AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నారా లోకేశ్

నారా లోకేశ్

నారా లోకేశ్ ఆంధ్ర ప్రదేశ్‌కి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుమారుడు. నారా లోకేశ్ 1983 జనవరి 23న హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయం నుండి మేనేజిమెంటు ఇన్ఫర్‌మేషన్ సిస్టమ్స్ విభాగంలో బి.ఎస్సీ చేసారు. అనంతరం స్టాన్‌ఫర్డు విశ్వవిద్యాలయం నుండి ఎం.బి.ఎ చేశారు.

తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికల ప్రణాళికలోని నగదు బదిలీ పథకమును నారా లోకేశ్ సూచించినట్లు చెబుతారు. నారా లోకేశ్ మే 2013లో టీడీపీలో చేరారు. అతడు తెలుగుదేశం పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహించాడు. గతంలో ఆయన హెరిటేజ్ ఫుడ్స్ కు మేనేజింగ్ డైరెక్టెర్‌గా పనిచేశాడు. ఆయన 2017 మార్చి 30లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికై ఆ తర్వాత రెండేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. 2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గము నుండి పోటీ చేసి తన ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణా రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపు లక్ష్యంతో ఏపీలోని 97 నియోజకవర్గాల మీదుగా నారా లోకేశ్ 3,100 కిలో మీటర్ల పాదయాత్రను చేపట్టారు.

2007లో నారా లోకేశ్ తన మామ అయిన నందమూరి బాలకృష్ణ కుమార్తె నందమూరి బ్రాహ్మణిని వివాహం చేసుకున్నారు. వారికి నారా దేవాన్ష్ అనే ఏకైక కొడుకు ఉన్నారు.

ఇంకా చదవండి

Watch: ఎగిరే పక్షి.. అద్భుతం.. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం.. !

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ద్వారం తెరుచుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2026 ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, అరకు లోయ ప్రకృతి అందాలు, గిరిజన చుట్టిళ్ల వాస్తుశిల్పం, ఎగిరే పక్షి ఆకృతిని ప్రతిబింబించేలా టెర్మినల్ భవనాన్ని అత్యాధునికంగా నిర్మించారు.

ప్రధాని మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్ట్‌ జాతికి అంకితం..

విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (ఆగస్టు 1) ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.

Watch: ప్రపంచ రికార్డు థింసాతో ప్రధానికి గ్రాండ్ వెల్‌కమ్.. భోగాపురం మెరిసింది..

విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆకాశం నుంచి చూస్తే అద్భుతంగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు విమానాశ్రయ ప్రాంగణంలో వేలాది మంది గిరిజన కళాకారులు సంప్రదాయ థింసా నృత్యం ప్రదర్శించారు.

అప్పుడు చెన్నై టు హైదరాబాద్.. ఇప్పుడు హైదరాబాద్ టు అమరావతి సాధ్యమేనా?

అమరావతిలో బాలకృష్ణ-కొరటాల శివ సినిమా ప్రారంభోత్సవం జరగడం తెలుగు సినీ పరిశ్రమలో కొత్త చర్చకు దారితీసింది. హైదరాబాద్ తర్వాత అమరావతిని టాలీవుడ్‌కు రెండో కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ పరిశ్రమను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. స్టూడియోలు, ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ, చిత్రీకరణ సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం, సినీ రంగాన్ని అమరావతి వైపు మళ్లించేందుకు కార్యాచరణ చేపడుతోంది.

Balakrishna NBK 112: మావయ్య సినిమాకి అల్లుడి క్లాప్.. అమరావతిలో బాలయ్య కొత్త సినిమా ప్రారంభం.. వీడియో

వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ మరో కొత్త సినిమాను ప్రారంభించారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈసారి బాలయ్యను డైరెక్ట్ చేయనున్నారు. గురువారం (జూన్ 25) వెలగపూడిలో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఏపీ మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Nara Lokesh  Diet Plan: నారా లోకేష్ వెయిట్ లాస్ సీక్రెట్: ఏకంగా 30 కిలోలు తగ్గించిన ఆ డైట్ ప్లాన్ మీ కోసం

Nara Lokesh Weight Loss Secret: ఈ రోజుల్లో బరువు తగ్గడం, ఫిట్‌గా మారడం అనేది చాలా మందికి ఒక పెద్ద సవాలుగా మారింది. మారుతున్న జీవనశైలి, జంక్ ఫుడ్ సంస్కృతి వల్ల ఊబకాయం బారిన పడుతున్న యువత సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సాధించిన శారీరక మార్పు అందరినీ ఆశ్చర్యపరుస్తూ, సరికొత్త ఫిట్‌నెస్ లక్ష్యాలను నిర్దేశిస్తోంది.

