AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఇది భారత్ శకం.. ప్రధాని మోదీ నిత్య విద్యార్థి.. ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ కీలక వ్యాఖ్యలు

అమెరికాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. రెండో రోజు పలు కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. న్యూయార్క్​లో 'మోదీ అండ్ యూఎస్‌ ప్రోగ్రెస్‌ టుగెదర్‌' కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. అంతేకాకుండా.. వ్యాపార, టెక్ దిగ్గజాలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు.

PM Modi: ఇది భారత్ శకం.. ప్రధాని మోదీ నిత్య విద్యార్థి.. ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ కీలక వ్యాఖ్యలు
PM Modi - Nvidia CEO Jensen Huang
Shaik Madar Saheb
|

Updated on: Sep 23, 2024 | 12:07 PM

Share

అమెరికాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. రెండో రోజు పలు కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. న్యూయార్క్​లో ‘మోదీ అండ్ యూఎస్‌ ప్రోగ్రెస్‌ టుగెదర్‌’ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. అంతేకాకుండా.. వ్యాపార, టెక్ దిగ్గజాలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రత్యేకంగా చర్చించారు. న్యూయార్క్‌లో జరిగిన రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్‌ లో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ కూడా పాల్గొన్నారు. రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన అనంతరం ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ అద్భుతమైన విద్యార్థి అంటూ ప్రశంసించారు..

ప్రధాని మోదీ నిత్య విద్యార్థి అని.. తాను అతనిని కలిసిన ప్రతిసారీ, అతను సాంకేతికత గురించి మరింత తెలుసుకోవాలనుకుంటారని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక కొత్త పరిశ్రమ అని.. తాను భారతదేశంతో లోతైన మార్గంలో భాగస్వామిగా ఉండటానికి ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. మేము భారతదేశంలోని అనేక కంపెనీలు, స్టార్టప్‌లు, IITలతో భాగస్వామ్యం కోసం ఎదురుస్తున్నామని తెలిపారు. AI నిజంగా కంప్యూటింగ్‌ను ప్రజాస్వామ్యం చేస్తుంది.. అవకాశాలను అందిస్తుంది.. ఇది భారతదేశ శకం.. అద్భుతమైన అవకాశాలను అందిస్తుందని తెలిపారు. అంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటూ ప్రపంచ టెక్ సంస్థలకు సూచించారు.

భారతదేశం మూడవ అతిపెద్ద స్టార్టప్ ఆర్థిక వ్యవస్థకు నిలయం.. కాబట్టి ఈ కొత్త తరం స్టార్టప్‌లు అన్నీ AIపై ఆధారపడి ఉంటాయి.. అలా చేయడానికి.. AI మౌలిక సదుపాయాలను కలిగి ఉండాలి.. భారత్ లో ఇవన్నీ ఉన్నాయి.. అంటూ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ పేర్కొన్నారు.

‘‘ప్రధానితో చాలా సమావేశాలను ఆస్వాదించాను. అతను ఒక అద్భుతమైన విద్యార్థి.. నేను అతనిని చూసిన ప్రతిసారీ.. అతను టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అవకాశాలు, భారతీయ సమాజం – పరిశ్రమపై ప్రభావం గురించి తెలుసుకోవాలనుకుంటారు.’’ – ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్

వీడియో చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్