![పీవీ సింధు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/pv-sindhu.jpg)
పీవీ సింధు
పీవీ సింధు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో ఒకరిగా పేరుగాంచింది. అంతర్జాతీయ వేదికలపై ఎన్నో పతకాలు సాధించింది. అథ్లెట్ల నైపుణ్యం ఒలింపిక్ క్రీడలతోనే నిర్ణయిస్తుంటారు. పుషరెల వెంకట్ సింధు ఇప్పటి వరకు ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించింది. 2016 రియో ఒలింపిక్స్ రజత పతకం తన ఖాతాలో వేసుకోగా.. రియోలో ఆమె సాధించిన బంగారు పతకాల్లో ప్రపంచ నంబర్ వన్ కరోలినా మారిన్ ఓడించి సత్తా చాటింది. టోక్యో ఒలింపిక్స్లో సింధు కాంస్య పతకం సాధించింది. ఇది కాకుండా ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఒక స్వర్ణం, రెండు రజతం, ఒక కాంస్య పతకం ఉంది. కామన్వెల్త్ క్రీడల్లో రెండు స్వర్ణం, రజతం, ఓ కాంస్యం సాధించింది. ఆసియా స్థాయిలోనూ వివిధ పతకాలు తన ఖాతాలో వేసుకుంది. స్థిరమైన విజయం కారణంగా ఆమె బ్రాండ్ విలువ కూడా గొప్పగా ఉంది. సింధు 2013లో అర్జున, 2015లో పద్మశ్రీ, 2016లో ఖేల్రత్న, 2020లో పద్మభూషణ్ అందుకుంది. ఆమె కెరీర్లో ఒకే కోరిక మిగిలి ఉంది. అదే ఒలింపిక్ బంగారు పతకం. భారత బ్యాడ్మింటన్లో ఓ వెలుగు వెలిగిన పీవీ సింధుకు పారిస్లో ఆ లక్ష్యం అందుకుంటుందా లేదా అనేది చూడాలి.
Paris Olympics 2024: ప్రపంచ నెంబర్ 3తో తలపడనున్న లక్ష్యసేన్.. ఈజీ గ్రూపులో చేరిన తెలుగు తేజం.. పూర్తి వివరాలు మీకోసం
Paris Olympics Badminton Draw 2024: పారిస్ ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్లో భారత షట్లర్ లక్ష్య సేన్ గ్రూప్ మ్యాచ్లోనే ప్రపంచ 3వ ర్యాంకర్ ఇండోనేషియాకు చెందిన జోనాథన్ క్రిస్టీతో తలపడాల్సి ఉంటుంది. లక్ష్యతో పోలిస్తే, పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ల బృంద ప్రయాణం చాలా సులభంగా ఉంటుంది. పారిస్ ఒలింపిక్స్ జులై 26 నుంచి ప్రారంభం కానున్నాయి. బ్యాడ్మింటన్ పోటీలు జులై 27 నుంచి ప్రారంభం కానున్నాయి.
- Venkata Chari
- Updated on: Jul 14, 2024
- 9:46 am