతీయ రహదారి, రూ.3,778 కోట్లతో 6 వరుసల గ్రీన్ ఫీల్డ్ రాయ్‌పూర్ – వైజాగ్ ఎకనామిక్ కారిడార్, శ్రీకాకుళం నుంచి ఒడిశాలోని అంగుల్ వరకు రూ. 2,658 కోట్లతో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్ ), రూ. 566 కోట్లతో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలా నగర్ వరకు డెడికేటెడ్ పోర్ట్ రోడ్, రూ. 460 కోట్లతో వైజాగ్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, రూ. 152 కోట్లతో వైజాగ్ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ, ఈ ప్రాజెక్టులన్నీ వైజాగ్, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తాయి. తద్వారా పెట్టుబడులు వస్తాయి.వీటితో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా 1,13,206 కిలోమీటర్ల గ్రామీణ రహదారులు నిర్మితమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో హైవేలు, రోడ్ల అభివృద్ధికి కేంద్రం 3 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించనుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 51 రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దేశం అంతటా 11 పారిశ్రామిక కారిడార్ల ద్వారా 32 పారిశ్రామిక ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. 11 లో 3 ఏపీ మీదుగా ఉన్నాయి. ఆ మూడు వైజాగ్-చెన్నై, చెన్నై-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లు. వైజాగ్, కృష్ణపట్నం, ఓర్వకల్లు, కొప్పర్తి, శ్రీకాళహస్తి, తిరుపతి వంటి అనేక పారిశ్రామిక నోడ్‌లను ఈ కారిడార్ల ద్వారా అభివృద్ధి చేసి పారిశ్రామిక ప్రగతి కి బాటలు వేసింది మోడీ ప్రభుత్వం. కేంద్రం చేపట్టిన 23 గ్రీన్ ఎల్ల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలలో 6 ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. రాయ్‌పూర్-విశాఖపట్నం లో 465 కి.మీ, నాగ్‌పూర్ నుంచి విజయవాడ హైవే, చిత్తూరు – తంజావూరు హైవే, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం హైవే, బెంగళూరు-చెన్నై హైవే లో 85 కి.మీ. వాటన్నింటినీ 2025లోపు పూర్తిచేయాలి.

పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ఎయిమ్స్, ఐఐటీ ,ఐఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎస్ఆర్, సెంట్రల్ యూనివర్శిటీ, ట్రైబల్ యూనివర్శిటీ మొదలైన 11 కేంద్ర విద్యా సంస్థలను మోడీ ప్రభుత్వం స్థాపించింది. ఇవి కాకుండా మరో 10 కేంద్ర సంస్థలు మంజూరయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో జనధన్ యోజన ద్వారా 1,18,55,426 ఖాతాలు ఓపెన్ అయ్యాయి. 88,85,008 రూపే కార్డులను లబ్ధిదారులకు అందించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా రాష్ట్రానికి 20,75,773 గృహాలు మంజూరయ్యాయి. ఉపాధి హామీ పథకం కింద దాదాపు రూ.30,000 కోట్ల పనులు జరిగాయి. తద్వారా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, పాఠశాల కాంపౌండ్‌లు, బల్క్ మిల్క్ సెంటర్లు మొదలైన నిర్మాణాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జల్ జీవన్ మిషన్ కింద 31,02,317 గృహాలకు నీటి కుళాయి కనెక్షన్లు అందించారు. కోవిడ్ సహాయక చర్యలు ప్రధానంగా మోడీ ప్రభుత్వం కారణంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11,02,57,059 వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. 2.68 కోట్ల మంది నిరుపేదలు ప్రధానమంత్రి గరీబ్ అన్న్ కళ్యాణ్ యోజన పథకాన్ని పొందారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పొడవైన సముద్ర తీరంతో పాటు సహజ వనరులను కలిగి ఉంది. విభజన తర్వాత రాష్ట్రం అనేక అవాంతరాలను ఎదుర్కొంది. రాష్ట్రం ఇప్పుడు తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రుణాల వడ్డీలు కట్టడం, సంక్షేమ పథకాల కోసం అప్పులు చేయడం జరుగుతోంది. 2014 నుంచి మోడీ ప్రభుత్వం రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించింది. ఏపీలో ఇంతవరకు అభివృద్ధి జరిగిందంటే అది బీజేపీ వల్లనే అన్నది కాదనలేని వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాల్లో తన వాటా నిధులను విడుదల చేయడంలో విఫలమైంది. రాష్ట్రాన్ని స్వావలంబన చేసేందుకు మోదీ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లింది. ఏపీ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా విశేష కృషి చేస్తుంది. అభివృద్ధి రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందిస్తుంది, ఇది ప్రజల సంక్షేమానికి ఉపయోగపడుతుంది. ఆంధ్ర యొక్క సమగ్ర పురోగతి మరియు సంక్షేమం కోసం బీజేపీ కట్టుబడి ఉందన్న వాస్తవాన్ని ప్రధాని పర్యటన పునరుద్ఘాటిస్తుంది. ఏపీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం .

     – డా. వినూష రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, బీజేపీ, ఆంధ్రప్రదేశ్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us