
నారా లోకేశ్
నారా లోకేశ్ ఆంధ్ర ప్రదేశ్కి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుమారుడు. నారా లోకేశ్ 1983 జనవరి 23న హైదరాబాద్లో జన్మించారు. ఆయన కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయం నుండి మేనేజిమెంటు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగంలో బి.ఎస్సీ చేసారు. అనంతరం స్టాన్ఫర్డు విశ్వవిద్యాలయం నుండి ఎం.బి.ఎ చేశారు.
తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికల ప్రణాళికలోని నగదు బదిలీ పథకమును నారా లోకేశ్ సూచించినట్లు చెబుతారు. నారా లోకేశ్ మే 2013లో టీడీపీలో చేరారు. అతడు తెలుగుదేశం పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహించాడు. గతంలో ఆయన హెరిటేజ్ ఫుడ్స్ కు మేనేజింగ్ డైరెక్టెర్గా పనిచేశాడు. ఆయన 2017 మార్చి 30లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికై ఆ తర్వాత రెండేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. 2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గము నుండి పోటీ చేసి తన ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణా రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపు లక్ష్యంతో ఏపీలోని 97 నియోజకవర్గాల మీదుగా నారా లోకేశ్ 3,100 కిలో మీటర్ల పాదయాత్రను చేపట్టారు.
2007లో నారా లోకేశ్ తన మామ అయిన నందమూరి బాలకృష్ణ కుమార్తె నందమూరి బ్రాహ్మణిని వివాహం చేసుకున్నారు. వారికి నారా దేవాన్ష్ అనే ఏకైక కొడుకు ఉన్నారు.
CM Chandrababu: సీఎం చంద్రబాబు ఫ్యామిలీతో కలిసి జన్మదిన వజ్రోత్సవం.. ఏ దేశంలో తెలుసా..?
75 ఏళ్ల వయసు అంటే ఒక రాజకీయ నాయకుడి జీవితంలోనే కాక, ఏ వ్యక్తిగత జీవితానికైనా ఒక మైలురాయి. అంతటి ఘనత గల సందర్భాన్ని రాష్ట్ర రాజధాని అమరావతిలో కాదు, విదేశాల్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్గా జరుపుకోవాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పెద్ద ఎత్తున నాయకులు, శ్రేణులు, అభిమానులు, రాజకీయ ప్రదర్శనలు జరగకుండా ఉండేందుకు ఇదే సరైన మార్గమని ఆయన భావించినట్టు తెలిసింది.
- Eswar Chennupalli
- Updated on: Apr 15, 2025
- 9:00 pm
మాట నిలబెట్టుకుంటున్న మంత్రి నారా లోకేష్.. మంగళగిరిలో 50 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం!
మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో గత పదిహేనేళ్లుగా కొండవాలు ప్రాంతంలో నివసిస్తున్న రాజమండ్రి గోవిందు కుటుంబానికి మంత్రి లోకేష్ ఇంటికెళ్లి బట్టలు పెట్టి శాశ్వత పట్టాను అందజేశారు. మంగళగిరిలో పాదయాత్ర నిర్వహించిన సమయంలో ఇక్కడ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కీలకమైన హామీ నెరవేర్చానన్నారు.
- Balaraju Goud
- Updated on: Apr 3, 2025
- 3:55 pm
CM Chandrababu: 1995 సీఎం మాదిరిగానే ఉంటా.. తాట తీస్తా: సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 1995లో సీఎం మాదిరిగానే ఉంటా.. ఎవరైనా చెడు చేసి తప్పించుకోవాలంటే తాటతీస్తానంటూ హెచ్చరించారు. తప్పు చేసిన వాళ్లను శిక్షిస్తే ప్రజలు కూడా హర్షిస్తారన్నారు. కార్యకర్తలే పార్టీకి ముఖ్యమని పేర్కొన్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Mar 29, 2025
- 1:08 pm
Lokesh – Ravindra Reddy: లోకేష్తో మీటింగ్కు రవీంద్రారెడ్డి.. తెలుగు తమ్ముళ్ల ఫైర్.. ఇంతకీ ఆయనెవరో తెలుసా..?
Ravindra Reddy - Lokesh Meeting Controversy: విద్యార్ధుల్లో నైపుణ్యం పెంచేందుకు ప్రముఖ టెక్ కంపెనీ సిస్కోతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి లోకేష్ సమక్షంలో అధికారులు ఎంవోయూ చేసుకున్నారు. దీని ద్వారా 50 వేల మంది యువతకు డిజిటల్, ఐటీ స్కిల్ డెవలెప్మెంట్లో సిస్కో సంస్థ శిక్షణ ఇవ్వనుంది. ఇంతవరకూ భాగానే ఉన్నా.. సిస్కో టీమ్లో ఇప్పాల రవీంద్రారెడ్డి అనే వ్యక్తి కనిపించడంపై టీడీపీ సోషల్మీడియాలో తీవ్ర దుమారం రేగింది.
