Sonu Sood: చంద్రబాబు 100 రోజులపై స్పందించిన సోనూసూద్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు

తాజాగా ప్రముఖ నటుడు, మానవతావాది సోనూసూద్ సైతం చంద్రబాబు 100 రోజుల పాలనపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన విశిష్ట పాలనతో తొలి వంద రోజుల్లోనే ఏపీ ప్రజలు సుఖసంతోషాలతో, సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారని అన్నారు...

Follow us

|

Updated on: Sep 24, 2024 | 1:40 PM

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తయ్యింది. ఈ ‘ఇది మంచి ప్రభుత్వం’ అనే నినాదంతో ప్రచార కార్యక్రమం చేపడుతోంది. 100 రోజుల్లో తమ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందన్న వివరాలను తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు 100 రోజుల పాలనపై వారి పార్టీ నాయకులే కాకుండా పలువురు సెలబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు.

తాజాగా ప్రముఖ నటుడు, మానవతావాది సోనూసూద్ సైతం చంద్రబాబు 100 రోజుల పాలనపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన విశిష్ట పాలనతో తొలి వంద రోజుల్లోనే ఏపీ ప్రజలు సుఖసంతోషాలతో, సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారని అన్నారు. ఈ విషయమై ఆయన ఒక వీడియో విడుదల చేశారు.

ఇందులో సోసూద్‌ మాట్లాడుతూ.. ‘సుదీర్ఘ పాలనానుభవం ఉన్న సీబీఎన్‌ సార్‌ తన విజన్‌తో రాష్ట్ర భవిష్యత్తు కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఆయన విధానాలను ప్రజలు విశ్వసిస్తున్నారు. చంద్రబాబును చూసి గర్వపడుతున్నాను. త్వరలోనే ఆయన్ను కలవాలని కోరుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు. ఇక ఏపీని మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు తన వంతు సాయం అందిస్తానని ఈ సందర్భంగా సోనూసూద్ మాటిచ్చారు. ఇక పాలనలో సుదీర్ఘమై అనుభవం ఉన్న చంద్రబాబు.. తన విజన్‌తో రాష్ట్ర భవిష్యత్తు కోసం చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన విధానాలను విశ్వసిస్తున్నారని.. చంద్రబాబును చూసి గర్వపడుతున్నానని చెప్పుకొచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..