AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Terrorist Sajid: ఉగ్రవాదులకు అండగా మళ్ళీ చైనా.. మోస్ట్ వాంటెడ్ మిలిటెండ్ ను ‘బ్లాక్‌లిస్ట్’లో పెట్టడాన్ని అడ్డుకున్న డ్రాగన్ కంట్రీ

సాజిద్ మీర్‌ భారతదేశానికి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. 26/11 ముంబై దాడులలో ప్రధానపాత్రధారుడు. దీంతో అతడిని పట్టించిన వారికి US $ 5 మిలియన్ల బహుమతిని ప్రకటించింది.

Terrorist Sajid: ఉగ్రవాదులకు అండగా మళ్ళీ చైనా.. మోస్ట్ వాంటెడ్ మిలిటెండ్ ను 'బ్లాక్‌లిస్ట్'లో పెట్టడాన్ని అడ్డుకున్న డ్రాగన్ కంట్రీ
Terrorist Sajid Mir
Surya Kala
|

Updated on: Sep 18, 2022 | 4:27 PM

Share

Terrorist Sajid: ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్‌ను ‘బ్లాక్‌లిస్ట్’లో పెట్టాలన్న అమెరికా, భారత్‌ల ప్రతిపాదనను మళ్ళీ చైనా అడ్డుకుంది. నాలుగు నెలల్లో చైనా ఇలా చేయడం మూడోసారి. 2008 ముంబై ఉగ్రవాద దాడులకు సంబంధించిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్.  మీర్ భారతదేశానికి వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకడు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని 1267 అల్ ఖైదా ఆంక్షల కమిటీ కింద మీర్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించి బ్లాక్‌లిస్ట్ లో పెట్టాలన్న అమెరికా ప్రతిపాదనను డ్రాగన్ కంట్రీ గురువారం అడ్డుకున్న సంగతి తెలిసిందే. అమెరికా మీర్ పై పెట్టిన  ప్రతిపాదనకు భారత్‌ మద్దతు తెలిపింది. దీని ప్రకారం..  మీర్ ఆస్తులను అటాచ్ చేయాలని, అతను చేసే ప్రయాణాలు, ఆయుధాలపై ఆంక్షలు విధించాలని ప్రతిపాదించింది.

సాజిద్ మీర్‌ భారతదేశానికి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. 26/11 ముంబై దాడులలో ప్రధానపాత్రధారుడు. దీంతో అతడిని పట్టించిన వారికి US $ 5 మిలియన్ల బహుమతిని ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌లో ఉగ్రవాదానికి ఫైనాన్సింగ్ కేసులో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు అతనికి 15 ఏళ్లకు పైగా జైలు శిక్ష విధించింది. అయితే మీర్ చనిపోయాడని పాక్ అధికారులు అంతకుముందు వాదించారు. పాక్ చెప్పిన మాటలను పాశ్చాత్య దేశాలు నమ్మలేదు. అంతేకాదు అతని మరణానికి సంబంధించిన రుజువును అడిగారు. గత ఏడాది పారిస్‌కు చెందిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఎటిఎఫ్) ఉగ్రవాదులపై అణిచివేతపై పాకిస్తాన్ లో పురోగతి సాధించడానికి ప్రధాన సమస్యగా మారింది.

అజహర్‌కు వ్యతిరేకంగా ప్రతిపాదన కూడా నిషేధించబడింది ఈ దాడులకు లష్కరే తోయిబా కార్యకలాపాలకు మీర్ ఆపరేటర్ అని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. అతను కుట్ర, తయారీ, దాడి చేయడంలో  ముఖ్యమైన పాత్ర పోషించాడు. గత నెలలో, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు, పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ సభ్యుడు అబ్దుల్ రౌఫ్ అజార్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలని అమెరికా, భారతదేశం చేసిన ప్రతిపాదనను కూడా చైనా ఐక్యరాజ్యసమితిలో అడ్డుకుంది. అబ్దుల్ రౌఫ్ అజార్ 1974లో పాకిస్థాన్‌లో జన్మించాడు. డిసెంబర్ 2010లో అతనిపై అమెరికా నిషేధం విధించింది.

ఇవి కూడా చదవండి

మళ్లీ మళ్లీ అడ్డంకులు సృష్టిస్తోన్న చైనా ఐక్యరాజ్యసమితి ఆంక్షల కమిటీ కింద పాక్ ఉగ్రవాదులను బ్లాక్ లిస్టులో పెట్టకుండా పాకిస్థాన్ మిత్రదేశమైన చైనా పదే పదే అడ్డంకులు సృష్టిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో పాకిస్థాన్ ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని బ్లాక్ లిస్టులో పెట్టాలన్న భారత్, అమెరికా సంయుక్త ప్రతిపాదనను చైనా అడ్డుకుంది. మక్కీని అమెరికా ఉగ్రవాద జాబితాలో చేర్చింది. మక్కీ హఫీజ్ సయీద్ బంధువు.

FBI వాంటెడ్ టెర్రరిస్ట్ లిస్ట్‌లో చేర్చబడింది మిర్ 2001 నుండి సీనియర్ LeT సభ్యుడిగా ఉన్నాడని US స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. అతను 2006 నుండి 2011 వరకు LeT విదేశీ కార్యకలాపాలకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నాడు. అతని బృందం ఆదేశానుసారం అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడ్డాడు. అంతేకాదు అతను 2008 – 2009 మధ్య డెన్మార్క్‌లో ఒక వార్తాపత్రిక, అందులో పనిచేసే ఉద్యోగులపై తీవ్రవాద దాడులకు ప్లాన్ చేసాడు. ముంబై దాడుల్లో మీర్ పాత్రపై ఏప్రిల్ 2011లో మీర్‌పై అమెరికాలో విచారణ జరిగింది. ఆగస్టు 2012లో, US ట్రెజరీ డిపార్ట్‌మెంట్ మీర్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్‌గా పేర్కొంది. స్టేట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. మీర్ ఎఫ్‌బిఐ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చబడ్డాడు. సాజిద్ మీర్‌ పాకిస్థాన్‌లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..