AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: పాకిస్తాన్‌లో ఘోర బస్సుప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ బస్సు.. 41 మంది దుర్మరణం

బెలూచిస్తాన్‌ లోని లస్బెలా ప్రాంతంలో బ్రిడ్జిపై యూ టర్న్‌ తీసుకుంటుండగా బస్సు అదుపు తప్పింది. వంతెన మీద నుంచి బస్సు కిందకు పడిపోవడంతో మంటలు చెలకేగాయి.

Pakistan: పాకిస్తాన్‌లో ఘోర బస్సుప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ బస్సు.. 41 మంది దుర్మరణం
Balochistan Bus
Sanjay Kasula
|

Updated on: Jan 29, 2023 | 1:55 PM

Share

పాకిస్తాన్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బెలూచిస్తాన్‌ లోని లస్బెలా ప్రాంతంలో బ్రిడ్జిపై యూ టర్న్‌ తీసుకుంటుండగా బస్సు అదుపు తప్పింది. వంతెన మీద నుంచి బస్సు కిందకు పడిపోవడంతో మంటలు చెలకేగాయి. ఈ ప్రమాదంలో 41 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. క్వెట్టా నుంచి కరాచీ వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి ఆరుగురు గాయాలతో బయటపడ్డారు.

లాస్బెలా సమీపంలోని వంతెన స్తంభాన్ని వాహనం ఢీకొట్టింది. బస్సు ప్రవాహంలో పడి కాలిపోయి ఉంటుందని లాస్బెలా అసిస్టెంట్ కమిషనర్ హమ్జా అంజుమ్ తెలిపారు. వాహనం మితిమీరిన వేగంతో వచ్చిందని తెలిపారు. స్సులోంచి లభ్యమైన మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. మృతులను గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్ష చేయనున్నట్లు అంజుమ్‌ తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం