AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: మహా కుంభమేళాలో టీ అమ్మిన వ్యక్తి.. ఇప్పుడు లక్షాధికారి..! ఒక్కరోజు సంపాదన తెలిస్తే..

మహా కుంభ మేళాకు సంబంధించి చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొన్ని వీడియోలు కొందరినీ స్టార్లను చేశాయి.. అది మోనాలిసా అయినా, ఐఐటీ బాబా అయినా. ఇప్పుడు మహా కుంభ్ నుండి వచ్చిన ఒక చాయ్‌వాలా కూడా సెన్సెషన్‌ అయ్యాడు. మహా కుంభ్‌ ప్రాంతంలో ఒకచిన్న చాయ్‌ బండితో అతను లక్షలు సంపాదించాడు. తన సక్సెస్‌ స్టోరీని వీడియో రికార్డ్‌ చేసి సోషల్ మీడియాలో షేర్‌ చేయడంతో అది కాస్త సంచలనం సృష్టించింది.

Watch: మహా కుంభమేళాలో టీ అమ్మిన వ్యక్తి.. ఇప్పుడు లక్షాధికారి..! ఒక్కరోజు సంపాదన తెలిస్తే..
Chaiwala
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 17, 2025 | 4:48 PM

144 సంవత్సరాల తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతోంది. కుంభమేళాకు దేశ, విదేశాల నుండి కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే మహా కుంభ మేళాకు సంబంధించి కొన్ని రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరికొన్ని వీడియోలు కొందరినీ స్టార్లను చేశాయి.. అది మోనాలిసా అయినా, ఐఐటీ బాబా అయినా. ఇప్పుడు మహా కుంభ్ నుండి వచ్చిన ఒక చాయ్‌వాలా కూడా సెన్సెషన్‌ అయ్యాడు. మహా కుంభ్‌ ప్రాంతంలో ఒకచిన్న చాయ్‌ బండితో అతను లక్షలు సంపాదించాడు. తన సక్సెస్‌ని అతడు వీడియో రికార్డ్‌ చేసి సోషల్ మీడియాలో షేర్‌ చేయడంతో అది కాస్త సంచలనం సృష్టించింది.

నాగ్‌పూర్‌కు చెందిన ఓ యువకుడు ప్రయాగ్‌ రాజ్‌లోని సంగం వద్ద భక్తులకు టీ అమ్మడం ప్రారంభించాడు. కేవలం 5రూపాయలకు కప్పు చాయ్‌ విక్రయిస్తూ అతడు రోజుకు రూ.5,000 ల కంటే ఎక్కువగానే సంపాదించాడు. అవును, ఈ యువకుడి పేరు శుభం. అతను మహాకుంభమేళాలో ఒక టీ స్టాల్ ఏర్పాటు చేసి దీని ద్వారా ఇప్పుడు లక్షలు సంపాదించాడు. టీ అమ్మడం ద్వారా రోజూ ఎంత సంపాదిస్తాడో స్వయంగా అతడే ఈ వీడియో ద్వారా నెటిజన్లకు వివరిస్తూ చెప్పాడు. ఇలా చాయ్‌ అమ్మకం ద్వారా అతడు ఇప్పటికీ లక్షన్నర రూపాయలు సంపాదిస్తున్నాడని తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

కుంభమేళాలో టీ అమ్ముతున్నట్లు చెబుతున్న శుభం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుంభమేళకు వచ్చిన ప్రజలు, ముఖ్యంగా చాయ్‌ ప్రియులు శుభం చాయ్‌ బండి వద్దకు వచ్చి కాసేపు కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. అతని వద్ద టీ, వాటర్ బాటిళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఇలా అతను ఒక్కో రోజు మొత్తం ఏడు వేల వరకు సంపాదిస్తున్నాడు. అందులో 5000 టీ అమ్మడం ద్వారానే సంపాదిస్తున్నట్టుగా వివరించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా ట్రెండ్‌ అవుతోంది.

ఇది కూడా చదవండి: బంగారం కొనాలనుకుంటున్నారా.. చిన్న దుకాణంలో మంచిదా.. పెద్ద షోరూమ్‌లో బెటరా..?

ఇది కూడా చదవండి: ఇంటర్నెట్ లేకపోయినా యూట్యూబ్ చూడొచ్చు..! ఇవిగో సూపర్ ట్రిక్స్.. ఎంజాయ్‌ చేసేయండిలా..

ఇది కూడా చదవండి: ఏసీ కొనాలని చూస్తున్నారా.. అదిరిపోయే ఆఫర్ భయ్యా..ఇక్కడ భారీ తగ్గింపు..!

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..