Viral Video: అరె పిచ్చోడా.! కుక్క కోసం మరీ రూ. 50 కోట్లు ఏంటిరా.. ఈ డాగ్ స్పెషాలిటీ తెలిస్తే
అరె పిచ్చోడా.. మరి ఇలా ఉన్నావేంటిరా.. కుక్క కోసం ఏకంగా రూ. 50 కోట్లు ఖర్చు చేస్తావా.. ప్రపంచంలోనే అరుదైన కుక్క జాతి ఇది. దీన్ని బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.

ఎంతోమంది కుక్కలను పెంపుడు జంతువులుగా పెంచుకుంటుంటారు. సాధారణంగా మనం ఓ కుక్కపిల్లను ఇంటికి తీసుకురావాలంటే.. రూ. 1000 నుంచి రూ. 10 వేల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఇక్కడొక వ్యక్తి ఏకంగా రూ. 50 కోట్లు పెట్టి కుక్కను కొనుగోలు చేశాడు. అదేంటి మావ.. ఏకంగా కుక్క కోసం రూ. 50 కోట్లా అని అనుకుంటున్నారా.? అయితే ఈ స్టోరీ చదివేయండి మరి..
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన సతీష్ అనే వ్యక్తి ‘కాడాబాంబ్ ఒకామి’ అనే అరుదైన జాతికి చెందిన ‘వోల్ఫ్ డాగ్’ను 5.7 మిలియన్ డాలర్లు(సుమారు రూ.50 కోట్లు)కు కొనుగోలు చేశాడు. దాని వయసు 8 నెలలు అని.. రోజుకు 3 కేజీల పచ్చి మాంసం తింటుందన్నాడు సతీష్. ఎందుకని ఇంత ఖర్చు చేసి ఈ కుక్కను కొనుగోలు చేశారని అడిగితే.. ‘నాకు కుక్కలంటే చాలా ఇష్టం. అందుకే దీనిని కొనుగోలు చేసేందుకు అంత ఖర్చు చేశా. అరుదైన, ప్రత్యేకమైన కుక్కలను ఇండియాకు పరిచయం చేయడం నాకిష్టం’ అని అతడు తెలిపాడు. ఈ డాగ్ అమెరికాలో జన్మించింది. సుమారు 75 కిలోల బరువు ఉంటుంది.
కండలు తిరిగిన శరీర నిర్మాణం, కాపలా స్వభావంతో ప్రసిద్ధి చెందిన కాకేసియన్ షెపర్డ్ ఇప్పటికే అరుదైన జాతిగా పేరుగాంచింది. అయితే ‘కాడాబాంబ్ ఒకామి’ తోడేలు లాంటి లక్షణాలు కలిగి ఉండటంతో.. భారతదేశపు అన్యదేశ పెంపుడు జంతువులలో ఒకదానిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. గత దశాబ్దం నాటి నుంచి సతీష్ కుక్కలా పెంపకాన్ని వదిలేశాడు. అయితే అరుదైన జాతుల పట్ల తనకున్న ప్రేమను కొనసాగిస్తూ.. డబ్బులు సంపాదించేందుకు ఓ లాభదాయకమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఒకామి, ఇతర జాతులకు చెందిన అరుదైన కుక్కలను 30 నిమిషాల పాటు ప్రదర్శనకు పెట్టి.. రూ. 25 వేలు సంపాదిస్తున్నాడు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి