AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: రెండు దేశాల మధ్య భీకర పోరు.. రష్యన్ మేజర్ జనరల్ విటాలీ గెరాసిమోవ్‌ మృతి!

ఉక్రెయిన్ ఖార్కివ్‌లో రష్యన్ మేజర్ జనరల్ విటాలీ గెరాసిమోవ్‌ ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మెయిన్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్‌ను ఉటంకిస్తూ కైవ్ ఇండిపెండెంట్ ఈ విషయాన్ని పేర్కొంది.

Russia Ukraine War: రెండు దేశాల మధ్య భీకర పోరు.. రష్యన్ మేజర్ జనరల్ విటాలీ గెరాసిమోవ్‌ మృతి!
Russian Major General Vitaly Gerasimov
Balaraju Goud
|

Updated on: Mar 08, 2022 | 8:52 AM

Share

Russia Ukraine War: ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధం 13వ రోజుకు చేరింది. మూడు దఫాలుగా జరిపిన శాంతి చర్చలు మరోసారి విఫలమయ్యాయి. ఓ వైపు రెండు దేశాల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. అటువంటి పరిస్థితిలో ఉక్రెయిన్ ఖార్కివ్‌లో రష్యన్ మేజర్ జనరల్ విటాలీ గెరాసిమోవ్‌ ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మెయిన్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్‌ను ఉటంకిస్తూ కైవ్ ఇండిపెండెంట్ ఈ విషయాన్ని పేర్కొంది. కైవ్ ఇండిపెండెంట్ ఈ మేరకు ట్వీట్‌ చేశారు. “ఖార్కివ్ సమీపంలో రష్యన్ మేజర్ జనరల్ విటాలీ గెరాసిమోవ్‌ను ఉక్రెయిన్ దాడిలో మరణించారని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ చీఫ్ ఇంటెలిజెన్స్ విభాగం తెలిపింది.” గెరాసిమోవ్ రెండవ చెచెన్ యుద్ధంలో పాల్గొన్న సీనియర్ సైనిక అధికారి. అంతేకాదు క్రిమియాను స్వాధీనం చేసుకున్నందుకు పథకం రచించడంలో కీలక పాత్ర పోషించారు.

ఇదిలావుంటే, సోమవారం, రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య బెలారస్‌లో జరిగిన మూడవ రౌండ్ శాంతి చర్చలు మరోసారి విఫలమయ్యాయి. అయితే, కాల్పుల విరమణ, భద్రతా హామీలతో సహా ఒప్పందంలోని ప్రధాన రాజకీయ కూటమిపై లోతైన సంప్రదింపులు జరుగుతున్నాయని ఉక్రేనియన్ ప్రతినిధి బృందం సభ్యుడు మైఖైలో పోడోలిక్ తెలిపారు. అదే సమయంలో, ఉక్రెయిన్‌లోని మానవతా కారిడార్‌ల లాజిస్టిక్స్‌ను మెరుగుపరచడంలోనూ అనుకున్న ఫలితాలను సాధించలేకపోయారు.

అదే సమయంలో, రష్యా అధ్యక్షుడి సహాయకుడు, రష్యా ప్రతినిధి బృందం అధిపతి వ్లాదిమిర్ మెడిన్‌స్కీ మాట్లాడుతూ, “రాజకీయ, సైనిక అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. అయితే, సానుకూలమైన ఫలితాలు సాధించలేకపోయాం.. మరోసారి దఫా చర్చలు తప్పనిసరిగా కనిపిస్తోంది” అని సమావేశం తర్వాత మెడిన్‌స్కీ అన్నారు. దాదాపు 3 గంటల పాటు సమావేశం జరిగినట్లు సమాచారం.

అంతకుముందు, ఉక్రెయిన్ నుండి పౌరులను తరలించడానికి సోమవారం ఉదయం నుండి కాల్పుల విరమణతో అనేక ప్రాంతాల్లో మానవతా కారిడార్లను ప్రారంభిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. అయినప్పటికీ, రష్యా మరియు దాని మిత్రదేశమైన బెలారస్‌కు వెళ్లే చాలా తరలింపు మార్గాల గురించి ఉక్రెయిన్ ఆందోళన చెందుతోంది. కారిడార్ల కొత్త ప్రకటన తర్వాత కూడా, రష్యా సైన్యం కొన్ని ఉక్రేనియన్ నగరాలపై రాకెట్ దాడులకు పాల్పడింది. కొన్ని ప్రాంతాలలో భీకర పోరు కొనసాగింది.

Read Also… మరణానికి ముందు.. ఆఖరు ఆ 30 సెకన్లు ఏం జరుగుతుంది ?? వీడియో