AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మట్టి తవ్వకాల చుట్టూ పొలిటికల్ వార్‌.. పశ్చిమగోదావరి జిల్లాలో సై అంటే సై అంటోన్న వైసీపీ, టీడీపీ నేతలు

పశ్చిమగోదావరి జిల్లాలోని చించినాడ దళిత భూముల నుంచి మట్టి అమ్ముతున్న లారీలను దళితులు అడ్డుకున్నారు. విషయం తెలిసిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఘటనా స్థలానికి చేరుకుని దళితులకు మద్దతుగా నిలిచారు.

మట్టి తవ్వకాల చుట్టూ పొలిటికల్ వార్‌.. పశ్చిమగోదావరి జిల్లాలో సై అంటే సై అంటోన్న వైసీపీ, టీడీపీ నేతలు
Nimmala Ramanaidu
Basha Shek
|

Updated on: Jun 10, 2023 | 7:00 AM

Share

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మట్టి తవ్వకాలపై రాజకీయ దుమారం చెలరేగింది. టీడీపీ నేత నిమ్మల రామానాయుడు చేసిన ఆరోపణలకు… వైసీపీ నుంచి కౌంటర్లు వస్తున్నాయి. దీంతో ఇష్యూ పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. పశ్చిమగోదావరి జిల్లాలోని చించినాడ దళిత భూముల నుంచి మట్టి అమ్ముతున్న లారీలను దళితులు అడ్డుకున్నారు. విషయం తెలిసిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఘటనా స్థలానికి చేరుకుని దళితులకు మద్దతుగా నిలిచారు. అనుమతులు ఉన్నాయని చెప్పి యదేశ్చగా మట్టి అమ్ముకుంటున్న చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మట్టి మాఫియాలో భాగస్వాములైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దళితులు చేస్తున్న ఆందోళనకు నిమ్మల రామానాయుడు మద్దతు ఇవ్వడంతో ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంది. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చించినాడలో మట్టి తవ్వకాలపై నిమ్మల రామానాయుడు డ్రామాలాడుతున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకో వేషం వేసే డ్రామానాయుడు గురించి ప్రభుత్వం పట్టించుకోదన్నారు. అక్కడేదో దళితుల భూములు లాక్కుంటున్నట్టు ప్రచారం చేస్తూ దిగజారుడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూమి నుంచే మట్టి తరలిస్తుంటే నిమ్మల రాజకీయం చేస్తున్నారని ప్రసాదరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు నిర్మలకు ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌ కౌంటర్‌ ఇచ్చారు. అనధికారిక మట్టి తవ్వకాలు, ఆక్రమ తవ్వకాలు పాలకొల్లు నియోజకవర్గంలో ఎక్కడా జరగడంలేదని తెలిపారు. ప్రభుత్వ భూమిలోని మట్టిని మాత్రమే జగనన్న కాలనీలకు తరలిస్తున్నారన్నారు. తాము ఎక్కడన్న అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ విసిరారు. గతంలో రామానాయుడు అదే మట్టిన అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే రామానాయుడు అవినీతిని నిరూపిస్తానని ఛాలెంజ్‌ చేశారు. మొత్తానికి చించినాడ మట్టి తరలింపుపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా