75 మంది యాత్రికులతో వెళ్తున్న బస్సుకు ప్రమాదం..100 మీటర్ల లోయలో పడి పలువురు మృతి..
ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. కోట్మలే మధ్య కొండ ప్రాంతం గుండా బస్సు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే బస్సు లోయలో పడినట్లుగా తెలిసింది. బౌద్ధ యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సులో 75 మంది వరకు ఉన్నట్లు సమాచారం.

శ్రీలంకలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. శ్రీలంకలో ఆదివారం ప్రయాణికుల బస్సు కొండపై నుంచి జారిపడి దాదాపు 21 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. కోట్మలే మధ్య కొండ ప్రాంతం గుండా బస్సు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే బస్సు లోయలో పడినట్లుగా తెలిసింది. బౌద్ధ యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సులో 75 మంది వరకు ఉన్నట్లు సమాచారం. దక్షిణ యాత్రా స్థలం కటరగమ నుండి వాయువ్య పట్టణం కురునెగలకు తీసుకెళ్తుండగా కొండ చరియ నుండి 100 మీటర్ల లోతున పడిపోయిందని పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంలో 21 మంది మరణించారని రవాణా, రహదారుల ఉప మంత్రి ప్రసన్న గుణసేన తెలిపారు. ఈ విషాదంలో 30 మందికి పైగా ప్రయాణికులు కూడా గాయపడ్డారు. శ్రీలంకలో ఘోరమైన బస్సు ప్రమాదాలు సర్వసాధారణం. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం,యు రోడ్లు సరిగా నిర్వహించకపోవడం వల్ల తరచుగా ప్రమాదాలు సంభవిస్తాయని ప్రజలు వాపోతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..