AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP High Court: ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. ఇద్దరు ఉన్నతాధికారుల సస్పెండ్.. ఒక్క రోజులోనే..

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. ముందుగా.. ఉద్యోగుల సర్వీస్‌ అంశాలకు సంబంధించిన కేసులో..

AP High Court: ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. ఇద్దరు ఉన్నతాధికారుల సస్పెండ్.. ఒక్క రోజులోనే..
AP High Court
Shaik Madar Saheb
|

Updated on: Jan 18, 2023 | 3:23 PM

Share

AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. ముందుగా.. ఉద్యోగుల సర్వీస్‌ అంశాలకు సంబంధించిన కేసులో ఇచ్చిన తీర్పును అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఇద్దరు విద్యాశాఖ ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. ఆ ఇద్దరు అధికారులను వెంటనే అదుపులోకి తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశించింది. అయితే, ఇద్దరు అధికారులు క్షమాపణలు చెప్పడంతో న్యాయస్థానం జైలు శిక్షను రద్దు చేసింది. అందుకు అనుగుణంగా సాయంత్రం కోర్టు సమయం ముగిసే వరకు ఇక్కడే నిలబడాలంటూ ధర్మాసనం తీర్పునిచ్చింది. ఆతర్వాత కొంతసేపటికే కొర్టు ధిక్కారానికి పాల్పడిన అధికారులను సస్పెండ్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును వెలువరించింది.

పూర్తి వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌ అంశాలకు సంబంధించిన విషయంపై ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఇరుపక్షాల మధ్య జరిగిన వాదోపవాదాల అనంతరం న్యాయస్థానం ఉద్యోగులకు అనుకూలంగా తీర్పునివ్వడంతోపాటు.. అమలు చేయాలని ఆదేశించింది. అయితే, ఈ తీర్పును అమలు చేయకపోవడంతో ఉద్యోగులు మళ్లీ హైకోర్టుకు వెళ్లగా.. దీనిపై వాదనలు జరిగాయి. అంతకుముందు ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌, ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ రామకృష్ణకు నెలరోజుల పాటు జైలుశిక్ష, రూ.2వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఇద్దరు అధికారులను వెంటనే అదుపులోకి తీసుకోవాలంటూ న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. అయితే ఆ ఇద్దరు అధికారులు హైకోర్టుకు వచ్చి క్షమాపణలు చెప్పడంతో ధర్మాసనం జైలు శిక్షను రద్దు చేసింది.

అందుకు అనుగుణంగా సాయంత్రం కోర్టు సమయం ముగిసే వరకు ఆవరణలోనే నిలబడాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల సర్వీసు అంశాలకు సంబంధించిన కేసులో గతంలో ఇచ్చిన హైకోర్టును తీర్పును అమలు చేయని నేపథ్యంలో ఈ శిక్ష విధిస్తున్నట్లు ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పునిచ్చిన కాసేపటికే.. డివిజన్ బెంచ్ ధర్మాసనం.. ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో