AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవిడ్-19

కోవిడ్-19

కోవిడ్-19.. దీన్ని కరోనా వైరస్ అని కూడా పిలుస్తారు. ఇది అత్యంత ప్రమాదకరమైన వైరల్ వ్యాధి. ఈ వైరస్ మొదటిసారిగా 2019లో చైనాలోని వుహాన్‌లో గుర్తించారు. కొన్ని నెలల వ్యవధిలోనే ఈ ప్రాణాంతక వైరస్‌ భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది.

COVID-19 యావత్ ప్రపంచంపై వినాశకరమైన ప్రభావాన్ని చూపింది. ఈ వైరస్ బారినపడి ప్రపంచవ్యాప్తంగా లక్షణాది మంది ప్రాణాలు కోల్పోయారు. పలు వైద్య పరిశోధనలు, వ్యాక్సిన్ల ప్రభావంతో కోవిడ్ -19 వైరస్ వ్యాప్తిని కట్టడి దిశగా ప్రపంచ దేశాలు ముందడుగు వేసినా.. ఈ వైరల్ వ్యాధి వ్యాప్తి భారతదేశంతో సహా అనేక దేశాలలో ఇప్పటికీ కొనసాగుతోంది. కొత్త వేరియంట్లు, సబ్ వేరియంట్లతో ఈ వ్యాధి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్త వేరియంట్లు, సబ్ వేరియంట్లు భారత్ సహా పలు దేశాల్లో ఉద్భవించాయి.

ఇటీవలే కొత్త సబ్ వేరియంట్ JN.1 అలజడి సృష్టిస్తోంది. ఈ వేరియంట్‌ను భారతదేశంలోనూ గుర్తించారు. ఈ వ్యాధి సోకిన మొదటి కేసు కేరళలో గుర్తించారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక ఇతర దేశాలలో కూడా JN.1 వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి.

దగ్గు లేదా తుమ్మడం వల్ల కలిగే శ్వాసకోశ కణాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా కరోనా వైరస్ వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన ఉపరితలాన్ని తాకడం ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది. దాని వైరస్ చాలా కాలం పాటు ఉపరితలంపై సజీవంగా ఉంటుంది. ఈ వైరస్ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది

ఇంకా చదవండి

Coronavirus: మళ్లీ కరోనా కలకలం.. ఒమిక్రాన్ RF 5 వేరియంట్‌ లక్షణాలు ఎలా ఉంటాయంటే..?

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌పై ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో కేసులు నమోదవగా, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అధిక కేసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు జిల్లాల్లో మొత్తం 16 కేసులు నమోదవగా, కొన్ని నమూనాల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్.. మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయంటే..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ వెలుగుచూస్తుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జూన్ 26 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 13 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు గుర్తించగా, గుంటూరులో 3, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. వైరస్ జన్యుక్రమ విశ్లేషణ కోసం ఐదు నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించారు.

COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. వైద్య ఆరోగ్య శాఖ కీలక సూచన

COVID-19 Cases: దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కోవిడ్-19 కేసులు బయటపడటంతో, కరోనావైరస్ తిరిగి రావడం, మళ్లీ లాక్‌డౌన్ గురించి గుర్తు చేసుకుంటున్నారు. మరోసారి 2020 నాటి తీవ్రమైన పరిస్థితి వైపు వెళ్తున్నామా అనే ఆందోళనను ప్రజలలో మళ్లీ టెన్షన్ పెట్టిస్తోంది. అయితే, ప్రజలు..

COVID Variant: ఓర్నాయనో.. మరో కొత్త రూపాన్ని సంతరించుకున్న కరోనా.. సికాడా లక్షణాలు ఎలా ఉంటాయంటే..

కరోనా మళ్లీ కొత్త రూపాన్ని సంతరించుకుంది. సికాడా అనే వేరియంట్‌ అమెరికా, దక్షిణాఫ్రికా, యూరప్ దేశాల్లో విస్తరిస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఈ వేరియంట్ వల్ల ప్రమాదం పెరగడం గానీ, ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి రావడం గానీ జరుగుతున్నట్లు ఎక్కడా రుజువు కాలేదు. ఇంకా సాధారణ జలుబు, జ్వరం లాగే వచ్చి తగ్గుతుంది.

Covid 19: కోవిడ్‌ వ్యాక్సిన్‌తో గుండెపోటు మరణాలు..! సీఎం స్టేట్‌మెంట్‌పై సీరమ్‌ సంస్థ స్పందన.. ఏం చెప్పారంటే?

కోవిడ్ మహమ్మారి తర్వాత గుండెపోటు మరణాలు పెరిగాయని నివేదికలు వస్తున్నాయి. కొందరు కోవిడ్ టీకాలతో ఈ పెరుగుదలను ముడివేస్తున్నారు. అయితే, ICMR, AIIMS అధ్యయనాలు టీకాలు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయని చూపించాయి. అయితే సీఎం సిద్ధరామయ్య చేసిన ఆరోపణలపై తాజాగా సీరమ్ సంస్థ స్పందించింది.

