Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో కొత్తగా మరో 6 మండలాల ఏర్పాటు.. నోటిఫికేషన్ జారీ చేసిన జగన్ సర్కార్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. విజయనగరం, చిత్తూరు, నంద్యాల, అనంతపురం, ఒంగోలు జిల్లా..

Andhra Pradesh: ఏపీలో కొత్తగా మరో 6 మండలాల ఏర్పాటు.. నోటిఫికేషన్ జారీ చేసిన జగన్ సర్కార్..!
Ap Cm Jagan
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 02, 2023 | 6:03 AM

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 6 మండలాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు జిల్లా కేంద్రాలను రెండు మండలాలుగా విడదీస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. విజయనగరం, చిత్తూరు, నంద్యాల, అనంతపురం, ఒంగోలు జిల్లా కేంద్రాలను అర్బన్‌, రూరల్‌ మండలాలుగా విభజించింది. అలాగే మచిలీపట్నంను సౌత్‌, నార్త్‌ మండలాలుగా విభజించనున్నట్లు పేర్కొంది. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొన్ని వార్డులు, శివారు గ్రామాలను కలుపుకొని సౌత్, నార్త్ మండలాలుగా విభజించింది.

మరోవైపు మచిలీపట్నంలోని 1 నుంచి 19 వరకు వార్డులను కలుపుకొని సౌత్ మండలంగా, శివార్లలోని గ్రామాలను విలీనం చేస్తూ నార్త్ మండలంగా గుర్తిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మండలాల విభజనపై అభ్యంతరాలుంటే తెలపాలని ప్రభుత్వం కోరింది. నెల రోజుల్లోగా అభ్యంతరాలను కలెక్టర్‌కు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. రెవెన్యూ, ఇతర పరిపాలన సౌలభ్యం కోసం అర్బన్, రూరల్ మండలాలుగా విభజించింది.

కాగా ఇప్పుడున్న పరిధులే కొత్త మండలాల్లోనూ కొనసాగుతాయి. అందులో ఎలాంటి మార్పులు చేయలేదు. రెవెన్యూ పరంగా మరింత సుపరిపాలన అందించడంలో భాగంగా ఈ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆయా జిల్లా కేంద్రాల్లో పెరుగుతున్న పట్టణీకరణ, శివారు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం..

ఆసీస్‌లో వాళ్లను మించినోడు ఉన్నాడు..రోహిత్ కీలక వ్యాఖ్యలు
ఆసీస్‌లో వాళ్లను మించినోడు ఉన్నాడు..రోహిత్ కీలక వ్యాఖ్యలు
నాన్న స్టార్ హీరో.. అమ్మ క్రేజీ హీరోయిన్.. కూతురు మాత్రం ఇలా..
నాన్న స్టార్ హీరో.. అమ్మ క్రేజీ హీరోయిన్.. కూతురు మాత్రం ఇలా..
కూతురు కాపురం కోసం ఓ ప్రాణాన్ని లేపేశాడు ఈ మాజీ పోలీస్...
కూతురు కాపురం కోసం ఓ ప్రాణాన్ని లేపేశాడు ఈ మాజీ పోలీస్...
ఏప్రిల్ 30 నుంచి జగద్గురు ఆది శంకరాచార్య మఠం రథోత్సవాలు.. ఆహ్వానం
ఏప్రిల్ 30 నుంచి జగద్గురు ఆది శంకరాచార్య మఠం రథోత్సవాలు.. ఆహ్వానం
ఇంట్లో సిరి సంపదల కోసం అక్షయ తృతీయ రోజున వీటిని కొనడం శుభప్రదం
ఇంట్లో సిరి సంపదల కోసం అక్షయ తృతీయ రోజున వీటిని కొనడం శుభప్రదం
ఈ తేదీల్లో పుట్టిన యువకులు భార్య మాట వినరట అమ్మాయిలు జర జాగ్రత్త
ఈ తేదీల్లో పుట్టిన యువకులు భార్య మాట వినరట అమ్మాయిలు జర జాగ్రత్త
మహాత్మా జ్యోతిబాఫులె డిగ్రీ కాలేజీల్లో 2025 ప్రవేశాలకు దరఖాస్తులు
మహాత్మా జ్యోతిబాఫులె డిగ్రీ కాలేజీల్లో 2025 ప్రవేశాలకు దరఖాస్తులు
అసలు ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చు?
అసలు ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చు?
సినిమాకు రూ. 30కోట్లు అందుకుంటున్న రామ్ చరణ్ హీరోయిన్
సినిమాకు రూ. 30కోట్లు అందుకుంటున్న రామ్ చరణ్ హీరోయిన్
ఆ విచిత్ర దొంగను చూసి షాక్ అయిన పోలీసులు..
ఆ విచిత్ర దొంగను చూసి షాక్ అయిన పోలీసులు..