బలూచిస్తాన్‌లో దారుణ ఘటన.. ఐడీ అడిగిమరీ కాల్చి చంపిన ఉగ్రవాదులు, 23 మంది మృతి

ముసాఖేల్ జిల్లాలోని రారాషిమ్ ప్రాంతంలో నిషేధిత గ్రూపుకు చెందిన ఉగ్రవాదులు హైవేను అడ్డుకుని 23 మంది ప్రయాణికులను బస్సులో నుంచి దించారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయూబ్ ఖోసో తెలిపారు. అయితే ఆ సంస్థ పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు. సాయుధులు బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తులపై కాల్పులు జరపడమే కాకుండా 10 వాహనాలకు నిప్పుపెట్టారని ముసాఖేల్ అసిస్టెంట్ కమిషనర్ నజీబ్ కాకర్ తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలిస్తున్నారని తెలిపారు

బలూచిస్తాన్‌లో దారుణ ఘటన.. ఐడీ అడిగిమరీ కాల్చి చంపిన ఉగ్రవాదులు, 23 మంది మృతి
Balochistan
Follow us

|

Updated on: Aug 26, 2024 | 3:33 PM

పాకిస్థాన్‌ బలూచిస్థాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముసాఖెల్ జిల్లాలో బహిరంగంగానే కొంత మంది సాయుధులు మృత్యువుతో ఆట ఆడారు. ఇక్కడ కొంతమంది సాయుధ వ్యక్తులు రోడ్డుమీద వెళ్తోన్న ట్రక్కులు, బస్సుల నుండి ప్రయాణికులను దింపారు. తర్వాత వారిని ఒకొక్కరిని పరిశీలించి ఆపై కొంత మంది మీద కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో కనీసం 23 మంది మరణించారని తెలుస్తోంది. పంజాబ్ ప్రజలను లక్ష్యంగా చేసుకుని ముసాఖేల్ సాయుధులు దాడి చేశారని పాకిస్థాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి అజ్మా బుఖారీ తెలిపారు.

ముసాఖేల్ జిల్లాలోని రారాషిమ్ ప్రాంతంలో నిషేధిత గ్రూపుకు చెందిన ఉగ్రవాదులు హైవేను అడ్డుకుని 23 మంది ప్రయాణికులను బస్సులో నుంచి దించారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయూబ్ ఖోసో తెలిపారు. అయితే ఆ సంస్థ పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు.

ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు

ఇవి కూడా చదవండి

సాయుధులు బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తులపై కాల్పులు జరపడమే కాకుండా 10 వాహనాలకు నిప్పుపెట్టారని ముసాఖేల్ అసిస్టెంట్ కమిషనర్ నజీబ్ కాకర్ తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించే పనిలో పడ్డారని తెలిపారు. బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు.

గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయి

దాదాపు నాలుగు నెలల క్రితం కూడా ఇలాంటి దాడి జరిగింది. అంతకుముందు ఏప్రిల్‌లో నోష్కీ సమీపంలో తొమ్మిది మంది ప్రయాణికులను బస్సులో నుండి దింపి, వారి ఐడి కార్డులను తనిఖీ చేసిన తర్వాత కాల్చి చంపారు. ఏప్రిల్‌కు ముందు, గతేడాది అక్టోబర్‌లో బలూచిస్థాన్‌లోని కెచ్ జిల్లాలో పంజాబ్‌కు చెందిన ఆరుగురు కూలీలు హత్యకు గురయ్యారు. ఈ హత్యలన్నీ పంజాబ్‌ ప్రాంత వాసులే లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరణించిన వారందరూ పంజాబ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. ఈ దాడులు హత్యలు వారి జాతి నేపథ్యం కారణంగా జరుగుతున్నట్లు తెలుస్తోందని అంటున్నారు. ఇది కాకుండా 2015 సంవత్సరంలో సాయుధ వ్యక్తులు 20 మంది కార్మికులను హత్య చేశారు. అప్పుడు కూడా ఈ వ్యక్తులు కూడా పంజాబ్ వాసులే.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బలూచిస్తాన్‌లో దారుణ ఘటన.. 23 మందిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
బలూచిస్తాన్‌లో దారుణ ఘటన.. 23 మందిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు.. ఆ తర్వాత జరిగిందిదే.. వీడియో
పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు.. ఆ తర్వాత జరిగిందిదే.. వీడియో
శంకర్‌ను ఇన్‌స్పిరేషన్‌గా వెట్రి.. టెన్షన్‎లో మక్కల్‌ ఫ్యాన్స్‌..
శంకర్‌ను ఇన్‌స్పిరేషన్‌గా వెట్రి.. టెన్షన్‎లో మక్కల్‌ ఫ్యాన్స్‌..
పుష్పనే మంచి పోయారు.. పైకి చూస్తే ఖాళీ లారీనే.. చెక్ చేస్తే..
పుష్పనే మంచి పోయారు.. పైకి చూస్తే ఖాళీ లారీనే.. చెక్ చేస్తే..
ఓటీటీలోకి రవితేజ మిస్టర్ బచ్చన్..
ఓటీటీలోకి రవితేజ మిస్టర్ బచ్చన్..
ఈ ఏడాది జన్మాష్టమి రోజున అరుదైన 3 యోగాలు.. ఎవరికి ప్రయోజనం అంటే
ఈ ఏడాది జన్మాష్టమి రోజున అరుదైన 3 యోగాలు.. ఎవరికి ప్రయోజనం అంటే
వైద్యురాలి హత్యాచార ఘటన..పాలీగ్రాఫ్‌ టెస్టులో సంజయ్ ఏంచెప్పాడంటే
వైద్యురాలి హత్యాచార ఘటన..పాలీగ్రాఫ్‌ టెస్టులో సంజయ్ ఏంచెప్పాడంటే
తెలిసి తెలియక ఈ తప్పులు ఈ తప్పులతో కన్నయ్యకు కోపం వస్తుంది
తెలిసి తెలియక ఈ తప్పులు ఈ తప్పులతో కన్నయ్యకు కోపం వస్తుంది
జైలులో హీరో దర్శన్‌కు రాచ మర్యాదలు.. సీఎం సీరియస్..కీలక ఆదేశాలు
జైలులో హీరో దర్శన్‌కు రాచ మర్యాదలు.. సీఎం సీరియస్..కీలక ఆదేశాలు
అప్పుడు ఫ్యాన్స్ గుడికట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.
అప్పుడు ఫ్యాన్స్ గుడికట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!