  • Phani CH
  • Updated on: Jun 10, 2026
  • 1:33 pm

‘కేటీఆర్‌తో లోకేష్ సరితూగలేరు.. నాయకుడిగా మరింత ఎదగాల్సి ఉంది’: కడియం

టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌ నిర్వహించిన ‘క్రాస్‌ఫైర్’ ఇంటర్వ్యూలో మాజీమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏపీ రాజకీయాలు, తెలుగు దేశం పార్టీ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, నేతలపై స్పందిస్తూ.. నారా లోకేష్ ఇంకా తండ్రి చాటు కుమారుడిగానే ప్రొజెక్ట్ అవుతున్నారని, నాయకుడిగా ఆయన మరింత ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.

ఇది మా సంకల్పం.. ఇకపై మహిళలకు 33శాతం సీట్లు ఇస్తాం: మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన

టీడీపీ మహానాడు వేదికగా నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని విమర్శించిన లోకేష్.. మహిళా నాయకత్వమే భారత రాజకీయాల భవిష్యత్తు అని స్పష్టం చేశారు. “ఇది మా సంకల్పం.. ఇది మా కమిట్‌మెంట్” అంటూ చేసిన వ్యాఖ్యలు మహానాడు వేదికను మారుమోగించాయి.

TDP Mahanadu 2026: పసుపు పండగ.. టీడీపీ మహానాడు ప్రత్యక్ష ప్రసారం..

టీడీపీ మహానాడు 2026 మంగళగిరిలో ఘనంగా ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌కు నివాళులర్పించి పార్టీ జెండా ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా 1848 క్లస్టర్లలో ఎల్ఈడీ స్క్రీన్లతో మహానాడు ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేశారు. రెండు రోజుల మహానాడులో మొత్తం 20 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టనుంది టీడీపీ.

పొదుపు బాటలో టీడీపీ.. ఈసారి ‘డిజిటల్’ మహానాడు.. చంద్రబాబు కీలక నిర్ణయం..!

తెలుగుదేశం పార్టీ (TDP) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వార్షిక పండుగ 'మహానాడు'కు సంబంధించి మీరు అందించిన సమాచారం అటు పార్టీ శ్రేణుల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చగా మారింది. ప్రభుత్వపరంగా, పార్టీపరంగా అనవసర ఖర్చులను తగ్గించుకోవాలనే పొదుపు చర్యల్లో భాగంగానే అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ-డిజిటల్, ఆన్‌లైన్ మహానాడు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అమెరికా గడ్డపై పులివెందుల కుర్రాడి సంచలనం.. 25 ఏళ్లకే డ్యూయల్ లైసెన్స్.. నారా లోకేష్ ఏమన్నారంటే..

కడప జిల్లా పులివెందుల ప్రాంతానికి చెందిన సాయి శ్రీనివాస్ రెడ్డి కేవలం 25 ఏళ్ల వయసులోనే అమెరికా, భారతదేశాల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసేందుకు డ్యూయల్ లైసెన్స్ సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇండియానా స్టేట్‌లో లైసెన్స్డ్ అటార్నీగా గుర్తింపు పొందిన ఆయన.. తొలి ప్రయత్నంలోనే కఠినమైన పరీక్షను క్లియర్ చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

Andhra: ట్రాన్స్‌జెండర్‌కి పిఏ ఉద్యోగం ఇచ్చిన ఎమ్మెల్యే.. మంత్రి నారా లోకేష్ ఏమన్నారంటే..

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల సమస్యలు వింటున్న క్రమంలో ఓ ట్రాన్స్‌జెండర్ ఆమెను కలిశారు. అనంతరం ఆమె ఎడ్యూకేషన్ గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే.. ఆమెకు తన పర్సనల్ అసిస్టెంట్ (పీఏ)గా ఉద్యోగం ఇచ్చారు. నెలకు రూ. 25,000 జీతంతో వర్షిణి ఇప్పుడు ఎమ్మెల్యే వెంటే ఉంటూ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ చర్య సామాజిక సాధికారతకు ప్రతీకగా నిలుస్తోంది.. పలువురి ప్రశంసలు అందుకుంటోంది.