AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China mine Accident: చైనాలో పోటెత్తిన వరదలు.. బొగ్గు గనిలో గల్లంతైన 21 మంది మైనర్లు..

Mine Accident in China: చైనాలోని వాయువ్య ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. ప్రకృతి విలయానికి ఓ బొగ్గు గనిలో పనిచేస్తున్న

China mine Accident: చైనాలో పోటెత్తిన వరదలు.. బొగ్గు గనిలో గల్లంతైన 21 మంది మైనర్లు..
Mine Accident In China
Shaik Madar Saheb
|

Updated on: Apr 11, 2021 | 12:44 PM

Share

Mine Accident in China: చైనాలోని వాయువ్య ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. ప్రకృతి విలయానికి ఓ బొగ్గు గనిలో పనిచేస్తున్న 21 గల్లంతయ్యారు. చైనాలోని జిన్జియాంగ్‌ బొగ్గుగనిలో శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చైనాలోని వాయవ్య ప్రాంతం.. జిన్జియాంగ్‌ ఉయ్‌గుర్‌ అటానమస్‌ రీజియన్‌లో శనివారం అకస్మాత్తుగా భారీ వరదలు సంభవించాయి. దీంతో చాంగ్జీ హుయ్‌ అటానమస్‌ ప్రిఫెక్చర్‌లోని హుతుబి కౌంటీలో ఉన్న బొగ్గుగనిలోకి భారీగా వరద నీరు ప్రవేశించింది.

అయితే ఆ సమయంలో గనిలో 29 మంది మైనర్లు పనిచేస్తున్నారని చైనా డైలీ వెల్లడించింది. వెంటనే రంగంలోకి దిగిన విపత్తు అధికారులు.. ఇప్పటివరకు ఎనిమిది మందిని మాత్రమే రక్షించారని పేర్కొంది. మరో 21 మంది మైనర్ల ఆచూకీ తెలియడం లేదని వెల్లడించింది. కనిపించకుండా పోయిన వారికోసం గాలింపు చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని చైనా డైలీ వివరించింది. కాగా.. బోగ్గు గని భూమి పైనుంచి దాదాపు 1200 మీటర్ల లోతులో ఉంటుంది. అక్కడ మైనర్లు పనిచేస్తున్నారు. దీంతో రెస్క్యూ నిర్వహణ కష్టంగా మారింది. మోటర్ల ద్వారా వరద నీటిని బయటకు పంపుతున్నారు.

కాగా.. చైనాలో మైనింగ్ ప్రమాదాలు జరగడం సర్వసాధారణం. భద్రతా పరంగా.. నిబంధనలు బలహీనంగా ఉండటంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటుంటాయి. జనవరిలో తూర్పు చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌లోని ఒక గనిలో 22 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో 11 మందిని రక్షించగా.. 10 మంది మరణించారు. ఇంకొకరి జాడ తేలియలేదు. డిసెంబరులో కూడా భూగర్భంలో చిక్కుకొని 23 మంది మైనర్లు మరణించారు.

Also Read:

హడలెత్తిస్తున్న మిడతల దండు.. క్షణాల్లో చేతికొచ్చిన పంటలు మాయం.. గాలి ఎటు వీస్తే అటు ప్రయాణం

Indonesia Earthquake: ఇండోనేషియాను వణికిస్తున్న విపత్తులు.. భారీ భూకంపం.. ఆరుగురు మృతి