Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ-హాజరు విధానం..ఉద్యోగుల్లో ఆందోళన.. నిమిషం నిబంధన సడలిస్తామన్న మంత్రి..

నిమిషం ఆలస్యమైనా సెలవుగా పరిగణిస్తామని ప్రభుత్వం నిబంధన తీసుకురావడంతో ఉపాధ్యాయులంతా ఈ-అటెండెన్స్ సిస్టమ్ ను వ్యతిరేకిస్తూ.. నిరసనలకు దిగారు. దీంతో ఉపాధ్యాయుల సందేహాలు, సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల నాయకులతో

Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ-హాజరు విధానం..ఉద్యోగుల్లో ఆందోళన.. నిమిషం నిబంధన సడలిస్తామన్న మంత్రి..
E Attendence Device
Follow us

|

Updated on: Aug 19, 2022 | 7:35 AM

Andhra Pradesh: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ ముఖ గుర్తింపు అటెండెన్స్ సిస్టమ్ అమలుచేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ప్రయోగాత్మకంగా తొలుత విద్యాశాఖలో ఈవిధానాన్ని అమలులోకి తీసుకురావడం.. నిమిషం ఆలస్యమైనా సెలవుగా పరిగణిస్తామని ప్రభుత్వం నిబంధన తీసుకురావడంతో ఉపాధ్యాయులంతా ఈ-అటెండెన్స్ సిస్టమ్ ను వ్యతిరేకిస్తూ.. నిరసనలకు దిగారు. దీంతో ఉపాధ్యాయుల సందేహాలు, సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల నాయకులతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారయణ సమావేశమయ్యారు. ఈసందర్భంగా మంత్రి చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వ ఉద్యోగుల్లో గుబులు మొదలైంది.

ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త నిబంధన ప్రకారం ఉద్యోగి తప్పనిసరిగా సమయానికి స్కూలు లేదా ఆఫీసుకు రావల్సి ఉంటుంది. వారు ఆప్రదేశంలో ఎన్ని గంటలు ఉంటున్నారు. ఎన్ని గంటలు పనిచేస్తున్నారో ఆన్ లైన్ కానుంది. ఎవరైనా ఉద్యోగి మూడు రోజులు ఆలస్యంగా వస్తే హాఫ్ డే లీవ్ గా పరిగణిస్తారు. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. తొలుత విద్యాశాఖలో ఈవిధానాన్ని అమలులోకి తీసుకురావడంతో ఉపాధ్యాయులంతా ఆందోళనకు దిగారు. తాము ఈ-అటెండెన్స్ విధానాన్ని వ్యతిరేకించడం లేదంటూనే.. తమ సొంత ఫోన్లలో యాప్ డౌన్ లోడ్ చేసుకోబోమని, ఇంటర్నెట్, సిగ్నల్ సమస్యల పేరుతో నిరసనలు చేపట్టారు. అయితే ఎలాగైనా ఈవిధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. విద్యాశాఖ తర్వాత ఈవిధానాన్ని అన్ని ప్రభుత్వ శాఖలకు విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కొంతమంది సిబ్బంది సమయానికి విధులకు రాకపోవడం, సమయం కాకముందే వెళ్లిపోవడం ఎక్కువుగా జరుగుతుండటంతో.. వాటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ-అటెండెన్స్ విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో పాటు నిమిషం ఆలస్యమైనా సెలవుగా పరిగణిస్తామని చెప్పడంతో ఉద్యోగులు ఈవిధానాన్ని వ్యతిరేకిస్తున్నారు.

కొన్ని సందర్భాల్లో అనుకోని కారణాల వల్ల ఆలస్యమవుతుందని.. అలాంటప్పుడు దానిని లీవ్ పరిగణించడం ద్వారా తాము నష్టపోతామనే వాదనను తీసుకొచ్చారు. అయితే ఏదైనా సమస్య కారణంగా ఆలస్యం అవ్వడం అప్పుడప్పుడు జరుగుతుందని.. తరచూ జరగదు కాబట్టి.. మూడు సార్లు లేట్ గా వస్తే హాఫ్ డే లీవ్ గా పరిగణిస్తామని ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. అయితే ఏదో ఒక సాకుతో ఈ-అటెండెన్స్ విధానాన్ని వెనక్కి తీసుకునేలా ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఈ-అటెండెన్స్ సిస్టమ్ ను అమలుచేయాల్సిందేనని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేయడంతో ఉపాధ్యాయులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం