AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: మోడీ అదానీకి దోచిపెడుతున్నారు.. దొంగ డబ్బుతో ప్రభుత్వాలను కూల్చుతున్నారు.. మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

వరంగల్ ఉమ్మడి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ప్రతిమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏనుగుల్లు గ్రామంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ప్రారంభించారు.

KTR: మోడీ అదానీకి దోచిపెడుతున్నారు.. దొంగ డబ్బుతో ప్రభుత్వాలను కూల్చుతున్నారు.. మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
Minister Ktr, Pm Modi
Basha Shek
|

Updated on: Mar 08, 2023 | 9:54 PM

Share

వరంగల్ ఉమ్మడి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ప్రతిమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏనుగుల్లు గ్రామంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ప్రారంభించారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫౌండేషన్‌ చైర్మన్‌ బోయినపల్లి శ్రీనివాసరావు సొంతూరు ఏనుగల్లులో తొలి క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ శిబిరం నిర్వహించారు. మొత్తం మూడు రోజులపాటు నిర్వహించే ఈ శిబిరంలో పలు రకాల వైద్యచికిత్సలు, టెస్టులు నిర్వహిస్తారు. ఉమ్మడి వరంగల్‌జిల్లాలో ప్రతినెలలో రెండు శిబిరాలు మండల స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరులో జరిగిన మహిళా సాధికారత సభలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ప్రధాని మోదీపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్. వన్‌ నేషన్‌- వన్‌ ఫ్రెండ్ పేరుతో కొత్త స్కీమ్‌ తెచ్చారని ఆరోపించారు..మొత్తం సొమ్మునంతా అదానీకి దోచిపెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఆ దొంగ డబ్బుుతోనే ఎమ్మెల్యేలను కొంటూ..ప్రభుత్వాలను కూల్చుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియమైన ప్రధాని కాదు…పిరమైన ప్రధాని అంటూ ఛలోక్తులు విసిరారు.

అనంతరం మంత్రి కేటీఆర్‌ తొర్రూరులో మోడల్‌ మార్కెట్‌, యతిరాజారావ్‌ పార్క్‌ను ప్రారంభించారు. ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌లో డాక్టర్‌ ప్రీతి కుటుంబసభ్యులను మంత్రి కేటీఆర్‌ పరామర్శించారు. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తేలేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. అక్కడి నుంచి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌కు ఫోన్‌చేసి కేసు విచారణ వేగవంతం చేసి నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి కేటీఆర్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?