శ్రీకాకుళంలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
శ్రీకాకుళంలో eRZL సంస్థ హైడ్రేషన్ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. తీవ్రమైన వేడిలో శారీరక శ్రమ చేసేటప్పుడు శరీరం నీటితో పాటు ఎలక్ట్రోలైట్లను కోల్పోతుంది. దీని వలన డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. eRZL క్షేత్ర స్థాయి శాంపిలింగ్ ద్వారా ప్రజలకు ఎలక్ట్రోలైట్ల ప్రాముఖ్యతను, హైడ్రేటెడ్గా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించింది. ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది.
వేసవి తీవ్రతతో కూడిన వాతావరణంలో, రోజువారీ పనులు చేసేటప్పుడు ప్రజలు తరచుగా అలసటకు గురవుతుంటారు. అధిక వేడి, శారీరక శ్రమ కారణంగా శరీరం నుండి చెమట రూపంలో కేవలం నీరే కాకుండా, అవసరమైన ఎలక్ట్రోలైట్లు కూడా బయటకు వెళ్లిపోతాయి. దీని వలన డీహైడ్రేషన్ సమస్య ఏర్పడి, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. eRZL సంస్థ హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ల పునరుద్ధరణ ఆవశ్యకతపై అవగాహన కల్పించడానికి రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ అవగాహనలో భాగంగా eRZL బృందం శ్రీకాకుళం నగరంలోని వివిధ ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించింది. బిజీగా ఉండే వీధులు, కీలక నగర ప్రాంతాలలో వినియోగదారులను నేరుగా కలుసుకొని, హైడ్రేషన్ ప్రాముఖ్యతను వివరించింది. వేడి వాతావరణం కారణంగా కోల్పోయే ఎలక్ట్రోలైట్లను తిరిగి శరీరంలో భర్తీ చేయడం ఎంత అవసరమో eRZL డ్రింక్స్ను అందజేసి వివరించారు. శ్రీకాకుళంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది. వేడిని తట్టుకోవడానికి, తాజాగా ఉండటానికి హైడ్రేటెడ్గా ఉండటం ఎంత ముఖ్యమో వినియోగదారులు నేరుగా డ్రింక్ను రుచిచూసి తెలుసుకున్నారు.
