AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఏపీలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కడప జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. గువ్వల చెరువు ఘాట్ సమీపం చింతకొమ్మదిన్నె పరిధిలో కారును కంటైనర్ ఢీకొట్టింది..

Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
Road Accident
Subhash Goud
|

Updated on: Aug 26, 2024 | 11:47 PM

Share

ఏపీలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కడప జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. గువ్వల చెరువు ఘాట్ సమీపం చింతకొమ్మదిన్నె పరిధిలో కారును కంటైనర్ ఢీకొట్టింది. దీంతో కంటైనర్‌ లోయలో పడిపోయింది.

ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. దీంతో ఐదుగురు మృతి చెందారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్ఠలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు చక్రాయపేట మండలం కొన్నేపల్లి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. అయతిఏ బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టంకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇదే జిల్లా దువ్వూరు మండలం చింతగుంటలో కారు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. కర్నూలు నుంచి తిరుపతికి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి