Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Miracle rescues: భూకంప శిథిలాల కింద ప్రాణాలు..! 13 రోజులపాటు ఆ దంపతుల నరకయాతన.. చివరకు..

అతను శిథిలాల కింద ఇరుక్కుపోయాడని భయపడినట్లుగానే జరిగిందన్నారు. రెస్క్యూ టీమ్‌లు అక్కడికి చేరుకున్నప్పటికీ వారిని కాపాడలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

Miracle rescues: భూకంప శిథిలాల కింద ప్రాణాలు..! 13 రోజులపాటు ఆ దంపతుల నరకయాతన.. చివరకు..
Turkey Earthquake
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 20, 2023 | 1:55 PM

ఫిబ్రవరి 6న టర్కీలో సంభవించిన భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. వేల సంఖ్యలో ప్రజల్ని సజీవ సమాధి చేసేసింది. భూకంప ధాటికి మరణించిన మృతుల సంఖ్య దాదాపు 50వేలకు దగ్గరకు చేరింది. రోజులు గడుస్తున్న కొద్దీ ప్రాణాలతో బయటపడే అవకాశాలు తగ్గిపోతున్నాయి. అయితే, రెస్క్యూ మిషన్ సమయంలో అనేక అద్భుతాలు జరుగుతాయి. ఎవరూ నమ్మలేని సంఘటనలు కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. భూకంపం సంభవించిన 13 రోజుల తర్వాత శిథిలాల మధ్య చిక్కుకుపోయిన భార్యాభర్తలు సజీవంగా బయటపడ్డారు. ఈ ఘటనలో తన బిడ్డను కోల్పోయినప్పటికీ దంపతులిద్దరూ ప్రాణాలతో బయటపడటం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది.

భూకంపం వచ్చిన 13 రోజుల తర్వాత భార్యాభర్తలు సజీవంగా బయటపడ్డారు. మీడియా నివేదికల ప్రకారం, టర్కీ భూకంపం సంభవించిన 13 రోజుల తర్వాత, భూకంపం సంభవించిన 450 గంటల తర్వాత, హెడ్ ప్రావిన్స్ రాజధాని అంటక్యాలో భర్త, భార్య వారి బిడ్డను శిథిలాల కింద నుంచి తొలగించారు. వారిని సమీర్ మహ్మద్ అకర్ (49), అతని భార్య రక్త (40), వారి 12 ఏళ్ల కుమారుడుగా గుర్తించారు. ముగ్గురినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా దంపతుల కుమారుడు మృతి చెందాడు. భార్యభర్తలకు వైద్యం అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే, అంటక్యా నగరంలో ఘనాకు చెందిన 31 ఏళ్ల సాకర్ ప్లేయర్ మృతదేహం కూడా శిథిలాల కింద గుర్తించారు. ఈ ఆటగాడి పేరు క్రిస్టియన్ అట్సు. అతను ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ క్లబ్‌లు చెల్సియా, న్యూకాజిల్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. అపార్ట్‌మెంట్ భవనం శిథిలాల నుంచి సెర్చ్ టీమ్‌లు అట్సు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయని అట్సు మేనేజర్ తెలిపారు. ప్రస్తుతం అతనికి సంబంధించిన వస్తువుల సేకరణ కొనసాగుతుందని చెప్పారు..

ఇవి కూడా చదవండి

అట్సు మరణానికి అతని క్లబ్ బృందం సంతాపం తెలిపింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేయడానికి తమ వద్ద మాటలు లేవని క్లబ్ పేర్కొంది. అతను గొప్ప ఆటగాడని, అతని రాక జట్టుకు ఊపునిచ్చిందన్నారు. టర్కీలో భూకంపం సంభవించిన తర్వాత అట్సు అదృశ్యమయ్యాడు. అతను శిథిలాల కింద ఇరుక్కుపోయాడని భయపడినట్లుగానే జరిగిందన్నారు. రెస్క్యూ టీమ్‌లు అక్కడికి చేరుకున్నప్పటికీ వారిని కాపాడలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

లైవ్ మ్యాచ్‌లో అవమానం.. ఒక్క మాటతో గోయెంకాకు ఇచ్చిపడేశాడుగా
లైవ్ మ్యాచ్‌లో అవమానం.. ఒక్క మాటతో గోయెంకాకు ఇచ్చిపడేశాడుగా
మధుమేహం ఉన్నవారు చెరుకు రసం తాగొచ్చా.. తాగకూడదా..?
మధుమేహం ఉన్నవారు చెరుకు రసం తాగొచ్చా.. తాగకూడదా..?
షాపింగ్ కోసం వెళ్తున్నారా.. ఈ టిప్స్ తెలుసుకోండి
షాపింగ్ కోసం వెళ్తున్నారా.. ఈ టిప్స్ తెలుసుకోండి
ఆది శంకర మఠంలో మే1న చక్ర చండీ యాగం నిర్వహణ.. పూర్తి వివరాలు
ఆది శంకర మఠంలో మే1న చక్ర చండీ యాగం నిర్వహణ.. పూర్తి వివరాలు
వీటిలో ఉప్పు కలిపితే మీ ఆరోగ్యానికి డేంజర్ బెల్స్ మోగినట్టే..!
వీటిలో ఉప్పు కలిపితే మీ ఆరోగ్యానికి డేంజర్ బెల్స్ మోగినట్టే..!
ఎవర్రా సామీ నువ్వు.. 19 బంతుల్లో ఒక్క బౌండరీ కొట్టలే..
ఎవర్రా సామీ నువ్వు.. 19 బంతుల్లో ఒక్క బౌండరీ కొట్టలే..
షుగర్ కు చెక్ పెట్టాలంటే ఉదయం లేవగానే ఈ నీళ్లు తాగాల్సిందే
షుగర్ కు చెక్ పెట్టాలంటే ఉదయం లేవగానే ఈ నీళ్లు తాగాల్సిందే
ఇంటర్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్ 2025 ఫలితాలు వచ్చేశాయ్.. డైరెక్ట్ లింక్
ఇంటర్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్ 2025 ఫలితాలు వచ్చేశాయ్.. డైరెక్ట్ లింక్
కోచ్‌గా కాదు ఓ అసలైన తండ్రిగా.. యువీ షాకింగ్ కామెంట్స్
కోచ్‌గా కాదు ఓ అసలైన తండ్రిగా.. యువీ షాకింగ్ కామెంట్స్
కెప్టెన్‌కి బహుమతిగా గోల్డ్ ఐఫోన్.. ఎత్తుకెళ్లిన తోటి ప్లేయర్
కెప్టెన్‌కి బహుమతిగా గోల్డ్ ఐఫోన్.. ఎత్తుకెళ్లిన తోటి ప్లేయర్