  • SN Pasha
  • Updated on: Jul 3, 2025
  • 3:54 pm

India Covid-19: కరోనాతో ముగ్గురు మృతి.. తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు ఎన్ని ఉన్నాయంటే..

భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. పదులు, వందలుగా ఉన్న కేసులు.. ఇప్పుడు వేలకువేలుగా పెరిగిపోవడం భయాందోళన కలిగిస్తోంది.. గురువారం కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో (గురువారం ఉదయం) దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,154కి పెరిగిందని ఆరోగ్య - కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Covid-19: అయ్య బాబోయ్.. భారీగా పెరిగిన కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు ఎన్ని ఉన్నాయంటే..

దేశంలో మరోసారి అడుగుపెట్టిన కరోనా రక్కసి.. అంతకంతకూ విజృంభిస్తోంది. పదులు, వందలుగా ఉన్న కేసులు.. ఇప్పుడు వేలకువేలుగా పెరిగిపోవడం చూస్తుంటే మళ్లీ పాతరోజులొస్తాయా అన్న భయాందోళన వ్యక్తమవుతోంది. భారతదేశంలో గత కొన్ని రోజులుగా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 306 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి..

అమ్మ బాబోయ్.. పెరుగుతున్న కరోనా కేసులు.. జనవరి నుంచి ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారంటే..

దేశంలో మరోసారి అడుగుపెట్టిన కరోనా రక్కసి.. అంతకంతకూ విజృంభిస్తోంది. పదులు, వందలుగా ఉన్న కేసులు... ఇప్పుడు వేలకువేలుగా పెరిగిపోవడం చూస్తుంటే మళ్లీ పాతరోజులొస్తాయా అన్న భయాందోళన వ్యక్తమవుతోంది. కొన్ని రోజుల్లోనే మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 6 వేలు క్రాస్‌ అయింది.. భారతదేశంలో ఆదివారం నాటికి యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 6000 మార్కును దాటింది..

Coronavirus: భారత్‌లో 6వేలు దాటిన కరోనా యాక్టివ్‌ కేసులు.. 24 గంటల్లో వైరస్‌తో ఆరుగురు మృతి

కొత్తగా వస్తోంది...! సరికొత్త రాగంతో మెల్లమెల్లగా మరణమృదంగం మోగిస్తూ... జనాల్లో భయం పుట్టిస్తోంది. దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్న తీరు ఆందోళనకు గురిచేస్తోంది. గత 24 గంటల్లో ఆరుగురు మృతి చెందడం పాత రోజుల్ని గుర్తుచేస్తోంది. దేశంలో వైరస్ లేటెస్ట్ అప్ డేట్స్ ఇలా ఉన్నాయి..

Coronavirus: వర్షకాలంలో కరోనా తుఫాన్‌.! అలర్ట్‌గా ఉండండి

వర్షకాలంలో కరోనా తుఫాన్‌.! మళ్లీ అల‌ర్ట్ అవ్వాల్సిన స‌మ‌యం వచ్చేసింది. అందరూ లైట్ తీసుకుంటున్నారు కానీ.. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5 వేలకు చేరుతుంది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 4వేల 866. సైంటిస్టులు సైతం ఊహించని దూకుడు అది. భయపెట్టడానికి చెబుతుంది కాదిది. ప్రస్తుతం డేటా ఇస్తున్న వార్నింగ్‌.

ఔట్‌డేటెడ్‌ కాదు.. అప్‌డేటెడ్.. కలవరపెడుతున్న కొత్త వేరియెంట్.. మళ్లీ వ్యాక్సిన్లు తప్పవా?

'కొవిడ్‌ కేసులు 4వేలు' అని ఓ బ్రేకింగ్‌ న్యూస్‌ స్టైల్‌లో చెప్పగానే.. 'గతంలో లక్షల కేసులు చూశాం నాలుగువేలకే ఎందుకంత కంగారు' అని అనాలనిస్తోంది కదా. నిజమే.. కంగారు పడాల్సిన అవసరమే లేదు. బట్.. ఓ డేటా చెబుతా వినండి. జనవరిలో ఒక కొవిడ్‌ కేసు. ఫిబ్రవరి మొత్తం మీద ఒక కేసు. మార్చిలో అయితే జీరో. ఒక్క కొవిడ్‌ కేసు లేదు. ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా జస్ట్‌ నాలుగు యాక్టివ్‌ కేసులు. ఈ లెక్కన మే నెల నెంబర్‌ ఎంత ఉండొచ్చని మీ అంచనా. ఊహించలేరు. ఏకంగా 503.

Covid-19 in India: అమ్మబాబోయ్.. గత 24 గంటల్లో కరోనాతో ఏడుగురు మృ‌తి.. యాక్టివ్ కేసులు ఎన్ని ఉన్నాయంటే..

చాప కింద నీరులా, దేశంలో కరోనా వ్యాపిస్తోంది. ఇక ఏపీ, తెలంగాణలో కూడా కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు మెల్లగా పెరుగుతున్నాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరిగింది.