AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐడీఎఫ్ చేతుల్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్‌ హతం.. ప్రకటించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి

ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్‌ను ఐడీఎఫ్ హతమార్చిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి బుధవారం (మార్చి 18, 2026) ప్రకటించారు. రాత్రిపూట జరిగిన దాడిలో ఖతీబ్ మరణించారని ఆయన తెలిపారు. అయితే, ఇరాన్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, ఖతీబ్ ఆచూకీ తెలిపిన వారికి 10 మిలియన్ డాలర్ల వరకు బహుమతిని కూడా అమెరికా ప్రకటించింది.

ఐడీఎఫ్ చేతుల్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్‌ హతం.. ప్రకటించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి
Iran Intelligence Minister Ismail Khatib
Balaraju Goud
|

Updated on: Mar 18, 2026 | 5:12 PM

Share

ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్‌ను ఐడీఎఫ్ హతమార్చిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి బుధవారం (మార్చి 18, 2026) ప్రకటించారు. రాత్రిపూట జరిగిన దాడిలో ఖతీబ్ మరణించారని ఆయన తెలిపారు. అయితే, ఇరాన్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇరాన్ శక్తివంతమైన జాతీయ భద్రతా అధిపతి, ఐఆర్‌జీసీ బసిజ్ పారామిలిటరీ దళాధిపతి అయిన అలీ లారిజానీ హతమైనట్లు ఇజ్రాయెల్ ధృవీకరించిన తర్వాత ఇస్మాయిల్ ఖతీబ్ మరణం సంభవించింది.

అదనపు అనుమతి లేకుండా ఏ ఇతర సీనియర్ ఇరాన్ అధికారినైనా లక్ష్యంగా చేసుకుని హతమార్చేందుకు తాము, ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సైన్యానికి అధికారం ఇచ్చామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కారెట్జ్ చెప్పినట్లు అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. గత వారం అమెరికా సమాచారం కోరుతున్న అధికారులలో ఖతీబ్ కూడా ఉన్నారు. ఖతీబ్ ఆచూకీ తెలిపిన వారికి 10 మిలియన్ డాలర్ల వరకు బహుమతిని కూడా అమెరికా ప్రకటించింది.

ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) టెహ్రాన్‌లోని ఒక రివల్యూషనరీ గార్డ్ యూనిట్, భద్రతా దళాల సరఫరా కేంద్రం, ఒక క్షిపణి వ్యవస్థపై దాడి చేశాయి. ఈ దాడిలో పలువురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. టెహ్రాన్‌లోని ఒక కమాండ్ సెంటర్, క్షిపణి వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ వైమానిక దళం తెలిపింది.

ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజానీ ఇజ్రాయెల్ దాడిలో మరణించినట్లు ఆ మండలి ఇంతకుముందే ధృవీకరించింది. ఇరాన్‌కు చెందిన తస్నిమ్ వార్తా సంస్థ ప్రకారం, మంగళవారం ఉదయం (మార్చి 17, 2026) లారిజానీ, అతని కుమారుడు మోర్టెజా లారిజానీ, మండలి సచివాలయంలో భద్రతా వ్యవహారాల ఉప అధిపతి అయిన అలీరెజా బయాత్ తోపాటు,పలువురు ఇతర ముఖ్యనేతలు మరణించారని ఆ మండలి ఒక ప్రకటనలో తెలిపింది.

ఇరాన్‌పై కొనసాగుతున్న దాడుల్లో ఐడీఎఫ్ లారిజానీని హతమార్చిందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఇదిలాఉండగా, అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో బసిజ్ వాలంటీర్ దళం అధిపతి ఘోలమ్రెజా సోలేమానీ మరణించినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) మంగళవారం ధృవీకరించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us