AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచానికి మరో విపత్తు..! మూడు రెట్లు వేగంగా కరుగుతున్న హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక

ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదల, పెరుగుతున్న కాలుష్యం భూమిపై మానవ జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి. దీనితో పాటు కర్బన ఉద్గారాలు, గ్లోబల్ వార్మింగ్ కారణంగా ధ్రువ ప్రాంతాల్లో హిమానీనదాల మంచు కరిగిపోతోంది. గ్రీన్‌ల్యాండ్‌లోని హిమానీనదాలు ఇప్పుడు 20వ శతాబ్దంలో కంటే 3 రెట్లు వేగంగా కరుగుతున్నాయని శాస్త్రవేత్తలు నివేదించారు.

ప్రపంచానికి మరో విపత్తు..!  మూడు రెట్లు వేగంగా కరుగుతున్న హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
Greenland Ice Melting
Jyothi Gadda
|

Updated on: Jun 07, 2023 | 9:48 AM

Share

గ్లోబల్ వార్మింగ్ సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రస్తుత ప్రపంచ వ్యాప్త ఆందోళన. మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న పట్టణీకరణ దశాబ్దాలుగా పర్యావరణ క్షీణతకు కారణమవుతున్నాయి. కానీ, మానవులు దీనిని విస్మరిస్తున్నారు. భూగోళంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మంచుగడ్డలు వేగంగా కరిగిపోతూ మానవాళికి ప్రమాదకరంగా మారుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతను సకాలంలో పరిష్కరించకపోతే, మునిగిపోయే అవకాశం ఉంది. మంచు కరగడంతో భూమి మొత్తం ముంపునకు గురవుతుందని, మానవ జీవితం ప్రమాదంలో పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. వాతావరణ మార్పుల కారణంగా భూమిపై మంచు వేగంగా కరుగుతోంది. యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్‌మౌత్‌లోని స్కూల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్, జియోగ్రఫీ అండ్ జియాలజీ నుండి డా. క్లైర్ బోస్టన్ ప్రకారం, హిమానీనదాలు ఊహించిన దాని కంటే వేగంగా కరిగిపోతున్నాయి. హిమానీనదాలు, మంచు కరిగిపోయే మొత్తం అంచనా కంటే ఎక్కువగా ఉన్నట్లు వారి పరిశోధనలో తేలింది.

గ్రీన్‌ల్యాండ్‌లోని హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. 20వ శతాబ్దంతో పోలిస్తే ప్రస్తుతం మంచు కరుగుతున్న రేటు మూడు రెట్లు పెరిగింది. ఇది ఇలాగే కొనసాగితే లోతట్టు ప్రాంతాలలో మానవ ఆవాసాల ఉనికికే ముప్పు ఏర్పడుతుంది. ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదల, పెరుగుతున్న కాలుష్యం భూమిపై మానవ జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి. దీనితో పాటు కర్బన ఉద్గారాలు, గ్లోబల్ వార్మింగ్ కారణంగా ధ్రువ ప్రాంతాల్లో హిమానీనదాల మంచు కరిగిపోతోంది. గ్రీన్‌ల్యాండ్‌లోని హిమానీనదాలు ఇప్పుడు 20వ శతాబ్దంలో కంటే 3 రెట్లు వేగంగా కరుగుతున్నాయని శాస్త్రవేత్తలు నివేదించారు.

గ్రీన్లాండ్ భూమి ఉత్తర ధ్రువంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. గ్రీన్‌ల్యాండ్ వైశాల్యం 2,166,086 చ.కి.మీ. ద్వీపంలో ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఉంది. కానీ, ఇటీవలి సంవత్సరాలలో, గ్రీన్లాండ్‌లో మంచు వేగంగా కరుగుతోంది. గ్రీన్‌ల్యాండ్‌లో మంచు తోట తగ్గిందని శాస్త్రవేత్తలు గమనించి ఆందోళన వ్యక్తం చేశారు. గ్రీన్‌ల్యాండ్‌లో అనేక పెద్ద మంచు పర్వతాలు, హిమానీనదాలు ఉన్నాయి. ఈ వేగవంతమైన ద్రవీభవన ప్రపంచానికి డేంజర్‌ బెల్స్‌గా మారుతున్నాయి.

ఇవి కూడా చదవండి

భూమిపై మంచు కరిగితే నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది. మునిగిపోవడం అంటే భూమి మొత్తం మునిగిపోతుంది. జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్‌లోని ఒక నివేదిక ప్రకారం, గ్రీన్‌ల్యాండ్‌లోని హిమానీనదాలు వేగంగా కరిగిపోవడం వల్ల సముద్ర మట్టాలు పెరుగుతాయి. ధ్రువ ప్రాంతాల్లో హిమానీనదాలు కరగడం కొనసాగితే, అనేక తీర దేశాలు మునిగిపోవడం ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు, ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో పెరుగుతున్న నీటి మట్టాలు తీరప్రాంత మానవ నివాసాలను ముంచెత్తాయి. ప్రజలు నిరాశ్రయులుగా మారారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us