నారా లోకేశ్
నారా లోకేశ్ ఆంధ్ర ప్రదేశ్కి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుమారుడు. నారా లోకేశ్ 1983 జనవరి 23న హైదరాబాద్లో జన్మించారు. ఆయన కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయం నుండి మేనేజిమెంటు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగంలో బి.ఎస్సీ చేసారు. అనంతరం స్టాన్ఫర్డు విశ్వవిద్యాలయం నుండి ఎం.బి.ఎ చేశారు.
తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికల ప్రణాళికలోని నగదు బదిలీ పథకమును నారా లోకేశ్ సూచించినట్లు చెబుతారు. నారా లోకేశ్ మే 2013లో టీడీపీలో చేరారు. అతడు తెలుగుదేశం పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహించాడు. గతంలో ఆయన హెరిటేజ్ ఫుడ్స్ కు మేనేజింగ్ డైరెక్టెర్గా పనిచేశాడు. ఆయన 2017 మార్చి 30లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికై ఆ తర్వాత రెండేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. 2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గము నుండి పోటీ చేసి తన ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణా రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపు లక్ష్యంతో ఏపీలోని 97 నియోజకవర్గాల మీదుగా నారా లోకేశ్ 3,100 కిలో మీటర్ల పాదయాత్రను చేపట్టారు.
2007లో నారా లోకేశ్ తన మామ అయిన నందమూరి బాలకృష్ణ కుమార్తె నందమూరి బ్రాహ్మణిని వివాహం చేసుకున్నారు. వారికి నారా దేవాన్ష్ అనే ఏకైక కొడుకు ఉన్నారు.
CII సదస్సుకు ఓ రేంజ్లో స్పందన.. అంచనాలకు మించి పెట్టుబడుల వెల్లువ..!
విశాఖ సీఐఐ సదస్సు సూపర్ సక్సెస్ అయిందంటే.. దానికి కొన్ని నెలలపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన కృషే కారణం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్తో పాటు మిగిలిన మంత్రులు పట్టువదలకుండా చేసిన ప్రయత్నాలు.. దేశ విదేశాలు తిరిగి పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవడంతోనే ఇది సాధ్యమైంది. అన్నింటికీ మించి.. ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలు, పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహకాల కారణంగా.. అసాధ్యం, సుసాధ్యమైంది.
- Balaraju Goud
- Updated on: Nov 15, 2025
- 8:15 pm
Nara Lokesh: మధ్యలో అడ్డురావొద్దు.. పక్కకు వెళ్లండి.. పోలీసులపై నారా లోకేష్ ఫైర్.. ఎందుకంటే..
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి గ్రామంలో ఇటీవల మృతి చెందిన మాలెపాటి సుబ్బనాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మంత్రి లోకేష్ వెళుతుండగా ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్కుమార్, ఇతర టిడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు.
- Fairoz Baig
- Updated on: Nov 6, 2025
- 10:58 am
Andhra: ఏపీలో AI విప్లవం.. హైస్కూలు స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశాలు: నారా లోకేష్
భారతదేశంలో విద్యారంగ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ ముందువరుసలో ఉందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యారంగంపై క్వీన్స్ ల్యాండ్ ట్రేడ్ & ఇన్వెస్టిమెంట్ సెంటర్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
- Shaik Madar Saheb
- Updated on: Oct 22, 2025
- 2:58 pm
Kurnool: కర్నూలులో ప్రధాని మోదీ బహిరంగ సభ .. లైవ్ చూడండి
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు ప్రధాని మోదీ. భ్రమరాంబ మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశైలం మల్లికార్జునస్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం.. భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు చేశారు. 50 నిమిషాలపాటు మల్లన్న సన్నిధిలో గడిపారు మోదీ.శ్రీశైలం క్షేత్రంలో ప్రధాని మోదీకి అర్చకులు, ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం, ప్రధాని మోదీకి వేద ఆశీర్వాదం అందించారు అర్చకులు. ప్రధానితోపాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ కూడా శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు.
