Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Washington : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకం.. కొనసాగుతున్న ఆపరేషన్.. ఆరేళ్ల చిన్నారి మృతి..

Washington : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఈసారి ఏకంగా అమెరికా క్యాపిటల్ సిటీ వాషింగ్టన్ డిసి..

Washington : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకం.. కొనసాగుతున్న ఆపరేషన్.. ఆరేళ్ల చిన్నారి మృతి..
Shooting In Washington
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 17, 2021 | 6:12 PM

Washington : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఈసారి ఏకంగా అమెరికా క్యాపిటల్ సిటీ వాషింగ్టన్ డిసిలో దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఆరేళ్ల బాలిక మృతి చెందగా.. ఐదుగురు పెద్దలు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. వాషింగ్టన్ డిసి లోని ఆగ్నేయ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎగ్జిక్యూటీవ్ అసిస్టెంట్ చీఫ్ అషాన్ బెనెడిక్ట్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తు తెలియని దుండగులు ఒక్కసారిగా జనాలపై కాల్పులకు తెగబడ్డారు.

వెంటనే అలర్ట్ అయిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకోగా.. వారిపైనా కాల్పలుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సాధారణ పౌరులైన ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులకు బుల్లెట్ గాయాలు అయ్యాయి. దుండగుల కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఒక్క దుండగులు కూడా చిక్కలేదు. అనుమనితులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కానీ వారు మాత్రం చిక్కడం లేదు. దాంతో అధికారులు.. స్థానిక ప్రజల సహాయ సహకారాలు కోరుతున్నారు. ఈ కాల్పులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also read:

Sanchaita: అశోక్ గజపతి రాజుపై మరోసారి విరుచుకుపడిన సంచయిత.. ట్విట్టర్ వేదికగా హాట్ కామెంట్స్..

Hyderabad: ‘మరో మహిళతో మీ భర్త’ అంటూ ఆమె చెప్పిన ఒక్క మాట.. ఓ ఇంటి దీపాన్ని ఆర్పేసింది..

Hyderabad : అసలేం తెలియనట్లుగా మహిళ మృతదేహాన్ని తీసుకువచ్చారు.. ఆపై పరారయ్యారు.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన..!