AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Child Sacrifice Victim: ఇక్కడ 76 మంది పిల్లల ఆస్తిపంజరాలు లభ్యం.. పురావస్తు శాస్త్రవేత్తలకు భయానక అనుభవం

ఇక్కడ పిల్లల ఆస్తిపంజరాలు లభ్యం కావడం పురావస్తుల శాస్త్రవేత్తలకు ఆందోళన కలిగిస్తోంది. ఇంత మంది పిల్లల ఆస్తిపంజరాలు ఎక్కడివి అనేదానిపై విచారణ జరుపుతున్నారు..

Child Sacrifice Victim: ఇక్కడ 76 మంది పిల్లల ఆస్తిపంజరాలు లభ్యం.. పురావస్తు శాస్త్రవేత్తలకు భయానక అనుభవం
Child Sacrifice Victim
Subhash Goud
|

Updated on: Oct 09, 2022 | 8:25 AM

Share

తవ్వకాల్లో పురావస్తు శాస్త్రవేత్తలు ఒక భయానక అనుభవాన్ని చూశారు. దక్షిణ అమెరికాలోని పెరూలో డజన్ల కొద్దీ పిల్లల అస్థిపంజరాలను గుర్తించారు. వీటిని బలి ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ ప్రదేశంలో మరిన్ని అస్థిపంజరాలు దొరికే అవకాశం ఉందని పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు. ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో ఆంత్రోపాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గాబ్రియేల్ ప్రిటో, పెరూలోని జో హువాంచకో సమీపంలోని పంపా లా క్రజ్ వద్ద తవ్వకానికి సారధ్యం వహిస్తున్నారు. అస్థిపంజరాలను చూస్తుంటే పిల్లల గుండెలు బయటకి తీసినట్లు అర్థమవుతోందన్నారు. ఇక్కడి నుంచి ఇప్పటి వరకు మొత్తం 76 అస్థిపంజరాలను వెలికి తీశారు. మొత్తం 76 అస్థిపంజరాలను చాలా చక్కగా కత్తిరించారని ఆయన తెలిపారు.

పిల్లల హృదయాలను వారి గుండెల దగ్గర ఎముకలను కత్తిరించడం లాంటివి కనిపించాయని, ఈ శిశువులను తూర్పు ముఖంగా ఖననం చేశారని ప్రొఫెసర్ ప్రిటో సైన్స్ మీడియా లైవ్ సైన్స్‌తో చెప్పారు. కృత్రిమ మట్టిదిబ్బ పైన పాతిపెట్టారు. అయితే అలాంటి చోట ఎందుకు పాతిపెట్టారో తెలియలేదు. పంపా లా క్రూజ్‌లో చాలా ఏళ్లుగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఇక్కడ 323 మంది చిన్నారుల అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. 3 పెద్దలు సహా 137 మంది బలిదానాల అస్థిపంజరాలు కనుగొనబడ్డాయి. ఈ అస్థిపంజరాలు లాస్ లామాస్ అనే సైట్ నుండి తిరిగి పొందబడ్డాయి. ఈ అవశేషాల నుండి పిల్లల హృదయాలు బయటకు తీయబడినట్లు కూడా కనిపించింది.

ప్రిటో ప్రకారం.. పురావస్తు పరిశోధనలు హువాంచసా సమీపంలో ఇంకా చాలా పిల్లల అస్థిపంజరాలు కనిపించే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. ఈ బాధితుల సంఖ్య 1000కు పైగా ఉండే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

76 కొత్త అస్థిపంజరాలకు రేడియోకార్బన్ డేటింగ్ అవసరమని ప్రొఫెసర్ తెలిపారు. క్రీ.శ. 1100, 1200 మధ్యకాలంలో మొదటి బలి బాధితులు ఈ ప్రదేశంలో కనుగొనబడ్డారు. ఈ కాలంలో చిము ప్రజలు పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి చెందారు. వీరు ప్రధానంగా లోహపు పనికి ప్రసిద్ధి చెందారు. ఇక్కడ ఇంత మందిని ఎందుకు పాతిపెట్టారనే విషయం ఇంకా స్పష్టత లేదన్నారు. చిము ప్రజలు చుట్టుపక్కల ప్రాంతంలో, సమీపంలోని కొత్త వ్యవసాయ క్షేత్రాలలో కృత్రిమ నీటిపారుదల వ్యవస్థను నిర్మించారు. వారిలో కొందరు వ్యవసాయ వ్యవస్థ పవిత్రత కోసం కూడా తమ ప్రాణాలను త్యాగం చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. దీనిపై మరింత విచారణ జరుపుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి