AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: 42గంటలు ప్రయాణించాల్సిన రైలు.. మూడేళ్లకు స్టేషన్‌ చేరింది.. కంటైనర్‌ తెరిచి చూడగా

ఈ రైలు గమ్యస్థానానికి చేరుకునేలోపే అదృశ్యమైంది. ఎటు వెళ్లిందో.. ఎక్కడ మిస్సింగ్ అయిందో తెలియదు. 42 గంటల్లో గమ్యస్థానానికి చేరాల్సిన రైలు.. రావడానికి మూడేళ్లు పట్టింది. ఇంతకీ అదేంటంటే..

Viral: 42గంటలు ప్రయాణించాల్సిన రైలు.. మూడేళ్లకు స్టేషన్‌ చేరింది.. కంటైనర్‌ తెరిచి చూడగా
Representative Image
Ravi Kiran
|

Updated on: Dec 09, 2024 | 1:39 PM

Share

సాధారణంగా ఓ రైలు పది లేదా పదిహేను నిమిషాలు ఆలస్యమవుతుంది. లేదా మరేదైనా కారణంగా ఒక రోజు ఆలస్యం కావచ్చు. కానీ ఇక్కడ 42 గంటల్లో చేరాల్సిన ఓ రైలు.. సరిగ్గా 3 సంవత్సరాలుకు చేరుకుంది. భారతీయ రైల్వే చరిత్రలో ఇది అత్యంత ఆలస్యమైన రైలుగా రికార్డు సృష్టించింది. 2014వ సంవత్సరం నవంబర్‌లో విశాఖపట్నం నుంచి బయల్దేరిన ఈ రైలు ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ స్టేషన్‌కి చేరుకోవడానికి మూడున్నరేళ్లు పట్టింది. 1,400 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయడానికి కేవలం 42 గంటల 13 నిమిషాల ప్రయాణం పడుతుంది. కానీ ఈ రైలు ఆలస్యానికి కారణం..

ఇది చదవండి: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. బాబోయ్.! ఏపీకి మళ్లీ వర్షాలే వర్షాలు.. వెదర్ రిపోర్ట్

రైలులో 14 లక్షల రూపాయల విలువైన 1,361 ఎరువుల ప్యాకెట్లు ఉన్నాయి. వీటిని వ్యాపారవేత్త రామచంద్ర గుప్తా డెలివరీ కోసం బుక్ చేసుకున్నారు. అయితే 2014 నవంబర్‌లో అనుకున్న విధంగా రైలు గమ్యస్థానానికి చేరుకోలేదు. దీంతో అనుమానమొచ్చి గుప్తా.. రైల్వే అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రైలు ఎక్కడుందా అనే జాడ కూడా ఎవ్వరికీ తెలియలేదు.

ఇలా ఇన్వెస్టిగేషన్ కొన్నేళ్లు సాగింది. అన్ని వైపుల నుంచి పోలీసులు దర్యాప్తు కూడా చేశారు. ఇన్ని జరిగిన తర్వాత సరిగ్గా మూడున్నరేళ్ల తర్వాత రైలు 2018 జూలైలో బస్తీ స్టేషన్‌కు చేరుకుంది. అప్పటికి ఎరువు పనికిరాకుండా పోయింది. విచారణ జరిగినప్పటికీ, రైలు ఎందుకు ఆలస్యమైంది, ఎలా అదృశ్యమైంది అనే దానిపై స్పష్టత లేదు. కాగా, ఈ సంఘటన భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత షాక్‌తో కూడుకున్నది. ఈ ఘటన రైల్వే వ్యవస్థలోని సవాళ్లను హైలైట్ చేసింది.

ఇది చదవండి: ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో ఏంటని చూడగా

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మిక్సీ బ్లేడ్ షార్ప్‌గా ఉండాలా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి
మిక్సీ బ్లేడ్ షార్ప్‌గా ఉండాలా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి
సాయంత్రం కాఫీ లేదా టీతో ఆస్వాదించే అద్భుతమైన చికెన్ సమోసా..
సాయంత్రం కాఫీ లేదా టీతో ఆస్వాదించే అద్భుతమైన చికెన్ సమోసా..
పేద, మధ్యతరగతి రోగులకు శుభవార్త.. సనత్‌నగర్‌ టిమ్స్‌లో ఓపీ షురూ..
పేద, మధ్యతరగతి రోగులకు శుభవార్త.. సనత్‌నగర్‌ టిమ్స్‌లో ఓపీ షురూ..
ప్రతి పాడి రైతు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి..
ప్రతి పాడి రైతు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి..
ఆరోగ్యంతో పాటు రుచిని ఇచ్చే సగ్గుబియ్యం ఇడ్లీ ఇలా ఈజీగా చేసేయండి
ఆరోగ్యంతో పాటు రుచిని ఇచ్చే సగ్గుబియ్యం ఇడ్లీ ఇలా ఈజీగా చేసేయండి
'జెట్లీ' హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదుగా.. ఫొటోస్ ఇదిగో
'జెట్లీ' హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదుగా.. ఫొటోస్ ఇదిగో
RBI షాకింగ్ నిర్ణయం.. బంగారం దాచుకున్న వారికి పండగేనా ??
RBI షాకింగ్ నిర్ణయం.. బంగారం దాచుకున్న వారికి పండగేనా ??
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!
కూలర్‌ను ఎలా శుభ్రం చేయాలో తెలియట్లేదా.. మీకోసమే ఈ సింపుల్ టిప్స
కూలర్‌ను ఎలా శుభ్రం చేయాలో తెలియట్లేదా.. మీకోసమే ఈ సింపుల్ టిప్స
భారత్‌లో ‘పెట్రోల్’ బావులేవి ??
భారత్‌లో ‘పెట్రోల్’ బావులేవి ??