AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ గ్లోబల్ ఛాలెంజ్ పై అంతా కలిసి పోరాడుదాం. ఇండియాకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంఘీభావం

సెకండ్ కోవిడ్ వేవ్ కేసులతో తల్లడిల్లుతున్న ఇండియాకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రపంచ వ్యాప్త సవాల్ పై అంతా కలిసి పోరాడుదామని ట్వీట్ చేశారు.

ఈ గ్లోబల్ ఛాలెంజ్ పై అంతా కలిసి పోరాడుదాం. ఇండియాకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంఘీభావం
Pak Pm Imran Khan
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 24, 2021 | 4:39 PM

Share

సెకండ్ కోవిడ్ వేవ్ కేసులతో తల్లడిల్లుతున్న ఇండియాకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రపంచ వ్యాప్త సవాల్ పై అంతా కలిసి పోరాడుదామని ట్వీట్ చేశారు. ఇది ఉమ్మడిగా జరగాలని పేర్కొన్నారు. ప్రమాదకరమైన కోవిడ్ వేవ్ తో భారత ప్రజలు పోరాటం జరుపుతున్నారని, మా పొరుగు దేశంలో (భారత్) వ్యాప్తి చెందిన పాండమిక్ కారణంగా మరణించినవారి కుటుంబాలకు, బాధితులకు సానుభూతి తెలుపుతున్నానని ఆయన అన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో అంతా సమిష్టిగా ఈ సవాలును ఎదుర్కొందామని ఆయన అన్నారు. అటు-ఇండియాలో శనివారం నాటికి కరోనా కేసులు 3,46,786 కి చేరుకున్నాయి. యాక్టివ్ కేసులు సుమారు పాతిక  లక్షలు ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  ఇప్పటివరకు 1,89,544 మంది కరోనా రోగులు మృతి చెందినట్టు తెలిపింది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు వద్ద 3 వేలకు పైగాసార్లు  కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్ ప్రభుత్వం ఇప్పుడు … ఇండియా పట్ల సంఘీభావాన్ని వ్యక్తం చేయడం విశేషం. ఏమైనా…. ఈ విపత్కర పరిస్థితుల్లో దాయాది దేశం నేను ఉన్నానంటూ పరోక్షంగా అభయ హస్తం ఇస్తోంది.

ఇలా ఉండగా పాకిస్థాన్ కూడా ఆక్సిజన్ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటోంది. అయితే ఇండియాతో పోలిస్తే తక్కువే. పాక్ లో శుక్రవారం ఒక్కరోజే 144  మంది కరోనా రోగులు మృతి చెందారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 16,842 కి చేరింది. ఈ దేశంలో 784,108 కోవిడ్ కేసులు ఉన్నట్టు అంచనా.. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ విధించాలని  పాక్ ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.  అయితే విపక్షాలతో కలిసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: కోవిడ్ డ్యూటీలో 4 నెలల గర్భంతో నర్సు , ఉపవాస దీక్ష పాటిస్తూనే రోగులకు సేవలు

Art of a child: టీచర్ చిన్నబుచ్చింది.. అమ్మ ఆలోచించింది.. వాళ్ళు ప్రోత్సహించారు..ఆరేళ్ళ చిన్నారి అద్భుత పెయింటర్ అయింది!

Follow Us
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్