
న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ 2024
News9 Global Summit 2024 : TV9 నెట్వర్క్కు చెందిన న్యూస్9 ఆధ్వర్యంలో జర్మనీలోని స్టుట్గాట్ నగరంలో గ్లోబల్ సమ్మిట్ 2024కు శ్రీకారం చుట్టింది. భారత్- జర్మనీ దేశాల మధ్య వాణిజ్య , ద్వైపాక్షిక, సాంస్కృతిక , క్రీడా సంబంధాలను బలోపేతంగా చేయడం లక్ష్యంగా ఈ సమ్మిట్ నిర్వహిస్తోంది. నవంబర్ 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. TV9 నెట్వర్క్ ఎండీ, సీఈఓ బరుణ్ దాస్ అధ్యక్షతన జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రసంగించనున్నారు. ఈ సమ్మిట్లో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. అలాగే జర్మనీకి చెందిన మంత్రులు, ప్రతినిధులు, ఇరు దేశాల రాజకీయ, వాణిజ్య, క్రీడా, సినీ ప్రముఖులు దాదాపు 200 మంది పాల్గొని కీలక అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు.
News9 Global Summit: తయారీ రంగంలో భారత్ ముందంజలో ఉంది: ప్రధాని మోదీ
డిజిటల్ టెక్నాలజీపై మన పెట్టుబడులు, ఆవిష్కరణల ప్రభావాన్ని ప్రపంచం చూస్తోందని ప్రధాని మోదీ అన్నారు. న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ వేదికపై ఆయన మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన డిజిటల్ ప్రభుత్వ రంగాన్ని కలిగి ఉన్న దేశం భారతదేశమని పేర్కొన్నారు. నేడు భారతదేశంలో చాలా జర్మన్ కంపెనీలు ఉన్నాయని, అవి భారతదేశంలో ఇంకా తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకోలేదన్నారు. వారిని కూడా భారతదేశానికి రమ్మని ఆయన ఆహ్వానించారు.
- Velpula Bharath Rao
- Updated on: Nov 23, 2024
- 8:20 am
News9 Global Summit: ప్రతీ దేశం భారత అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటోంది: ప్రధాని మోదీ
టీవీ నెట్వర్క్కు చెందిన న్యూస్9 జర్మీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు జరుగుతోన్న ఈ కార్యక్రమంలో రెండో రోజు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని పలు అంశాలపై స్పందించారు. భారత్, జర్మనీ దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి భారత్ కృషి చేస్తోందని తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ..
- Narender Vaitla
- Updated on: Nov 23, 2024
- 7:28 am
News9 Global Summit: వ్యూహాత్మక, సాంకేతిక కేంద్రంగా భారత్.. ఆర్థిక సంస్కరణలతో సత్ఫలితాలుః ప్రధాని మోదీ
భారత్-జర్మన్ భాగస్వామ్యానికి కొత్త శకానికి నాంది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశానికి చెందిన టీవీ9 జర్మనీలో ఈ సదస్సును నిర్వహించింది. నేటి సమాచార యుగంలో జర్మన్ ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి భారతీయ మీడియా గ్రూప్ ప్రయత్నిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
- Balaraju Goud
- Updated on: Nov 22, 2024
- 11:08 pm
News9 Global Summit: ‘భారత్-జర్మన్ సంబంధాల్లో నేడు సరికొత్త అధ్యాయం మొదలైంది’.. ప్రధాని మోదీ
జర్మనీలో జరగుతున్న న్యూస్9 గ్లోబల్ సమిట్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ఇండియా -జర్మనీ సంబంధాల్లో నేడు కొత్త అధ్యయనం ప్రారంభమైందని అన్నారు. ఇరు దేశాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై మోదీ ప్రసంగించారు..
- Srilakshmi C
- Updated on: Nov 22, 2024
- 9:58 pm
News9 Global Summit: ఇండో-జర్మన్ సంబంధాల్లో నేడు కొత్త అధ్యాయం: ప్రధాని మోదీ
టీవీ9 నెట్వర్క్ న్యూస్9 గ్లోబల్ సమిట్లో ప్రధాని మోదీ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. జర్మనీలో దాదాపు 3 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారని ప్రధాని మోదీ చెప్పారు. గడిచిన కొన్నాళ్లుగా రెండు దేశాల మధ్య వ్యాపారం బలపడుతోందన్నారు.