- Eswar Chennupalli
- Updated on: Mar 26, 2025
- 10:53 am
Andhra: బీఎడ్ పరీక్ష రద్దు.. స్పష్టం చేసిన మంత్రి లోకేష్
నాగార్జున యూనివర్సిటీలో బీఎడ్ పేపర్ లీక్ వ్యవహారం రచ్చ లేపుతోంది. ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ సీరియస్గా రియాక్టయ్యారు. మధ్యాహ్నం 2:00 గంటలకు జరగాల్సిన "ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్" పరీక్ష ప్రశ్నపత్రం పరీక్షకు 30 నిమిషాల ముందు లీక్ కావడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి, పేపర్ లీక్ పై సమగ్ర దర్యాప్తు జరపాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షను రద్దు చేయాలని కూడా ఆయన నిర్ణయించారు.
- Ram Naramaneni
- Updated on: Mar 7, 2025
- 8:33 pm
Andhra Pradesh: ఏపీలో మరో భారీ పెట్టుబడి.. టాటా రెన్యువబుల్ ఎనర్జీతో సర్కార్ కీలక ఒప్పందం
భారతదేశ పునరుత్పాదక ఇంధన రంగంలో పేరెన్నికగన్న టాటా పవర్ అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధికి సహకారం, కొత్త అవకాశాలను అన్వేషణకు ఎపి ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం ( MOU ) కుదుర్చుకుంది.
- Ram Naramaneni
- Updated on: Mar 7, 2025
- 8:18 pm
Nara Lokesh: ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలి.. వైసీపీకి ప్రతిపక్ష హోదాపై నారా లోకేష్ ఏమన్నారంటే..
నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. అధికారంలో ఉంది వైసీపీ కాదు.. కూటమి ప్రభుత్వం అంటూ హెచ్చరించారు మంత్రి లోకేష్. డిప్యూటీ సీఎం పవన్ను ఉద్దేశిస్తూ జగన్ కామెంట్ చేస్తూ.. దానికి కౌంటర్ ఇవ్వడమే కాకుండా సవాల్ కూడా చేశారు మంత్రి లోకేష్.. మీడియాతో మాట్లాడిన లోకేష్ ఏమన్నారంటే..
- Shaik Madar Saheb
- Updated on: Mar 5, 2025
- 8:36 pm
Kumbh Mela: మహా కుంభమేళాలో మంత్రి లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు.. వీడియో
ఏపీ మంత్రి నారాలోకేష్ తన సతీమణి, కుమారుడితో కలిసి ప్రయాగ్ రాజ్ కు వెళ్లారు. కుంభమేళ త్రివేణి సంగమంకు వెళ్లి అక్కడ పవిత్ర స్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. అక్కడి అధికారులు ఏపీ మంత్రికి ప్రత్యేకంగాస్వాగతం పలికారు. ఆ తర్వాత వారణాసి కాలభైరవ ఆలయాన్ని సందర్శించారు. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళ, ఫిబ్రవరి 26 మహా శివరాత్రి వరకు కొనసాగనుంది.
- Ram Naramaneni
- Updated on: Feb 17, 2025
- 4:45 pm
Andhra: చంద్రబాబు విజన్.. లోకేశ్ డైరెక్షన్.. రాష్ట్రంలో వాట్సాప్ ద్వారా 161 రకాల సర్వీసులు
ప్రజల వద్దకే పాలన అన్నట్లు... దేశంలోనే ఫస్ట్ టైమ్ వాట్సాప్ గవర్నెన్స్ను అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. పౌర సేవలను మరింత సులభతరం చేస్తూ.. 161 రకాల సేవలను వాట్సాప్ ద్వారా ప్రభుత్వం అందిస్తోంది. ఈ సేవలను ప్రారంభించారు మంత్రి లోకేష్.
- Ram Naramaneni
- Updated on: Jan 30, 2025
- 3:03 pm
పవన్ను సీఎంగా చూడాలని 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం.. జనసేన నేత కీలక వ్యాఖ్యలు
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని ఆ పార్టీ నేతలు కొందరు కోరడంతో కొత్త చర్చ మొదలయ్యింది. దీనిపై జనసేన నేతలు కూడా స్పందిస్తున్నారు. పవన్ కల్యాణ్ను కొన్నేళ్లైనా రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నారు. మొత్తానికి ఇరు పార్టీల నేతల స్పందనలతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
- Janardhan Veluru
- Updated on: Jan 20, 2025
- 1:19 pm