Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఆ గణేశుడికి అనంత్ రాధిక జోడి భారీ బహుమతి.. ఖరీదు ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

కొత్త జంట అనంత్ అంబానీ, రాధిక 20 కిలోల బంగారు కిరీటాన్ని లాల్ బగ్చా రాజాకు విరాళంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రత్యేక పూజల అనంతరం నిర్వాహకులు గణేశునికి బంగారు కిరీటాన్ని అలంకరించారు. అనంత్, రాధిక సమర్పించిన బంగారు కిరీటం ధర దాదాపు

Watch: ఆ గణేశుడికి అనంత్ రాధిక జోడి భారీ బహుమతి.. ఖరీదు ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
Anant Ambani gold crown
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 08, 2024 | 8:56 AM

దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు ప్రజలు. గణపతి నవరాత్రులు సందర్భంగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ముంబైలోని లాల్ బాగ్ ప్రాంతంలోని లార్డ్ గణపతి ‘లాల్‌బాగ్చా రాజా’ విగ్రహానికి బంగారు కిరీటాన్ని బహుమతిగా అందజేశారు. గణపతి బప్పా మోరియా హర్షధ్వానాలతో లాల్‌బాగ్‌చా రాజా విగ్రహావిష్కరణ అనంతరం భారీ కిరీటధారణ కార్యక్రమం జరిగింది. ఇది సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మిగిలిపోయింది. కిరీటం బరువు 20 కిలోలు. దీని ధర తెలిస్తే మీరు షాక్ అవుతారు.

ముంబైలోని లాల్ బాగ్చా రాజా గణేశ ఆలయానికి అంబానీ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. ప్రతీయేటా అంబానీ కుటుంబం ఇక్కడ ఉత్సవాల్లో పాల్గొంటారు. లాల్‌బాగ్చా మహారాజ్‌కు పూజించటం వీరికి ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే నూతన వధూవరులు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం తర్వాత మొదటిసారి వినాయక చతుర్థి వేడుకలను జరుపుకున్నారు. లాల్ బగ్చా రాజా ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గణేశుడికి 20 కిలోల బంగారంతో చేసిన కిరీటాన్ని నూతన దంపతులు సమర్పించారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

కొత్త జంట అనంత్ అంబానీ, రాధిక 20 కిలోల బంగారు కిరీటాన్ని లాల్ బగ్చా రాజాకు విరాళంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రత్యేక పూజల అనంతరం నిర్వాహకులు గణేశునికి బంగారు కిరీటాన్ని అలంకరించారు. అనంత్, రాధిక సమర్పించిన బంగారు కిరీటం ధర దాదాపు రూ.15 కోట్లు ఉంటుందని తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. వినాయక చతుర్థి సందర్భంగా అనంత్ అంబానీ అందించిన బంగారు కిరీటంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..