AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పెళ్లికూతుర్ని వెతకమని మ్యాట్రిమోనీకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత సీన్ ఇది

పెళ్లి సంబంధం కుదర్చమని మ్యాట్రిమోనీ కంపెనీని ఆశ్రయించిన ఓ వ్యక్తి ఆ తర్వాత సదరు కంపెనీకి చుక్కలు చూపించాడు. పెళ్లికూతురిని వెతకడంలో విఫలమైన సదరు కంపెనీపై కేసు వేశాడు. దాంతో ఆ కంపెనీ అతనికి రూ.60 వేల రూపాయలు చెల్లించుకోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే..

Viral: పెళ్లికూతుర్ని వెతకమని మ్యాట్రిమోనీకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత సీన్ ఇది
Marriage
Ravi Kiran
|

Updated on: Nov 05, 2024 | 8:57 PM

Share

బెంగళూరుకు చెందిన కుమార్‌ అనే వ్యక్తి తన కుమారుడికి పెళ్లి సంబంధం కోసం ఓ మ్యాట్రిమోనీ కంపెనీకి వెళ్లాడు. అక్కడ తన కుమారుడి వివరాలన్నీ ఇచ్చి వధువును వెతికిపెట్టమని కోరాడు. అందుకు సంస్థ కుమార్‌నుంచి ఇనిషియల్ పేమెంట్‌గా రూ.30 వేల రూపాయలు వసూలు చేసి, నెల రోజుల్లో సంబంధం చూస్తామని చెప్పారు. నెల రోజులైనా మ్యాట్రిమోనీ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కంపెనీకి వెళ్లి వివరాలు అడిగాడు. వారు ఏప్రిల్‌ నెలాఖరువరకూ ఆగాలని గడువు కోరారు. ఏప్రిల్‌ కూడా అయిపోయింది. అయినా మ్యాట్రిమోనీ నుంచి ఎలాంటి స్పందన లేదు.

ఇది చదవండి: పత్తి చేనులో కలుపు తీస్తుండగా.. బాబోయ్.! కనిపించింది చూసి గుండె గుభేల్

దాంతో కుమార్‌ మే నెలలో సదరు మ్యాట్రిమోనీ కంపెనీకి లీగల్‌ నోటీసులు పంపించాడు. కోర్టు నోటీసులకు కూడా కంపెనీ స్పందించకపోవడంతో బెంగళూరులోని వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. అక్టోబరు 28న న్యాయస్థానం సదరు మ్యాట్రిమోనీ సంస్థపై చర్యలు చేపట్టింది. కుమార్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. తాను ముందుగా చెల్లించిన సొమ్ముపై 6 శాతం వడ్డీతోపాటు నష్ట పరిహారంగా రూ.20,000 చెల్లించాలని ఆదేశించింది. కస్టమర్‌కు మానసిక వేదన కలిగించినందుకు రూ.5000, లీగల్‌ ఖర్చులకు మరో రూ.5000 చెల్లించాలని కంపెనీని కోర్టు ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: పోలీసుల తనిఖీల్లో తేడాగా కనిపించిన యువకుడు.. బ్యాగ్ చెక్ చేయగా.. వామ్మో

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..