AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anantapur: ప్రాణం తీసిన కిల్లర్‌ డ్రింక్‌..! ద్రాక్షతోటలో ముగ్గురు అనుమానాస్పద మృతి..

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా ముగ్గురిలో ఒకరు అప్పటికే మృతి చెందినట్టు తెలిసింది. మరో ఇద్దర్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Anantapur: ప్రాణం తీసిన కిల్లర్‌ డ్రింక్‌..! ద్రాక్షతోటలో ముగ్గురు అనుమానాస్పద మృతి..
death
Jyothi Gadda
|

Updated on: Aug 19, 2022 | 7:41 AM

Share

Anantapur district: అనంతపురం నగర శివారులోని ఒక తోటలో మహారాష్ట్రకి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆలమూరుకి చెందిన రాజు అనే వ్యక్తి ద్రాక్ష తోటలో పని చేసేందుకు మహారాష్ట్ర నుంచి నెలరోజుల క్రితం ఐదు మంది వచ్చారు. రెండు రోజుల క్రితం ఒక వ్యక్తి మద్యం బాటిళ్లతో మహారాష్ట్ర నుంచి వచ్చాడు. ముగ్గురూ కలిసి రాత్రివేళ మద్యం సేవించారు. అయితే, ఆ మర్నాడు మధ్యాహ్నం తోటలో అస్మారక స్థితిలో పడి ఉన్న వీరిని చూసిన తోట యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా ముగ్గురిలో ఒకరు అప్పటికే మృతి చెందినట్టు తెలిసింది. మరో ఇద్దర్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ ఇద్దరూ కూడా మృతి చెందారు. వీరిలో ఇద్దరు వ్యక్తులు మహారాష్ట్ర సౌలాజీకి చెందిన భరత్ నామదేవ్ చౌహన్, దీపక్ జై సింగ్ శిరితోడేగా గుర్తించారు. అయితే వీరు ఏదైనా విషద్రావకం తాగి ఆత్మహత్య చేసుకున్నారా..? లేక మద్యం అతిగా తాగి మృతి చెందారా అన్నది తేలాల్సి ఉంది. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగానే అన్ని వివరాలు తెలుస్తాయని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి