AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శంబర వీధుల్లో సిరమాను సంబరం.. అమ్మవారి ప్రతిరూపాన్ని కొలుస్తూ పులకించిన భక్తజనం.. ప్రధాన ఘట్టాలు ఇవే..!

జాతరలో ప్రధాన ఘట్టమైన సిరిమాను సంబరం సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. శంబర పోలమాంబ జాతర సంక్రాంతి తర్వాత మొదటి వారం నుంచి..

శంబర వీధుల్లో సిరమాను సంబరం.. అమ్మవారి ప్రతిరూపాన్ని కొలుస్తూ పులకించిన భక్తజనం.. ప్రధాన ఘట్టాలు ఇవే..!
Polamamba Jatara
Jyothi Gadda
|

Updated on: Jan 25, 2023 | 8:31 AM

Share

పార్వతీపురం మన్యం జిల్లా శంబరలో పోలమాంబ జాతర అంగరంగ వైభవంగా సాగింది. లక్షలాదిమంది భక్తులు వీక్షిస్తుండగా అమ్మవారి సిరిమాను శంబర వీధుల్లో ఊరేగింది. 60 అడుగుల ఎత్తున సిరిమానుపై ప్రధాన అర్చకుడు జన్నిపేకాపు రామారావు ఆశీనులవ్వగా భక్తులు అమ్మవారి ప్రతిరూపంగా భావించి సిరిమానును దర్శించుకుని పునీతులయ్యారు. ముందు రామారావును చదురు గుడి నుంచి సాడేపు కుటుంబీకులు మోసుకొని వచ్చారు. అనంతరం సిరిమానును అధిరోహించారు. అప్పటికే మంగళ వాయిద్యాల మధ్య ఘటాలు సిరిమాను దగ్గరకు వచ్చాయి. సిరిమాను తొలుత గిరడ వారింటికి, అనంతరం కుప్పిలి, పూడి వారిళ్లకు వెళ్లి పూజలు అందుకుంది.

ఆ తర్వాత ఘటాలు దక్షిణ దిక్కుగా, సిరిమాను తూర్పు దిక్కుగా వెళ్లాయి. రెండు పణుకు వీధిలో కలిశాయి. అక్కడ పొడిపిరెడ్డి కుటుంబీకులు, తీళ్ల వారి వారసులుగా అక్యాన కుటుంబీలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సిరిమాను మళ్లీ గొల్లవీధి, కొత్తవీధి మీదుగా పెద్దమ్మ గుడి దగ్గరకు చేరుకుంది. అక్కడ భక్తుల పూజలు అందుకుంది. ఉత్సవానికి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, చత్తీస్‌ఘడ్, ఒడిస్సా నుండి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. జాతరలో ప్రధాన ఘట్టమైన సిరిమాను సంబరం సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. శంబర పోలమాంబ జాతర సంక్రాంతి తర్వాత మొదటి వారం నుంచి పది వారాల వరకు జరుగుతుంది. శంబర వీధుల్లో అమ్మవారి సిరిమాను మూడుసార్లు తిరగడంతో ఉత్సవం ముగిసింది.

పండుగలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముగియటంతో పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 28న చండీహోమం, 31న మారు జాతర నిర్వహిస్తారు. ప్రధాన ఘట్టలైన తొలేళ్ల ఉత్సవం, సిరిమానోత్సవం, అంపక ఉత్సవాలకు సైతం భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పనసకు దూరంగా ఉండటమే మేలు!
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పనసకు దూరంగా ఉండటమే మేలు!
ఆదివారం ఈ పనులు అస్సలు చేయొద్దు.. కోరి సమస్యలు తెచ్చుకోకండి
ఆదివారం ఈ పనులు అస్సలు చేయొద్దు.. కోరి సమస్యలు తెచ్చుకోకండి
మాట నిలబెట్టుకుంటోన్న బండ్ల గణేష్.. 19న మరో సాహసానికి శ్రీకారం
మాట నిలబెట్టుకుంటోన్న బండ్ల గణేష్.. 19న మరో సాహసానికి శ్రీకారం