- Ram Naramaneni
- Updated on: Nov 22, 2024
- 9:39 pm
News9 Global Summit: ప్రపంచంలో శాంతి, అభివృద్ధికి పాటుపడే వ్యక్తి ప్రధాని మోదీ: టీవీ9 నెట్వర్క్ ఎండీ, సీఈవో బరుణ్ దాస్
ప్రపంచంలో శాంతి, అభివృద్ధికి పాటుపడే వ్యక్తి ప్రధాని మోదీ అంటూ టీవీ9 నెట్వర్క్ ఎండీ, సీఈవో బరుణ్ దాస్ కొనియాడారు.. జర్మనీలోని ప్రముఖ స్టట్గార్ట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ రెండో రోజున టీవీ9 నెట్వర్క్ ఎండీ, సీఈవో బరుణ్ దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
- Shaik Madar Saheb
- Updated on: Nov 22, 2024
- 10:04 pm
ఎన్నారైలను కలిసిన కేంద్ర మంత్రి సింధియా.. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం భారతీయులకే సాధ్యం అంటూ ప్రశంసలు.. ఎందుకంటే..
జర్మనీలో జరుగుతున్న న్యూస్9 గ్లోబల్ సమ్మిట్లో మొదటి రోజు జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు. ఆయన ఎన్నారైలతో పలు విషయాలపై మాట్లాడారు. ఇందుకు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మన దేశంలోని ప్రతి పౌరుడికి అసాధ్యాలను సుసాధ్యం చేసే సామర్థ్యం ఉందని అన్నారు.
- Surya Kala
- Updated on: Nov 22, 2024
- 8:48 pm
News9 Global Summit: భారత్, జర్మనీ కలిసి ప్రపంచ భవిష్యత్తుకు కొత్త రేఖను గీసుకోగలవు: బరుణ్ దాస్
ఒకటి ఇంజినీరింగ్ దిగ్గజ దేశం - మరొకటి ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి - రెండు కలిస్తే ప్రపంచానికి కొత్త శక్తి - ఈ శక్తికి కేటలిస్టుగా నిలుస్తోంది టీవీ నైన్ నెట్వర్క్ న్యూస్ నైన్ గ్లోబల్ సమిట్. అంతర్జాతీయ వేదికపై మొట్టమొదటిసారి ఒక భారతీయ మీడియా సంస్థ ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
- Ram Naramaneni
- Updated on: Nov 22, 2024
- 9:09 pm
News9 Global Summit: ‘పెట్టుబడులకు గుజరాత్ ప్రపంచ వేదికగా మారింది’.. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్
న్యూస్ 9 గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కార్యక్రమంలో ఆన్లైన్లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మాట్లాడారు. గ్లోబల్ కంపెనీలకు గుజరాత్ అత్యంత ప్రాధాన్య పెట్టుబడి గమ్యస్థానంగా మారిందని అన్నారు. ఈ సమ్మిట్ గుజరాత్-జర్మనీల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు..
- Srilakshmi C
- Updated on: Nov 22, 2024
- 8:32 pm
నిపుణులకు కొదవ లేదు.. పెట్టుబడులతో రండి.. న్యూస్ 9 గ్లోబల్ సమ్మిట్లో కర్ణాటక సీఎం పిలుపు
పెట్టుబడిదారులకు కర్ణాటక ఎప్పుడూ ఎంతో ఇష్టమైన రాష్ట్రమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. ఇక్కడ చాలా మంచి వ్యాపార వాతావరణం ఉందన్న ఆయన, కంపెనీలు, పెట్టుబడిదారులకు అనేక సౌకర్యాలను రాష్ట్రం అందిస్తుందని స్పష్టం చేశారు.
- Balaraju Goud
- Updated on: Nov 22, 2024
- 7:14 pm