AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మట్టి తవ్వకాల చుట్టూ పొలిటికల్ వార్‌.. పశ్చిమగోదావరి జిల్లాలో సై అంటే సై అంటోన్న వైసీపీ, టీడీపీ నేతలు

పశ్చిమగోదావరి జిల్లాలోని చించినాడ దళిత భూముల నుంచి మట్టి అమ్ముతున్న లారీలను దళితులు అడ్డుకున్నారు. విషయం తెలిసిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఘటనా స్థలానికి చేరుకుని దళితులకు మద్దతుగా నిలిచారు.

మట్టి తవ్వకాల చుట్టూ పొలిటికల్ వార్‌.. పశ్చిమగోదావరి జిల్లాలో సై అంటే సై అంటోన్న వైసీపీ, టీడీపీ నేతలు
Nimmala Ramanaidu
Basha Shek
|

Updated on: Jun 10, 2023 | 7:00 AM

Share

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మట్టి తవ్వకాలపై రాజకీయ దుమారం చెలరేగింది. టీడీపీ నేత నిమ్మల రామానాయుడు చేసిన ఆరోపణలకు… వైసీపీ నుంచి కౌంటర్లు వస్తున్నాయి. దీంతో ఇష్యూ పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. పశ్చిమగోదావరి జిల్లాలోని చించినాడ దళిత భూముల నుంచి మట్టి అమ్ముతున్న లారీలను దళితులు అడ్డుకున్నారు. విషయం తెలిసిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఘటనా స్థలానికి చేరుకుని దళితులకు మద్దతుగా నిలిచారు. అనుమతులు ఉన్నాయని చెప్పి యదేశ్చగా మట్టి అమ్ముకుంటున్న చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మట్టి మాఫియాలో భాగస్వాములైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దళితులు చేస్తున్న ఆందోళనకు నిమ్మల రామానాయుడు మద్దతు ఇవ్వడంతో ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంది. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చించినాడలో మట్టి తవ్వకాలపై నిమ్మల రామానాయుడు డ్రామాలాడుతున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకో వేషం వేసే డ్రామానాయుడు గురించి ప్రభుత్వం పట్టించుకోదన్నారు. అక్కడేదో దళితుల భూములు లాక్కుంటున్నట్టు ప్రచారం చేస్తూ దిగజారుడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూమి నుంచే మట్టి తరలిస్తుంటే నిమ్మల రాజకీయం చేస్తున్నారని ప్రసాదరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు నిర్మలకు ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌ కౌంటర్‌ ఇచ్చారు. అనధికారిక మట్టి తవ్వకాలు, ఆక్రమ తవ్వకాలు పాలకొల్లు నియోజకవర్గంలో ఎక్కడా జరగడంలేదని తెలిపారు. ప్రభుత్వ భూమిలోని మట్టిని మాత్రమే జగనన్న కాలనీలకు తరలిస్తున్నారన్నారు. తాము ఎక్కడన్న అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ విసిరారు. గతంలో రామానాయుడు అదే మట్టిన అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే రామానాయుడు అవినీతిని నిరూపిస్తానని ఛాలెంజ్‌ చేశారు. మొత్తానికి చించినాడ మట్టి తరలింపుపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

OTT ట్రెండింగ్‌లో ఎప్‌స్టీన్ వెబ్ సిరీస్‌.. రసవత్తరంగా సాగే కథ
OTT ట్రెండింగ్‌లో ఎప్‌స్టీన్ వెబ్ సిరీస్‌.. రసవత్తరంగా సాగే కథ
పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి టాపర్‌గా నిలిచిన టీమిండియా
పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి టాపర్‌గా నిలిచిన టీమిండియా
నో కొలెస్ట్రాల్.. నో టెన్షన్.. కొవ్వును ఇలా కరిగించుకోండి..
నో కొలెస్ట్రాల్.. నో టెన్షన్.. కొవ్వును ఇలా కరిగించుకోండి..
అమ్మాయిలో అలాంటి క్వాలిటీస్ ఉండాలి
అమ్మాయిలో అలాంటి క్వాలిటీస్ ఉండాలి
30 లక్షల మంది రైతులకు నిలిచిపోనున్న పీఎం కిసాన్‌ సాయం..ఎందుకంటే..
30 లక్షల మంది రైతులకు నిలిచిపోనున్న పీఎం కిసాన్‌ సాయం..ఎందుకంటే..
బోణి కొట్టిన బీఆర్ఎస్.. ఆ మున్సిపాలిటీలో 14 మంది విజయం..
బోణి కొట్టిన బీఆర్ఎస్.. ఆ మున్సిపాలిటీలో 14 మంది విజయం..
విష ప్రయోగం నుంచి కాపాడే శక్తివంతమై ఆలయం.. ఎక్కడుందో తెలుసా?
విష ప్రయోగం నుంచి కాపాడే శక్తివంతమై ఆలయం.. ఎక్కడుందో తెలుసా?
ఎంత సంపాదించినా.. డబ్బు నిలవడం లేదా..? లక్ష్మీ కటాక్షం కోసం ఇలా..
ఎంత సంపాదించినా.. డబ్బు నిలవడం లేదా..? లక్ష్మీ కటాక్షం కోసం ఇలా..
గూగుల్ నన్ను హిందువుని చేసింది.. కానీ నేను ముస్లిం..
గూగుల్ నన్ను హిందువుని చేసింది.. కానీ నేను ముస్లిం..
అభిషేక్ హెల్త్ అప్‌డేట్ గురించి క్లారిటీ ఇచ్చిన వరుణ్ చక్రవర్తి
అభిషేక్ హెల్త్ అప్‌డేట్ గురించి క్లారిటీ ఇచ్చిన వరుణ్ చక్రవర్తి