- Ram Naramaneni
- Updated on: Oct 16, 2025
- 3:34 pm
PM Modi in Kurnool Highlights: చంద్రబాబు, పవన్ రూపంలో.. ఏపీకి శక్తివంతమైన నాయకత్వం ఉంది: ప్రధాని మోదీ
PM Modi’s Kurnool visit Highlights: ప్రధాని మోదీ శ్రీశైలం నుంచి కర్నూలు చేరుకున్నారు. కర్నూలులో నిర్వహించే సూపర్ జీఎస్టీ..సూపర్ సేవింగ్స్ సభలో పాల్గొన్నారు. ప్రధానితోపాటు బహిరంగసభలో చంద్రబాబు, పవన్, మంత్రులు పాల్గొననున్నారు. గంటన్నరపాటు ఉండనున్న ప్రధాని మోదీ.. సభా వేదిక పైనుంచే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మొత్తం 13వేల 400కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
- Subhash Goud
- Updated on: Oct 16, 2025
- 4:34 pm
విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు.. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి: మంత్రి నారా లోకేశ్..
ఐటీ కంపెనీలకు విశాక డెస్టినేషన్ సిటీ అంటోంది ఏపీ సర్కార్. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల్లో 50శాతం విశాఖకే వస్తున్నాయని చెప్పారు మంత్రి నారా లోకేష్. విశాఖ కేంద్రంగా 4 జిల్లాలతో ఎకనమిక్ కారిడార్ ఏర్పాటు చేస్తామని వివరించారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే.. ఏపీ బులెట్ ట్రైన్లా అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు.
- Shaik Madar Saheb
- Updated on: Oct 12, 2025
- 9:31 pm
OG Movie: ‘ఓజీ’కి కొత్త అర్థం చెప్పిన నారా లోకేష్.. పవన్ కల్యాణ్ సినిమాపై ఇంట్రెస్టింగ్ ట్వీట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ ను పురస్కరించుకుని సినీ, రాజకీయ ప్రముఖులూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేశ్ 'ఓజీ' చిత్ర బృందానికి విషెస్ చెబుతూ ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఓజీ కి సరికొత్త అర్థం చెప్పారాయన.
- Basha Shek
- Updated on: Sep 25, 2025
- 7:20 am
బుచ్చయ్య తాత.. నారా లోకేష్ సరదా సంభాషణ.. అంకుల్ అంటే బాగుంటుందేమో..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.. మండలిలో మాటలు మంటలు రేపితే.. అసెంబ్లీ మాత్రం కాస్త సరదాగా సాగింది. టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్యచౌదరిని తాత అంటూ మంత్రి నారా లోకేష్ ఆప్యాయంగా పిలిచారు. అయితే.. బుచ్చయ్య చౌదరిని అంకుల్ అని పిలిస్తే బాగుంటుందేమోనని సలహా ఇచ్చారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. దీనికి నారా లోకేష్ స్పందించి సరదా వ్యాఖ్యలు చేశారు.
- Shaik Madar Saheb
- Updated on: Sep 24, 2025
- 9:51 pm
Nara Lokesh: దేవుడి దగ్గర నాటకాలు ఆడారు.. పరకామణి ఘటనపై సిట్ విచారణకు ఆదేశిస్తాం..
తిరుమల పరకామణి వ్యవహారాన్ని చంద్రబాబు ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ చోరీపై సిట్ విచారణకు ఆదేశిస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పరకామణి దొంగను అరెస్ట్ చేయకుండా గతంలో నోటీసులు ఇచ్చి పంపించేశారని ఆరోపించిన మంత్రి..పరకామణి చోరీ కేసులో వాస్తవాలు బయటకు రావాలని చిట్చాట్లో చెప్పారు.
- Shaik Madar Saheb
- Updated on: Sep 22, 2025
- 4:24 pm
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలపై ప్రముఖుల ఆగ్రహం.. వైజాగ్ రావాలంటూ మంత్రి లోకేష్ ఆహ్వానం..
ట్రాఫిక్ జామ్ ఏర్పడితే వాహనాలు ఆగిపోతాయి, కాని ఆ నగరంలో ట్రాఫిక్ జామ్ కారణంగా ఏకంగా కంపెనీలు తట్టాబుట్టా సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆ ట్రాఫిక్ నరకాన్ని సరిదిద్దకపోతే ఇక అంతే అంటూ ప్రముఖులు కూడా నిలదీస్తున్న పరిస్థితి.. ఈ క్రమంలోనే నారా లోకేశ్ వైజాగ్ వచ్చేయండి అంటూ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
- Shaik Madar Saheb
- Updated on: Sep 17, 2025
- 8:31 pm