AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AAP: ఆంధ్రప్రదేశ్ వైపు కేజ్రీవాల్ చూపు.. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇన్‌చార్జ్‌ మణి నాయుడు కీలక వ్యాఖ్యలు..

ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మణి నాయుడు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.

AAP: ఆంధ్రప్రదేశ్ వైపు కేజ్రీవాల్ చూపు.. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇన్‌చార్జ్‌ మణి నాయుడు కీలక వ్యాఖ్యలు..
Arvind Kejriwal
Shaik Madar Saheb
|

Updated on: Jan 25, 2023 | 8:06 AM

Share

ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మణి నాయుడు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. 9 నెలలుగా అన్ని జిల్లాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామన్న మనీనాయుడు.. ఇతర పార్టీల నుంచి నేతలు, సామాజిక కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారన్నారు. రోజు రోజుకు పార్టీ బలం పెరుగుతుందన్న ఆయన.. ఆమ్ ఆద్మీ పార్టీని ప్రతీ రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. గవర్నెన్స్ మోడల్ ఎలా ఉండాలనేది ఢిల్లీ, పంజాబ్‌లో తాము చూపించాం, స్కూల్స్, హాస్పిటల్ నిర్వహణ ఎలా ఉండాలో చూపాము, క్లీన్‌ గవర్నెన్స్ ఉన్న మా పార్టీని ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు.

Ap Aap

Ap Aap

ఏపీలో రాజకీయ శూన్యత ఉందన్న ఆమ్ ఆద్మీ ఏపీ వ్యవహార ఇంచార్జ్‌.. ప్రభుత్వం మారినప్పుడు ప్యాకింగ్ మారుతుంది తప్ప ప్రాడక్ట్ మారడం లేదని విమర్శించారు. అప్పులు, తప్పులు, అవినీతి అంతా సేమ్ అంటూ కామెంట్ చేశారు. అందుకే ఆంధ్రప్రదేశ్ మార్పు కోరుకుంటున్నారన్నారు. మమ్మల్ని రాజకీయ పార్టీగా చూడటం లేదన్న మునీ నాయుడు.. ప్రజలు మనస్పూర్తిగా వెల్‌కమ్ చేప్తున్నారన్నారు.

తమ అజెండా జాతీయ స్థాయిలో సిద్ధం అవుతుందన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు.. తాము గ్రౌండ్‌ లెవల్‌లో ప్రిపేర్ అవుతున్నామని చెప్తున్నారు. 6 నెలల్లో జెండా, అజెండా ప్రకటిస్తాం, జనాలు మెచ్చే మేనిఫెస్టో డిజైన్ చేస్తామంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాయలసీమ సమీక్ష సమావేశానికి మనీ నాయుడుతో పాటు ఇతర నేతలు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..