Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఇలాంటి గేదె ఒక్కటి ఉన్నా చాలు.. నెలా నెలా లక్షల్లో ఆదాయం.. రోజుకు ఎన్ని లీటర్ల పాలు ఇస్తుందో తెలుసా..?

దేశంలో పాల వ్యాపారానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఉదయం ప్రారంభమైన నాటి నుంచి ప్రతి ఇంటికి పాలు కావాల్సిందే. మనకుండే నిత్యావసర వస్తువుల్లో పాలు కూడా ఒకటి..

Andhra Pradesh: ఇలాంటి గేదె ఒక్కటి ఉన్నా చాలు.. నెలా నెలా లక్షల్లో ఆదాయం.. రోజుకు ఎన్ని లీటర్ల పాలు ఇస్తుందో తెలుసా..?
Murrah Buffalo
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 24, 2023 | 10:41 AM

దేశంలో పాల వ్యాపారానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఉదయం ప్రారంభమైన నాటి నుంచి ప్రతి ఇంటికి పాలు కావాల్సిందే. మనకుండే నిత్యావసర వస్తువుల్లో పాలు కూడా ఒకటి.. అందుకే పాల వ్యాపారానికి డిమాండ్ బాగా ఉంది. సాధారణంగా టీ, కాఫీ, పాలు తాగేవారు తప్పనిసరిగా పాలను తీసుకుంటారు. పాలు తాగడం ద్వారా మన శరీరానికి అధిక మొత్తంలో పోషకాలు అందుతాయి. అందుకే పాలను చాలామంది తాగుతుంటారు. పట్టణ ప్రాంతాల్లో అయితే, ప్యాకెట్ పాలే దొరుకుతాయి. అదే, గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన గేదె పాలు దొరుకుతాయి. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం నకిలీ దాందా కూడా కొనసాగుతోంది.

పాల డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చాలామంది ఈ వ్యాపారం వైపు మొగ్గుచూపుతున్నారు. పాల పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందన్న నేపథ్యంలో కొంతమంది పెద్ద పెద్ద ఉద్యోగాలను వదిలిపెట్టి.. సొంత గ్రామాల్లో పాల వ్యాపారం చేస్తున్నారు. ఆవులు, గేదెలను పెంచుతూ.. భారీగా ఆదాయం ఆర్జిస్తున్నారు. ఏపీలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ వ్యక్తి సైతం పాలవ్యాపారం మొదలు పెట్టి రూ. వేలు సంపాదిస్తున్నాడు. మండపేట రైతుకు చెందిన ఓ గేదె రోజుకు 26.59 లీటర్ల పాలిస్తుంది. ఈ గేదెతో ఓ కుటుంబం పాల వ్యాపారంలో గణనీయమైన లాభాలను ఆర్జిస్తోంది.

మండపేట పట్టణానికి చెందిన పాడి రైతు ముత్యాల సత్యనారాయణ అబ్బు మేలు జాతి పశుపోషణ చేస్తున్నారు. ముత్యాల సత్యనారాయణ కొన్నేళ్ల కింద ముర్రా జాతి పాడి గేదెను కొన్నారు. అప్పటి నుంచి గేదె రోజుకు 26.59 లీటర్లు పాలు ఇస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు. ఆ గేదె వయసు నాలుగేళ్లు మాత్రమేనని.. పాలు దిగుబడిలో తల్లిని మించిపోయిందని తెలిపారు. రోజుకు 26.59 లీటర్ల పాలు ఇస్తూ రికార్డు సృష్టించిందని సంతోషం వ్యక్తంచేశారు. ఎనిమిదేళ్ల కిందట తెలంగాణ నిజామాబాద్ జిల్లాలో ముర్రా జాతి పాడి గేదెను కొనుగోలు చేశానని రైతు వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..