AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus: కోవిడ్ పోరులో ముందుకు వచ్చిన ట్విట్టర్.. భారత్‏కు భారీగా విరాళం ప్రకటించిన సంస్థ..

కరోనా వైరస్.. దేశాన్ని అతాలకుతాలం చేస్తోంది. యావత్ భారతం కోవిడ్ సెకండ్ వేవ్ తో పోరాడుతుంది. ఈ సంక్షోభంలో మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ 15 మిలియన్

Corona Virus: కోవిడ్ పోరులో ముందుకు వచ్చిన ట్విట్టర్.. భారత్‏కు భారీగా విరాళం ప్రకటించిన సంస్థ..
Twitter
Rajitha Chanti
|

Updated on: May 11, 2021 | 1:04 PM

Share

కరోనా వైరస్.. దేశాన్ని అతాలకుతాలం చేస్తోంది. యావత్ భారతం కోవిడ్ సెకండ్ వేవ్ తో పోరాడుతుంది. ఈ సంక్షోభంలో మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ 15 మిలియన్ డాలర్లు విరాళంగా ప్రకటించింది. ఈ మొత్తాన్ని కేర్, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యూఎస్ఏ అనే మూడు ప్రభుత్వేతర సంస్థలకు విరాళంగా ఇచ్చినట్లు ట్విట్టర్ సీఈఓ జాక్ ప్రాటిక్ డోర్సే సోమవారం ట్వీ్ట్ చేశారు. కేర్ కి 10 మిలియన్ డాలర్లు ఇవ్వగా.. ఎయిర్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యూఎస్ఏలకు ఒక్కొక్కటి చోప్పున 2.5 మిలియన్ డాలర్లు వచ్చాయి.

‘సేవా ఇంటర్నేషనల్ ఒక హిందూ విశ్వాస ఆధారిత, మానవతా, లాభాపేక్షలేని సేవా సంస్థ.. సేవా ఇంటర్నేషనల్ ‘హెల్ప్ ఇండియా డిఫీట్ కోవిడ్-19’ ప్రచారంలో భాగంగా బాధితుల ప్రాణాలను నిలిపే ఆక్సిజన్ పరికరాలు, కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, BiPAP (Bilevel Positive Airway Pressure), CPAP (Continuous Positive Airway Pressure) యంత్రాల సేకరణకు ఈ నిధులు తోడ్పడతాయి’’ అని ఆ సంస్థ ప్రకటించింది.

ఈ ప్రకటనపై స్పందించిన సేవా ఇంటర్నేషనల్ మార్కెటింగ్ అండ్ ఫండ్ డెవలప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ ఖాడ్కేకర్ డోర్సీకి విరాళం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు, సేవా యొక్క కృషికి గుర్తింపు లభించడం సంతోషంగా ఉందని అన్నారు. మేము స్వచ్ఛందంగా నడిచే లాభాపేక్షలేని సంస్థ, పవిత్రమైన హిందూ ధర్మాన్ని అనుసరించి, అందరికీ సేవ చేయాలని మేము నమ్ముతున్నాము, ‘సర్వే భవంతు సుఖిభవ’ – ‘అందరూ సంతోషంగా ఉండండి’ అని ఖాడ్కేకర్ పిటిఐకి చెప్పారు.

హ్యూస్టన్ ప్రధాన కార్యాలయం సేవా యఎస్ఎ ఇప్పటివరకు తన ఇండియా కోవిడ్ 19 సహాయక చర్యల కోసం 17.5 మిలియన్ డాలర్లను సమీకరించింది. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ నియంత్రించడానికి కేర్ అత్యవసర చర్యకు 10 మిలియన్ డాలర్ల విరాళంగా చేయడం సహయపడుతుందని ట్విట్టర్ తెలిపింది.

తాత్కలిక కరోనా సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ ప్రయత్నాలను భర్తీ చేయడానికి నిధులు ఉపయోగించబడతాయి. ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు ఆక్సిజన్, పిపిఇ కిట్లు మరియు ఇతర అవసరమైన అత్యవసర సామాగ్రిని అందించడం; మరియు వ్యాక్సిన్ సంకోచాన్ని పరిష్కరించడం మరియు ప్రజలు టీకాలు వేసేలా చూడడంలో సహాయపడుతుంది. అసోసియేషన్ ఫర్ ఇండియా డెవలప్‌మెంట్ (AID) అనేది స్వచ్ఛంద ఉద్యమం, ఇది స్థిరమైన, సమానమైన న్యాయమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, జీవనోపాధి, పర్యావరణం, మానవ హక్కుల పరస్పర అనుసంధాన రంగాలపై భారతదేశంలోని అట్టడుగు సంస్థలతో ఎయిడ్ భాగస్వాములు ఉన్నారని ట్విట్టర్ తెలిపింది. ఈ గ్రాంట్ అండర్ రిసోర్ట్స్ కమ్యునిటీలు కోవిడ్ లక్షణాలను గుర్తించడానికి, వ్యాప్తి నిరోధించడానికి, సంరక్షణ, చికిత్స నివారించడానికి ఆక్సిజన్, ఆక్సిమీటర్లు, థర్మామీటర్లు, రక్షిత గేర్, టీకాతో సహా వైద్య పరికరాల నుంచి ప్రయోజనం పొందడం, లాక్ డౌన్ నుంచి బయటపడడం, జీవనోపాధిని తిరిగి పొందడం, గ్రామీణ ప్రాంతాలకు సేవలు అందించే ఆసుపత్రులు, ఎన్జీఓలను బలోపేతం చేస్తుందని తక్కువ ఆదాయ వర్గాలు ట్విట్టర్ స్పష్టం చేసింది.

Also Read: Weight Loss: కాఫీ తాగితే బరువు తగ్గుతారా ? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..

కరోనా నుంచి కోలుకున్న వారిలో ఆ సమస్యలు…తాజా సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి