AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యూస్‌9 గ్లోబల్‌ సమ్మిట్‌

న్యూస్‌9 గ్లోబల్‌ సమ్మిట్‌

News9 Global Summit : TV9 నెట్‌వర్క్‌కు చెందిన న్యూస్‌9 ఆధ్వర్యంలో జర్మనీలోని స్టుట్‌గాట్‌‌ నగరంలో గ్లోబల్‌ సమ్మిట్‌ 2024కు శ్రీకారం చుట్టింది. భారత్‌- జర్మనీ దేశాల మధ్య వాణిజ్య , ద్వైపాక్షిక, సాంస్కృతిక , క్రీడా సంబంధాలను బలోపేతంగా చేయడం లక్ష్యంగా ఈ సమ్మిట్ నిర్వహిస్తోంది. అక్టోబర్‌ 9వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రెండు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. TV9 నెట్‌వర్క్‌ ఎండీ, సీఈఓ బరుణ్‌ దాస్‌ అధ్యక్షతన జరిగే ఈ గ్లోబల్‌ సమ్మిట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. ఈ సమ్మిట్‌లో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. అలాగే జర్మనీకి చెందిన మంత్రులు, ప్రతినిధులు, ఇరు దేశాల రాజకీయ, వాణిజ్య, క్రీడా, సినీ ప్రముఖులు దాదాపు 200 మంది పాల్గొని కీలక అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు.

ఇంకా చదవండి

జర్మనీలో నాణ్యమైన విద్యతో US కంటే తక్కువ ఖర్చు.. అవకాశాలు ఎక్కువ..!

దేశంలోనే అతి పెద్ద న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 ఆధ్వర్యంలో న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ జర్మనీ లో ఘనంగా జరిగింది. ఈ ఎడిషన్‌లో ఉన్నత విద్య గురించి విస్తృతంగా చర్చించారు. జర్మన్, భారతీయ నిపుణుల ప్యానలిస్టులు "గ్లోబల్ ఎడ్యుకేషన్ రీసెట్: నౌ స్టడీ ఇన్ జర్మనీ" అనే అంశంపై మాట్లాడారు. జర్మనీలోని భారతీయ విద్యార్థుల సామర్థ్యాన్ని హైలైట్ చేస్తూ, ప్యానలిస్టులు జర్మనీ భారతీయ విద్యార్థులకు నాణ్యమైన విద్య, తగినంత కెరీర్ అవకాశాలను అందిస్తుందని పేర్కొన్నారు.

News9 Global Summit 2025: చైనా కంటే పురాతనమైనది భారతీయ సంస్కృతిః ఆండ్రియాస్ లాప్‌

వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా జర్మనీ స్టుట్‌గార్ట్‌లో నిర్వహించిన టీవీ9 గ్లోబల్‌ సమ్మిట్‌ సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని జర్మనీ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు టీవీ9 ఎండీ, సీఈవో బరుణ్‌దాస్‌. TV9 నెట్‌వర్క్ నిర్వహించిన న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ 2025 రెండవ ఎడిషన్ అక్టోబర్ 9 - 10 తేదీలలో స్టట్‌గార్ట్‌లో జరిగింది.

News9 Global Summit 2025: ఫుడ్ టూరిజం.. ఫ్రమ్ బీర్ టు బటర్ చికెన్‌పై గ్లోబల్‌ సమ్మిట్‌లో ఆసక్తికరమైన చర్చ!

టీవీ9 నెట్‌వర్క్ న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ జర్మనీలో భారత్-జర్మనీ సంబంధాలను ఆహార పర్యాటకం ద్వారా బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. చెఫ్ కునాల్ కపూర్, జర్మన్ వైన్‌మేకర్‌లు సంస్కృతులు, వంటకాలు దేశాలను ఎలా కలుపుతాయో చర్చించారు. భారతీయ ఆహారం గురించి అపోహలను తొలగిస్తూ, జర్మన్ వైన్‌తో భారతీయ వంటకాల అనుసంధానాన్ని హైలైట్ చేశారు.

  • SN Pasha
  • Updated on: Oct 10, 2025
  • 1:03 pm

News9 Global Summit 2025: ఆయుధాలు కాదు.. ఈ మూడు ఉంటేనే యుద్ధంలో గెలుపు సాధ్యం.. న్యూస్9 సమ్మిట్‌లో డాక్టర్ వివేక్ లాల్..

