Breaking: ఏపీలో మళ్లీ పెరగనున్న మద్యం ధరలు.. ఈ సారి ఏకంగా 50 శాతం..!

ఏపీలో మద్యం షాపులు తెరిచి మందుబాబులకు కాస్త గుడ్‌న్యూస్‌ను అందించిన ప్రభుత్వం షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. ఇప్పటికే మద్యం రేట్లను 25శాతం పెంచిన జగన్ సర్కార్..

Breaking: ఏపీలో మళ్లీ పెరగనున్న మద్యం ధరలు.. ఈ సారి ఏకంగా 50 శాతం..!
Follow us

| Edited By:

Updated on: May 05, 2020 | 10:49 AM

ఏపీలో మద్యం షాపులు తెరిచి మందుబాబులకు కాస్త గుడ్‌న్యూస్‌ను అందించిన ప్రభుత్వం షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. ఇప్పటికే మద్యం రేట్లను 25శాతం పెంచిన జగన్ సర్కార్.. మరోసారి భారీగా మద్యం ధరలను పెంచబోతోంది. ఈ సారి ఏకంగా 50శాతం ధరలు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం పెంచిన 25శాతంతో కలిపి 75 ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సోమవారం ఒక్కసారిగా షాపులపై మందు ప్రియులు ఎగబడటంతో రేట్లు మరింత పెంచే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. అంతేకాదు మద్యం షాపులను ఆలస్యంగా తెరచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా సోమవారం మద్యం షాపులు ప్రారంభించగా.. దాని ద్వారా 60 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక కరోనాను పట్టించుకోకుండా మందు షాపుల దగ్గర మందు బాబులు ఎగబడుతున్నారు. సామాజిక దూరం కూడా పట్టించుకోకుండా బారులు తీరారు.

Read This Story Also: కరోనా లాక్‌డౌన్: షూటింగ్‌లు అప్పటి నుంచే మొదలుకానున్నాయా..!