AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గవర్నర్ చేసిన ఒకే ఒక్ ట్వీట్.. ఓ మహిళ జీవితంలో వెలుగులు నింపింది..

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చేసిన ట్వీట్ ఓ మహిళకు, ఆమె కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తింది. మల్లిగారి సంధ్యారాణి అనే మహిళ.. తన కుటుంబ పరిస్థితి గురించి వివరిస్తూ గవర్నర్ తమిళిసై...

Telangana: గవర్నర్ చేసిన ఒకే ఒక్ ట్వీట్.. ఓ మహిళ జీవితంలో వెలుగులు నింపింది..
Tamilisai Soundararajan
Ganesh Mudavath
|

Updated on: Nov 11, 2022 | 9:50 PM

Share

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చేసిన ట్వీట్ ఓ మహిళకు, ఆమె కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తింది. మల్లిగారి సంధ్యారాణి అనే మహిళ.. తన కుటుంబ పరిస్థితి గురించి వివరిస్తూ గవర్నర్ తమిళిసై కు ట్వీట్ చేశారు. గురువారం భైరాన్‌పల్లి గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా సిద్దిపేటలోని చేర్యాల వద్ద ఆమె గవర్నర్ కాన్వాయ్‌ను ఆపి నిరసన చేపట్టారు. దీంతో కాన్వాయ్‌ను భద్రతా సిబ్బంది ఆపేశారు. ఆమె పరిస్థితిని తెలుసుకున్న గవర్నర్.. కారు దిగి ఆమె ఇంటికి వెళ్లారు. ముగ్గురు కూతుళ్లతో కలిసి శిథిలమైన ఇంట్లో ఉన్న సంధ్య దీన స్థితిని చూసి గవర్నర్ చలించిపోయారు. తనకు ఇల్లు మంజూరు కాలేదని, శిథిలావస్థలో ఉన్న ఇంటిలో కుటుంబంతో కలిసి ఉండడం ఇబ్బందిగా ఉందని సంధ్య గవర్నర్‌ను కోరారు.

ఆమె దీనస్థితిని చూసి చలించిపోయిన గవర్నర్.. రాజ్ భవన్ నుంచి ఆమెకు అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సంధ్య కుటుంబం దుస్థితి గురించి గవర్నర్ ట్వీట్ చేయడంతో భారత్ బయోటెక్‌కు చెందిన సుచిత్రా ఎల్లా స్పందించారు. సంధ్య పిల్లల చదువుకు మద్దతు ఇవ్వడానికి సుచిత్రా ఎల్లా సుముఖత వ్యక్తం చేశారు. జీనోమ్ వ్యాలీ క్యాంపస్‌లో సంధ్యకు తగిన ఉద్యోగం ఇస్తానని తెలిపారు.

ఇవి కూడా చదవండి

సంధ్యకు ఆమె కుటుంబానికి సహాయం చేయటానికి ముందుకు వచ్చిన సుచిత్రా ఎల్లా చేసిన ట్వీట్‌ను గవర్నర్ రీ ట్వీట్ చేశారు. మానవతా దృక్పథాన్ని, మంచి మనస్సును, పరోపకార గుణాన్ని మెచ్చుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..