పెళ్లింట విషాదం.. పెళ్లికూతురిని మింగేసిన డెంగీ..!

డెంగ్యూ జ్వరంతో పెళ్లికూతురు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పెళ్లికూతురుగా ముస్తాబైన యువతి ఇంట.. పెళ్లి బాజాలకు బదులు చావు బాజాలు మోగాయి. వివరాల్లోకివెళ్తే.. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం తిరు వెంకట నరసింహాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కృష్ణమరాజు, రెడ్డమ్మ దంపతుల కుమార్తె చంద్రకళ. తమ కుమార్తె చంద్రకళకు అక్టోబర్ 30న పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే.. పెళ్లికి రెండు రోజుల ముందు..పెళ్లికూతురికి నలుగు పెడుతుండగా.. సడన్‌గా […]

పెళ్లింట విషాదం.. పెళ్లికూతురిని మింగేసిన డెంగీ..!
Follow us

| Edited By:

Updated on: Nov 02, 2019 | 1:40 PM

డెంగ్యూ జ్వరంతో పెళ్లికూతురు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పెళ్లికూతురుగా ముస్తాబైన యువతి ఇంట.. పెళ్లి బాజాలకు బదులు చావు బాజాలు మోగాయి.

వివరాల్లోకివెళ్తే.. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం తిరు వెంకట నరసింహాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కృష్ణమరాజు, రెడ్డమ్మ దంపతుల కుమార్తె చంద్రకళ. తమ కుమార్తె చంద్రకళకు అక్టోబర్ 30న పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే.. పెళ్లికి రెండు రోజుల ముందు..పెళ్లికూతురికి నలుగు పెడుతుండగా.. సడన్‌గా కళ్లు తిరిగిపడిపోయింది. వెంటనే.. బంధువులు ఆమెను తమిళనాడులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో.. చికిత్స చేసిన వైద్యులు.. చంద్రకళకు డెంగీ వచ్చిందని చెప్పారు. అయితే.. పెళ్లి ముహుర్తం దగ్గర పడుతుండంతో.. ఆమెను మండపానికి తీసుకెళ్లాలని పట్టుబట్టారు తల్లిదండ్రులు.

కాగా.. చంద్రకళ పరిస్థితి విషయంగా ఉండటంతో.. ఆమెను ఇంటికి పంపించేందుకు వైద్యులు నిరాకరించినా.. యువతి బంధువులు వినిపించుకోకుండా.. ఇంటికి తీసుకెళ్లారు.. అప్పటికే పరిస్థితి క్షీణించిన చంద్రకళ.. పచ్చటి మండపంలోనే కన్ను మూసింది. పచ్చని పారాణితో పెళ్లిపీటలు ఎక్కాల్సిన చంద్రకళ.. ఇలా అర్థాంతరంగా.. చనిపోవడంతో.. బంధువులతో పాటు.. స్థానికులను కూడా.. తీవ్ర ఆవేదనకు గురిచేసింది.