AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: పైకి చూస్తే డ్రై ఫ్రూట్ డబ్బాలు.. తీరా లోపల చెక్ చేయగా మైండ్ బ్లాంక్

పోలీసులు ఎంత అప్‌డేట్‌ అవుతున్నా గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. డ్రై ఫ్రూట్ కొరియర్స్‌ మాటున దందా చేస్తున్నారు. పక్కా ప్లానింగ్‌తో ఫీల్డ్‌లోకి ఎంటరైన పోలీసులు స్మగర్ల ఆటకట్టించారు.

AP News: పైకి చూస్తే డ్రై ఫ్రూట్ డబ్బాలు.. తీరా లోపల చెక్ చేయగా మైండ్ బ్లాంక్
Representative Image
Ravi Kiran
|

Updated on: Dec 02, 2024 | 9:07 AM

Share

మత్తుపదార్ధాల ఆనవాళ్లు లేకుండా చేస్తామంటూ ఏపీ ప్రభుత్వం గట్టి సంకల్పంతో ముందుకెళ్తుంటే.. గుట్టుచప్పుడు కాకుండా బిజినెస్‌ చేస్తున్నారు కేటుగాళ్లు. రోజుకో పద్దతిలో డ్రగ్స్‌, గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ పోలీసులకే సవాల్‌ విసురుతున్నాయి. అయితే ప్రభుత్వ ఆదేశాలతో గతకొన్ని రోజలుగా యమా స్పీడుమీదున్న పోలీసులు.. లేటెస్ట్‌గా వైజాగ్‌లో ఓ ముఠా గుట్టు రట్టు చేశారు. డ్రైఫ్రూట్స్‌ పేరుతో విశాఖ నుంచి ఢిల్లీకి కొరియర్‌లో గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు.

ఇది చదవండి: ఉన్నట్టుండి స్టేషన్‌లో ఖైదీ మిస్సింగ్.. ఊరంతా గాలించారు.. సీన్ కట్ చేస్తే

దాదాపు 44 కిలోల గంజాయిని సీజ్‌ చేశారు. ఢిల్లీ కేంద్రంగా ఈ వ్యవహారం నడుస్తున్నట్లు తెలిపారు పోలీసులు. పక్కా సమాచారంతో గంజాయి ఉన్న కొరియర్ పార్సిల్స్‌ను వెనక్కు రప్పించామన్నారు. పరారీలో ఉన్న ముగ్గురిని త్వరలోనే పట్టుకుంటామని అంటున్నారు. పలు షాకింగ్‌ విషయాలు వెల్లడించారు. ఇక నుంచి ఏపీలో మత్తుపదార్ధాలు అన్న మాట వినిపిస్తే దబిడిదిబిడే అంటున్నారు పోలీసులు. వచ్చే ఆరు నెలల్లో సీరియస్‌ డ్రైవ్ నిర్వహిస్తామని చెబుతున్నారు.

ఇది చదవండి: నీటిలో తేలియాడుతున్న నల్లటి ఆకారం.. చేప అనుకుంటే పొరపాటే.. చూస్తే గుండె గుభేల్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..