ఉత్తర జపాన్లో 6.7 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ!
ఆదివారం సాయంత్రం ఉత్తర జపాన్ను భారీ భూకంప వణికించింది. 6.7 తీవ్రతతో భూకంపం తాకింది. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో అనేక ప్రకంపనలు సంభవించాయి. భూకంపం తర్వాత సునామీ హెచ్చరిక జారీ చేస్తున్నట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. ఇవాటే ప్రిఫెక్చర్ తీరంలో దాదాపు 10 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని ఏజెన్సీ తెలిపింది.

ఆదివారం సాయంత్రం ఉత్తర జపాన్ను భారీ భూకంప వణికించింది. 6.7 తీవ్రతతో భూకంపం తాకింది. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో అనేక ప్రకంపనలు సంభవించాయి. భూకంపం తర్వాత సునామీ హెచ్చరిక జారీ చేస్తున్నట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. ఇవాటే ప్రిఫెక్చర్ తీరంలో దాదాపు 10 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని ఏజెన్సీ తెలిపింది. ఇప్పటివరకు, ఆ ప్రాంతంలోని రెండు అణు విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. అయితే వాటికి ఎలాంటి నష్టం కానీ, పనిచేయకపోవడం గురించి కానీ ఎటువంటి సమాచారం అందలేదని అధికార వర్గాలు వెల్లడించాయి.
భూకంపం వచ్చిన వెంటనే, ఉత్తర తీరప్రాంతాలను 1 మీటర్ (3 అడుగులు) ఎత్తు వరకు సునామీ అలలు తాకవచ్చని ఏజెన్సీ హెచ్చరించింది. భూకంపం వచ్చిన గంట తర్వాత కూడా ఈ హెచ్చరిక అమలులో ఉంది. జపాన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ NHK ప్రజలు తీరప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరింది. ఎందుకంటే ఎప్పుడైనా సునామీ అలలు రావచ్చని తెలిపింది. NHK కూడా ఈ ప్రాంతాన్ని మరిన్ని ప్రకంపనలు తాకవచ్చని హెచ్చరించింది.
ఇవాటే ప్రిఫెక్చర్లోని ఒఫునాటో నగరం, ఒమినాటో ఓడరేవులో దాదాపు 10 సెంటీమీటర్ల (4 అంగుళాల) ఎత్తులో సునామీ అలలు నమోదయ్యాయని NHK పేర్కొంది. భూకంపం కారణంగా ఆ ప్రాంతంలో నడుస్తున్న బుల్లెట్ రైళ్లు కొద్దిసేపు ఆలస్యం అయ్యాయని రైల్వే ఆపరేటర్ JR ఈస్ట్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగింది.
A magnitude 6.2 earthquake struck off the east coast of Honshu, Japan at 17:03 local time on November 9, 2025. #地震 #sismo
The epicenter was 112 km east of Miyako. Tsunami evaluation is in progress; alerts may follow for coastal areas in Japan. pic.twitter.com/5movhhr96P
— GeoTechWar (@geotechwar) November 9, 2025
జపాన్లో భూకంపాలు ఎందుకు?
ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే దేశాలలో జపాన్ ఒకటి. పసిఫిక్ మహాసముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్లో ఉన్న ఈ ప్రాంతంలో భూమి టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొంటాయి. దీని వలన తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. 2011 మార్చిలో ఇదే ప్రాంతంలో వినాశకరమైన భూకంపం సంభవించింది. ఆ సమయం వచ్చిన సునామీ జపాన్ను అతలాకుతలం చేసింది. దీనివల్ల వేలాది మంది మరణించారు. విస్తృత విధ్వంసం సంభవించింది. ఈసారి పెద్దగా నష్టం జరిగినట్లు సమాచారం లేనప్పటికీ, అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
A M6.8 earthquake hit off the east coast of Honshu, Japan about 1hr 40mins ago pic.twitter.com/z5U74CErk9
— Pesquisador ! ☄️🪐🗿 (@ospensadorestt) November 9, 2025
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
