AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉల్లి వెల్లుల్లి పెట్టిన పంచాయితీ.. …23 ఏళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై..

ఇటీవలి కాలంలో విడాకులు కేసులు ఎక్కువగా వింటున్నాం.. చిన్న చిన్న విషయాలకే భార్య భర్తలు విడిపోతున్నారు. ఇక్కడ కూడా అలాంటిదే చిన్న విషయానికి 23ఏళ్లు కలిసి కాపురం చేసిన దంపతులు విడిపోయారు. ఈ జంట విడిపోవడానికి గల కారణం తెలిస్తే మీరు షాక్‌ తింటారు. అదేంటంటే.. భార్య ఉల్లిపాయలు, వెల్లుల్లి తినడానికి నిరాకరించడం. భర్త, అతని కుటుంబం ఉల్లిపాయలు, వెల్లుల్లిని తింటారని. ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూర్తి డిటెల్స్‌లోకి వెళితే...

ఉల్లి వెల్లుల్లి పెట్టిన పంచాయితీ.. ...23 ఏళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై..
Onion And Garlic
Jyothi Gadda
|

Updated on: Dec 13, 2025 | 2:10 PM

Share

ఒక గుజరాతీ జంట 23 ఏళ్ల వివాహం చివరకు విడాకులతో ముగిసింది. ఆ విచ్ఛిన్నం పెద్ద గొడవ కాదు.. సాధారణ వంటగది సమస్య. ఉల్లిపాయలు, వెల్లుల్లి వాడకం. మతపరమైన కారణాల వల్ల భార్య ఉల్లిపాయలు, వెల్లుల్లి తినలేదు. భర్త, అతని కుటుంబం వాటిని తిన్నారు. ఈ సమస్య కాలక్రమేణా ఇరువురి మధ్య తీవ్ర సంఘర్షణకు మూలంగా మారింది. ఈ కేసు గుజరాత్ హైకోర్టుకు చేరింది. చివరకు అహ్మదాబాద్ ఫ్యామిలీ కోర్టు విడాకుల నిర్ణయాన్ని సమర్థించింది. భార్య అప్పీలును కోర్టు కొట్టివేసింది. ఈ జంటకు చాలా కాలంగా విభేదాలు ఉన్నాయని, వివాహం ఇకపై ఆచరణీయం కాదని కోర్టు పేర్కొంది.

ఈ కేసులో ఇల్లాలు ఉల్లిపాయ, వెల్లుల్లి వినియోగాన్ని నిషేధించే స్వామినారాయణ శాఖను తాను అనుసరిస్తున్నానని భార్య పేర్కొంది. వివాహం తర్వాత కొంతకాలం, తమ అత్తగారు ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా కోడలి కోసం విడిగా భోజనం వండేవారని, కానీ, ఇలా కొద్ది రోజులు మాత్రమే పాటించారని ఆరోపించింది. దీంతో ఇంట్లో ఉద్రిక్తతలు క్రమంగా పెరిగాయి. చివరకు వారి మధ్య సంబంధాలు క్షీణించాయి.

ఇక భర్త వివరణ ఏంటంటే.. తన భార్య తనను మానసికంగా హింసిస్తూ వస్తోందని భర్త ఆరోపించాడు. ఈ క్రమంలోనే 2007లో తన బిడ్డను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని చెప్పాు. తదనంతరం, 2013లో భర్త ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దాఖలు చేశాడు. మే 2024లో అహ్మదాబాద్ ఫ్యామిలీ కోర్టు వారి విడాకులను మంజూరు చేసింది. ఆ తర్వాత భార్య హైకోర్టులో అప్పీల్ చేసుకుంది. కానీ, విచారణ సమయంలో ఆమె విడాకులను సవాలు చేయలేదు. సకాలంలో తనకు జీవనభృతి చెల్లించాలనేది ఆమె ప్రాథమిక డిమాండ్.

ఇవి కూడా చదవండి

18 నెలలుగా తనకు ఎలాంటి భరణం అందలేదని భార్య కోర్టుకు తెలియజేసింది. కోర్టు రికార్డుల ప్రకారం, మొత్తం బకాయి మొత్తం సుమారు 1.3 మిలియన్ రూపాయలు. ఈ మొత్తంలో కొంత ఇప్పటికే చెల్లించబడింది. దర్యాప్తు తర్వాత మిగిలిన మొత్తాన్ని భార్యకు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ విధంగా, 23 ఏళ్ల వివాహం చివరకు చట్టబద్ధంగా రద్దు చేయబడింది. దంపతుల మధ్య చాలా కాలంగా ఉన్న వివాదానికి ముగింపు పలికింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..