Viral News: రూ.2 లక్షల టిప్ ఇచ్చిన కస్టమర్.. తర్వాత వెయిటర్‌కు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చాడు..

అయితే మామూలుగా ఎవరైనా సరే వందల్లో, వేలల్లో టిప్పు ఇస్తారు. కానీ ఓ వ్యక్తి తనకు ఆహారం వడ్డించిన ఒక వెయిటర్ కి ఏకంగా రూ.2.4లకల టిప్పు ఇచ్చి షాక్ అయ్యేలా చేశాడు.. ఆ తర్వాత..

Viral News: రూ.2 లక్షల టిప్ ఇచ్చిన కస్టమర్.. తర్వాత వెయిటర్‌కు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చాడు..
Waitress
Follow us

|

Updated on: Sep 20, 2022 | 8:10 PM

Viral News: సాధారణంగా హోటల్ లేదా రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు వెయిటర్లకు టిప్పు ఇవ్వటం మామూలే. అయితే, ఈ టిప్పు డబ్బులు… బిల్లు ఎంత అయిందో అందుకు తగ్గట్లుగా టిప్పు ఇచ్చి సర్వ్ చేసిన వారిని మెచ్చుకుంటారు. అయితే మామూలుగా ఎవరైనా సరే వందల్లో, వేలల్లో టిప్పు ఇస్తారు. కానీ ఓ వ్యక్తి తనకు ఆహారం వడ్డించిన ఒక వెయిటర్ కి ఏకంగా ఏకంగా 3 వేల డాలర్లు అంటే మన కరెన్సీ ప్రకారం రూ.2.40 లక్షలు ఆమెకు టిప్ ఇచ్చాడు. దీంతో ఆమె ఆశ్చర్యపోయింది. ఇది నిజమేనా? అని ప్రశ్నిస్తే.. ‘టిప్స్ ఫర్ జీసస్’ అనే క్యాంపెయిన్ చూసి తను స్ఫూర్తిపొందానని, అందుకే ఇలా టిప్స్ ఇస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత ఆ యువతికి దిమ్మతిరిగి పోయే షాక్‌ ఇచ్చాడు సదరు వ్యక్తి. ఇంతకు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం…

పెన్సిల్వేనియా ఆల్‌ఫ్రెడోస్ పిజ్జా కేఫ్‌లో మరియానా లాంబర్ట్ అనే యువతి వెయిట్రెస్‌గా పనిచేస్తోంది. జూన్ నెలలో ఈ రెస్టారెంటుకు వచ్చిన ఎరిక్ స్మిత్ అనే కస్టమర్ ఏకంగా 3 వేల డాలర్లు ఆమెకు టిప్ ఇచ్చాడు. కానీ, ఆ తర్వాత ఇంటికెళ్లాక తన డబ్బు పోయినట్లు కంప్లయింట్ చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ చార్జిపై తన క్రెడిట్ కార్డు కంపెనీకి రిపోర్టు చేశాడు స్మిత్. క్రెడిట్ కార్డు కంపెనీకి స్మిత్‌కు మధ్య కోర్టు వివాదం జరుగుతోందని తెలిసిన రెస్టారెంట్ యజమాని.. ఫేస్‌బుక్ ద్వారా స్మిత్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించాడు. కానీ అతన్నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో ఆల్‌ఫ్రెడ్స్ పిజ్జా కేఫ్ మేనేజర్ జాచరీ జాకబ్‌సన్.. తను కూడా కోర్టుకెళ్లాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి