AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: ఎంఐఎం బలోపేతం కోసమే సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ.. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

పార్లమెంట్‌లో టీఆర్ఎస్‌కు ఉన్న 8 సీట్లతో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎలా చక్రం తిప్పుతారంటూ కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎంఐఎం బలోపేతం కోసమే కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారంటూ ఆరోపించారు.

Kishan Reddy: ఎంఐఎం బలోపేతం కోసమే సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ.. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
Kishan Reddy
Shaik Madar Saheb
|

Updated on: Oct 03, 2022 | 2:48 PM

Share

పార్లమెంట్‌లో టీఆర్ఎస్‌కు ఉన్న 8 సీట్లతో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎలా చక్రం తిప్పుతారంటూ కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎంఐఎం బలోపేతం కోసమే కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారంటూ ఆరోపించారు. వ్యతిరేక భావనతో వచ్చే ఏ పార్టీకీ మనుగడ ఉండదంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా పెరుగుతోందన్నారు. ఆ పార్టీకి మిగిలిన ఏకైన మిత్రపక్షం మజ్లిస్‌ అని.. కేసీఆర్‌ జాతీయ పార్టీ ఎందుకు పెడుతున్నారో ఆ పార్టీ నేతలకే తెలియదంటూ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ వైఫల్యాల మీద చర్చ జరగొద్దనేదే కేసీఆర్‌ ఆలోచన అని తెలిపారు. సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో కలలు కంటున్నారంటూ విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబసభ్యులకు నిద్రలోనూ ఈడీ, సీబీఐ, ఐటీ కనిపిస్తున్నాయంటూ కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

మునుగోడు అభివృద్ధి కోసమే ఈ ఉప ఎన్నికలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే ఈ కొద్ది రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ పాలన పట్ల అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఎవరూ నిలిచినా మునుగోడులో విజయం బీజేపీదేనని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ఈ ఉప ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలుస్తామన్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో టీఆర్ఎస్‌కు భవిష్యత్‌ ఉండదని.. కల్వకుంట్ల కుటుంబం అంధకారంలోకి పోతోందని తెలిపారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్-టీఆర్ఎస్ కలిసి కుట్ర చేసే అవకాశం ఉందని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కమ్యూనిస్ట్ సానుభూతి పరులంతా కేసీఆర్ కుటుంబ పాలనపై వ్యతిరేకతతో ఉన్నారని.. వాళ్ల మనస్సంతా మోదీపైనే ఉంటుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికలు కల్వకుంట్ల కుటుంబ పాలనకు రిఫరెండమ్ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

వాంఖడే సాక్షిగా చరిత్ర సృష్టించిన సూర్య..కోహ్లీ రికార్డ్ బ్రేక్
వాంఖడే సాక్షిగా చరిత్ర సృష్టించిన సూర్య..కోహ్లీ రికార్డ్ బ్రేక్
మద్యం మత్తులో దారుణం.. పెట్రోల్‌ పోసి యువకుడి హత్య!
మద్యం మత్తులో దారుణం.. పెట్రోల్‌ పోసి యువకుడి హత్య!
వాలెంటైన్స్ డే.. భారీగా హోటల్‌ రూమ్‌ బుకింగ్స్‌!
వాలెంటైన్స్ డే.. భారీగా హోటల్‌ రూమ్‌ బుకింగ్స్‌!
టీమిండియా వరల్డ్ రికార్డ్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ సంచలనం
టీమిండియా వరల్డ్ రికార్డ్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ సంచలనం
ఓటీటీలో రవితేజ సంక్రాంతి హిట్ సినిమా.. ' స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీలో రవితేజ సంక్రాంతి హిట్ సినిమా.. ' స్ట్రీమింగ్ డేట్ ఇదే
ప్రేమపెళ్లి చేసుకుని తప్పుచేశా.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి సూసైడ్
ప్రేమపెళ్లి చేసుకుని తప్పుచేశా.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి సూసైడ్
టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ బైక్‌లు, స్కూటర్లు.. ధర ఎంతో తెలుసా?
టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ బైక్‌లు, స్కూటర్లు.. ధర ఎంతో తెలుసా?
జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌!
జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌!
హోమ్‌వర్క్‌ చేయలేదనీ.. 2వ తరగతి పిల్లాడిని చితకబాదిన టీచర్‌!
హోమ్‌వర్క్‌ చేయలేదనీ.. 2వ తరగతి పిల్లాడిని చితకబాదిన టీచర్‌!
కేవలం 300 సెకన్లలో రూ.2700 కోట్ల చారిత్రాత్మక డీల్ చేశారట..!
కేవలం 300 సెకన్లలో రూ.2700 కోట్ల చారిత్రాత్మక డీల్ చేశారట..!