AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL: ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వనున్న ఏపీ జట్టు.. బిడ్డింగ్‌ దక్కించుకునే దిశగా అడుగులు.?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే ప్రయోగాలకు పెట్టింది పేరు.. 8 జట్లతో ప్రేక్షకులకు అలరిస్తున్న ఐపీఎల్లో కొత్తగా రెండు జట్లను తీసుకువచ్చింది బీసీసీఐ. ఈ క్రమం లోనే గత ఏడాది ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ అనే రెండు జట్లను ఐపీఎల్లోకి తీసుకు వచ్చింది బీసీసీఐ. ప్రస్తుతం పది జట్లు ఐపీల్ లో ఉన్నాయి...

IPL: ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వనున్న ఏపీ జట్టు.. బిడ్డింగ్‌ దక్కించుకునే దిశగా అడుగులు.?
IPL
Ashok Bheemanapalli
| Edited By: Narender Vaitla|

Updated on: Jul 17, 2023 | 6:50 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే ప్రయోగాలకు పెట్టింది పేరు.. 8 జట్లతో ప్రేక్షకులకు అలరిస్తున్న ఐపీఎల్లో కొత్తగా రెండు జట్లను తీసుకువచ్చింది బీసీసీఐ. ఈ క్రమం లోనే గత ఏడాది ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ అనే రెండు జట్లను ఐపీఎల్లోకి తీసుకు వచ్చింది బీసీసీఐ. ప్రస్తుతం పది జట్లు ఐపీల్ లో ఉన్నాయి. ఉన్న వాటి సంఖ్యను మరింత పెంచాలని ఆలోచిస్తుందట బీసీసీఐ.

ఈ క్రమంలోనే ఏపీ కోసం ప్రత్యేకంగా ఒక ఫ్రాంచైజీకి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఐపీఎల్ కోసం బీసీసీఐ కొత్త ఫ్రాంచైజీలను అవకాశమిస్తుండగా.. ఇక బిడ్డింగ్ దక్కించుకునే దిశగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లకు రెడీ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్. దీనికి సంబంధించి ఆటగాళ్ల ప్రాక్టీస్ కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కి ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారని సమాచారం.

విశాఖలో ఉన్న స్టేడియం ఇక ఆంధ్రప్రదేశ్ టీంకి హోమ్ గ్రౌండ్‌గా మారుతుందని టాక్. ఒకవేళ ఏపీ క్రికెట్ అసోసియేషన్ చేస్తున్న ప్రయత్నాలు సఫలం అయితే మాత్రం ఇక ఐపీఎల్‌లోకి కొత్తగా ఆంధ్ర నుంచి ఒక ఫ్రాంచైజీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్‌లో కొనసాగుతోన్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..