వామ్మో.. ఆ దేశంలో విజృంభిస్తున్న ప్రాణాంతక వైరస్.. ముగ్గురు మృతి.. కరోనా కన్నా డేంజర్..
ఆఫ్రికాలోని ఇథియోపియాలో మరో వైరస్ అందరినీ భయపెడుతుంది. ఇది ఎబోలా లాంటి అత్యంత ప్రమాదకరమైనది. పండ్ల గబ్బిలాల నుండి మనుషులకు వ్యాపించి, శరీర ద్రవాల ద్వారా త్వరగా అంటుకుంటుంది. దీనికి ప్రత్యేక చికిత్స లేకపోవడం ఆందోళణ కలిగిస్తుంది. దీన్ని లక్షణాలు, మరణం ఎలా సంభవిస్తుందనేది తెలుసుకుందాం..

ఆఫ్రికాలో మరోసారి అత్యంత ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తి మొదలైంది. ఇది ఎబోలా లాంటి చాలా ప్రమాదకరమైనది. దక్షిణ సూడాన్ సరిహద్దుల్లోని ప్రాంతంలో మార్బర్గ్ హెమరేజి ఈ వైరస్ను గుర్తించిన ఇథియోపియా ప్రభుత్వం.. వైరస్తో ముగ్గురు చనిపోయారని ధ్రువీకరించింది. ఇథియోపియాలోని ఓమో అనే దక్షిణ ప్రాంతంలో ఈ వైరస్ను గుర్తించారు. మొత్తం 17 అనుమానిత కేసులపై పరీక్షలు చేయగా, 3 మరణాలు మార్బర్గ్ వల్లే వచ్చాయని ఆరోగ్య మంత్రి మెక్దేస్ డాబా చెప్పారు. ఇప్పుడు యాక్టివ్ కేసులు ఏమీ లేకపోయినా, ఈ వైరస్ మళ్లీ రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆఫ్రికా సీడీసీ నుంచి నిపుణుల బృందాలు ఇథియోపియాకు వచ్చి సహాయం చేస్తున్నాయి.
ఈ వైరస్ ఎందుకు ప్రమాదకరం?
మార్బర్గ్ వైరస్ చాలా ప్రమాదకరమైంది. ఈ వైరస్ పండ్ల గబ్బిలాల నుంచి మనుషులకు వస్తుంది. సోకిన మనుషుల రక్తం, లాలాజలం వంటి శరీర ద్రవాల ద్వారా లేదా వస్తువులను తాకడం ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి త్వరగా అంటుకుంటుంది. తీవ్రమైన జ్వరం, కండరాల నొప్పులు, వాంతులు, విరేచనాలు ఉంటాయి. కొన్నిసార్లు శరీరంలోంచి రక్తం కూడా పోతుంది. దీనికి సరైన చికిత్స లేకపోతే ఈ జబ్బు వచ్చిన వారిలో 100 మందిలో 88 మంది వరకు చనిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ వ్యాధిని ఆపడానికి ప్రత్యేక టీకా లేదా మందు లేదు. కేవలం రోగికి సహాయపడే చికిత్స మాత్రమే అందిస్తారు.
పొరుగు దేశాల భయం
ఇథియోపియా సరిహద్దులో ఉన్న దక్షిణ సూడాన్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఎందుకంటే అక్కడి ఆరోగ్య వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది. అందుకే ప్రజలు తరచుగా చేతులు కడుక్కోవాలని, ఎవరి శరీర ద్రవాలను తాకకుండా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ వ్యాధి గతంలో కూడా ఆఫ్రికాలోని రువాండా, టాంజానియా, ఉగాండా వంటి చాలా దేశాలలో నమోదైంది. అందుకే ప్రపంచ ఆరోగ్య నిపుణులు ఈ కొత్త వ్యాప్తిపై దృష్టి పెట్టారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