మారుతున్న ప్రపంచ పరిస్థితులు, పెరుగుతున్న ముప్పులను దృష్టిలో ఉంచుకుని, రక్షణ వ్యవస్థకు మూడు ముఖ్య స్తంభాలు అవసరమని డాక్టర్ వివేక్ లాల్ నొక్కి చెప్పారు. భద్రత, స్థిరత్వం, స్కేలబిలిటీని మూడు ముఖ్య అంశాలుగా తెలిపారు. రక్షణ రంగంలో స్థిరత్వం కోసం వ్యూహాత్మక అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

News9 Global Summit 2025: ‘కలలకు లింగ భేదం లేదు.. ఆలోచన మారనంత వరకు ఏదీ మారదు’ టీవీ9 గ్లోబల్‌ సమ్మిట్‌లో మహిళా లీడర్లు

బోర్డు రూమ్‌లో మహిళలు ఉండటం మాత్రమే సరిపోదు. కానీ వారికి సమాన అవకాశాలు, నిర్ణయం తీసుకునే శక్తిని ఇవ్వడం ముఖ్యమని డాక్టర్ సరితా ఐలావత్ అన్నారు. గురువారం (అక్టోబర్‌ 9) జర్మనీలో జరిగిన న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ 2025 సెకండ్‌ ఎడిషన్ లో ప్రభావవంతమైన మహిళా లీడర్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా..

ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశ ముఖచిత్రం మారుతోందిః అనురాగ్ ఠాకూర్

ఉగ్రవాదంపై నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరిని మరోసారి పునరుద్ఘాటించారు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్. ఉగ్రవాదం విషయంలో ప్రపంచం ద్వంద్వ ప్రమాణాలను సహించదని మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఏలాంటి ఉగ్రవాద దాడికైనా భారతదేశం ప్రతిస్పందిస్తుంది. పొరుగు దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని అనురాగ్ ఠాకూర్ అన్నారు.

News9 Global Summit: భారతదేశం వృద్ధికి ఇంజిన్‌గా మారుతోంది? : ప్రఖ్యాత ఆర్థికవేత్త డాక్టర్ అరవింద్ విర్మాణి

News9 Global Summit: నేడు ప్రపంచం ద్రవ్యోల్బణం, సరఫరాలో సమస్యలు, ఆర్థిక మందగమనం వంటి సవాళ్లతో సతమతమవుతుండగా, భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మిగిలిపోయింది. దీని వెనుక గల కారణాలను డాక్టర్ విర్మాణి వివరించారు. క్లిష్ట సమయాల్లో భారతదేశం నిర్మాణాత్మక సంస్కరణలు..

రాబోయే 25 సంవత్సరాలు భారత్-జర్మనీ సంబంధాలకు ఢోకా లేదుః విదేశాంగ మంత్రి డాక్టర్ జోహన్ వేడెఫుల్

జర్మనీ స్టుట్‌గార్ట్‌ నగరంలోని MHP ఎరినాలో టీవీ9 గ్లోబల్‌ సమ్మిట్‌ ఘనంగా ప్రారంభమయ్యింది. జర్మనీకి చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు, రక్షణరంగ నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారత్‌-జర్మనీ మధ్య దౌత్య సంబంధాలతో పాటు రక్షణరంగంలో ఒప్పందాలపై ఈ సమ్మిట్‌లో కీలక చర్చలు జరుగుతున్నాయి.

News9 Global Summit: భారత్‌ జర్మనీకి భాగస్వామి మాత్రమే కాదు.. రెండింటి మధ్య నమ్మకమైన సంబంధం ఉంది: జర్మనీ డాక్టర్ నికోల్

News9 Global Summit: ఈరోజు స్టట్‌గార్ట్‌లో జరుగుతున్న న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ జర్మనీ రెండవ ఎడిషన్‌లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉందని డాక్టర్‌ నికోల్‌ హాఫ్‌మీస్టర్‌ అన్నారు. ఈ నగరం ప్రేరణ, ఆవిష్కరణ, అంతర్జాతీయ స్ఫూర్తిని కలిగి ఉంది. బాడెన్-వుర్టెంబర్గ్ రాష్ట్రం..

News9 Global Summit 2025: ప్రపంచం మొత్తం న్యూ ఇండియా గురించి మాట్లాడుతోంది: బరుణ్‌ దాస్‌

టీవీ9 నెట్‌వర్క్ న్యూస్‌9 గ్లోబల్ సమ్మిట్ 2025 జర్మనీ ఎడిషన్ ప్రారంభమైంది. MD-CEO బరుణ్ దాస్ ప్రసంగంతో కార్యక్రమం మొదలైంది. ఆయన భారత్-జర్మనీ బంధం, న్యూ ఇండియా సామర్థ్యంపై మాట్లాడారు. ఆధునికతను అందిపుచ్చుకోవడంలో భారత్ ముందుందని, ముఖ్యంగా UPI ద్వారా డిజిటల్ ఆర్థిక ప్రగతిని సాధిస్తోందని, స్మార్ట్‌ఫోన్‌లు పేదలకు ఎలా సాధికారత కల్పిస్తున్నాయో వివరించారు.

  • SN Pasha
  • Updated on: Oct 9, 2025
  • 8:42 pm