తిరుపతి-పీలేరు మధ్య భాకరాపేట ఘాట్ రోడ్డులో ఏడు ఏనుగుల గుంపు కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి అడవి నుంచి రోడ్డుపైకి వచ్చిన ఏనుగులను చూసి భయంతో ఓ యువకుడు బైక్ను వదిలి పారిపోయాడు. పరిస్థితి విషమించడంతో అటవీ శాఖ అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. చివరకు అటవీ సిబ్బంది కష్టపడి ఏనుగులను అడవిలోకి పంపారు.