Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమరావతి వార్: 17 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..

మూడు రాజధానుల అంశం గురించి సీఎం జగన్ మాట్లాడుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వచ్చి ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేయడం మొదలెట్టారు. దీంతో అసెంబ్లీలో గందరగోళం నెలకుంది. ఈ నేపథ్యంలో న్యూసెన్స్ క్రియేట్ చేస్తోన్న 17 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాల్సిందిగా శాసనసభావ్యవహారాల మంత్రి బుగ్గన సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీంతో స్పీకర్ సదరు సభ్యులను సస్పెండ్ చేశారు. సభ నుంచి సస్పెండైన టీడీపీ ఎమ్మెల్యేలు: అచ్చెన్నాయుడు ఆదిరెడ్డి భవాని ఏలూరి సాంబశివరావు అనగాని […]

అమరావతి వార్: 17 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..
Follow us
Ram Naramaneni

| Edited By:

Updated on: Jan 20, 2020 | 10:10 PM

మూడు రాజధానుల అంశం గురించి సీఎం జగన్ మాట్లాడుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వచ్చి ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేయడం మొదలెట్టారు. దీంతో అసెంబ్లీలో గందరగోళం నెలకుంది. ఈ నేపథ్యంలో న్యూసెన్స్ క్రియేట్ చేస్తోన్న 17 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాల్సిందిగా శాసనసభావ్యవహారాల మంత్రి బుగ్గన సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీంతో స్పీకర్ సదరు సభ్యులను సస్పెండ్ చేశారు.

సభ నుంచి సస్పెండైన టీడీపీ ఎమ్మెల్యేలు:

  • అచ్చెన్నాయుడు
  • ఆదిరెడ్డి భవాని
  • ఏలూరి సాంబశివరావు
  • అనగాని సత్యప్రసాద్
  • బుచ్చయ్య చౌదరి
  • చినరాజప్ప
  • వెంకట రెడ్డి నాయుడు
  • మంతెన రామరాజు
  • గద్దె రామ్మోహన్
  • జోగేశ్వరరావు
  • వెలగపూడి రామకృష్ణ
  • వాసుపల్లి గణేశ్
  • పయ్యావుల కేశవ్
  • జోగేశ్వరరావు
  • గొట్టిపాటి రవి
  • నిమ్మల రామానాయుడు
  • కరణం బలరాం